ల్యాంకోహిల్స్… ఒకప్పుడు ఈ పేరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సంచలనం. అయితే, అదే రీతిలో వివాదాస్పదంగా కూడా మారింది. ప్రభుత్వానికి – వక్ఫ్ బోర్డుకు మధ్య ఈ భూముల యాజమాన్య హక్కుల విషయంలో ఏర్పడిన పేచీ వల్ల హైదరాబాద్లోని మణికొండలో ఏర్పాటైన ఈ భారీ టవర్స్ భూములు వివాదంలో చిక్కుకున్నాయి.
అయితే, ఈ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1654.32 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మణికొండ జాగీర్ భూములపై తమకే హక్కు ఉందని వక్ఫ్ బోర్డ్ వాదించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు మధ్య హైకోర్టులో వాదోపవాదాలు సాగాయి. 2012, ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం మణికొండ భూముల విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. జస్టిస్ హేమంత్ గుప్తా బెంచ్ 156 పేజీల తీర్పును నేడు వెలువరించింది. మొత్తం భూములపై సర్వహక్కులు తెలంగాణ ప్రభుత్వానివే అని కోర్టు పేర్కొంది.
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డు మధ్య వివాదానికి తెరదించుతూ వెలువరించిన ఈ తీర్పులో ఇనామ్ భూముల చెల్లింపులు పెండింగ్ ఉంటే 6 నెలల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. భూముల స్వాధీనంలో వక్ఫ్ బోర్డు ఇష్టారీతిలో వ్యవహరించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. వక్ఫ్ భూములని భావిస్తే ఆధారాలతో నోటీసులు ఇవ్వాలని కోర్టు సూచించింది. సర్వే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించింది. భూములు వక్ఫ్ బోర్డువని తేలితే రూ. 50 వేల కోట్లు కడుతామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
This post was last modified on February 7, 2022 5:53 pm
రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…
మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత…
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…