అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా త్వరలో లాక్ డౌన్ విధించటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా వినిపిస్తున్న ఈ మాట గ్రామీణ స్థాయికి వెళ్లిపోయింది.
దీంతో.. మళ్లీ లాక్ డౌన్ అయితే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అనుభవాలతో.. మూడు రోజులుగా సూపర్ మార్కెట్లలో రద్దీ పెరిగింది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిత్యవసర వస్తువుల్ని భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో.. కిరాణా.. సూపర్ మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది. తాజా లాక్ డౌన్ ఊహాగానాలపై రాష్ట్రాలు కానీ.. కేంద్రం కాని స్పందించకపోవటంతో.. ఈ వాదన మరింత జోరందుకుంది. ఎట్టకేలకు తాజాగా ఈ అంశంపై కేంద్రం స్పందించింది. మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచనలో కేంద్రం లేదని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేల్చింది. వదంతుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. లాక్ డౌన్ ను సంపూర్ణ లాక్ డౌన్ కిందకు మార్చే ఆలోచన ప్రస్తుతం కేంద్రానికి లేదన్న కేంద్రం.. ఇలాంటివి నమ్మవద్దని కోరింది. సో.. మరోసారి దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విదిస్తున్నారన్న మాట ఉత్త మాటగా చెప్పక తప్పదు.
This post was last modified on June 15, 2020 4:07 pm
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…