Political News

కేసీఆర్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు

ల్యాంకోహిల్స్‌… ఒక‌ప్పుడు ఈ పేరు హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సంచ‌ల‌నం. అయితే, అదే రీతిలో వివాదాస్ప‌దంగా కూడా మారింది. ప్ర‌భుత్వానికి – వ‌క్ఫ్ బోర్డుకు మ‌ధ్య ఈ భూముల యాజ‌మాన్య హ‌క్కుల విష‌యంలో ఏర్ప‌డిన పేచీ వ‌ల్ల‌ హైద‌రాబాద్‌లోని మ‌ణికొండలో ఏర్పాటైన ఈ భారీ ట‌వ‌ర్స్ భూములు వివాదంలో చిక్కుకున్నాయి.

అయితే, ఈ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. 1654.32 ఎక‌రాలు తెలంగాణ ప్ర‌భుత్వానివే అని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. మ‌ణికొండ జాగీర్ భూముల‌పై త‌మ‌కే హ‌క్కు ఉంద‌ని వ‌క్ఫ్ బోర్డ్ వాదించింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం, వ‌క్ఫ్ బోర్డు మ‌ధ్య‌ హైకోర్టులో వాదోప‌వాదాలు సాగాయి. 2012, ఏప్రిల్ 3న వ‌క్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

సుదీర్ఘ వాదోప‌వాదాల అనంత‌రం మ‌ణికొండ‌ భూముల విష‌యంలో గ‌తంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప‌క్క‌న పెట్టేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టేసింది. జ‌స్టిస్ హేమంత్ గుప్తా బెంచ్ 156 పేజీల తీర్పును నేడు వెలువ‌రించింది. మొత్తం భూముల‌పై స‌ర్వ‌హ‌క్కులు తెలంగాణ ప్ర‌భుత్వానివే అని కోర్టు పేర్కొంది.

ఎన్నో ఏళ్లుగా ప్ర‌భుత్వానికి, వ‌క్ఫ్ బోర్డు మ‌ధ్య వివాదానికి తెర‌దించుతూ వెలువ‌రించిన ఈ తీర్పులో ఇనామ్ భూముల చెల్లింపులు పెండింగ్ ఉంటే 6 నెల‌ల్లో చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది. భూముల స్వాధీనంలో వ‌క్ఫ్ బోర్డు ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం కుద‌ర‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. వ‌క్ఫ్ భూముల‌ని భావిస్తే ఆధారాల‌తో నోటీసులు ఇవ్వాల‌ని కోర్టు సూచించింది. స‌ర్వే నివేదిక‌ను ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని ఆదేశించింది. భూములు వ‌క్ఫ్ బోర్డువ‌ని తేలితే రూ. 50 వేల కోట్లు క‌డుతామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం తెలిపింది. 

This post was last modified on February 7, 2022 5:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

39 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

59 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago