Political News

కేసీఆర్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు

ల్యాంకోహిల్స్‌… ఒక‌ప్పుడు ఈ పేరు హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సంచ‌ల‌నం. అయితే, అదే రీతిలో వివాదాస్ప‌దంగా కూడా మారింది. ప్ర‌భుత్వానికి – వ‌క్ఫ్ బోర్డుకు మ‌ధ్య ఈ భూముల యాజ‌మాన్య హ‌క్కుల విష‌యంలో ఏర్ప‌డిన పేచీ వ‌ల్ల‌ హైద‌రాబాద్‌లోని మ‌ణికొండలో ఏర్పాటైన ఈ భారీ ట‌వ‌ర్స్ భూములు వివాదంలో చిక్కుకున్నాయి.

అయితే, ఈ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. 1654.32 ఎక‌రాలు తెలంగాణ ప్ర‌భుత్వానివే అని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. మ‌ణికొండ జాగీర్ భూముల‌పై త‌మ‌కే హ‌క్కు ఉంద‌ని వ‌క్ఫ్ బోర్డ్ వాదించింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం, వ‌క్ఫ్ బోర్డు మ‌ధ్య‌ హైకోర్టులో వాదోప‌వాదాలు సాగాయి. 2012, ఏప్రిల్ 3న వ‌క్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

సుదీర్ఘ వాదోప‌వాదాల అనంత‌రం మ‌ణికొండ‌ భూముల విష‌యంలో గ‌తంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప‌క్క‌న పెట్టేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టేసింది. జ‌స్టిస్ హేమంత్ గుప్తా బెంచ్ 156 పేజీల తీర్పును నేడు వెలువ‌రించింది. మొత్తం భూముల‌పై స‌ర్వ‌హ‌క్కులు తెలంగాణ ప్ర‌భుత్వానివే అని కోర్టు పేర్కొంది.

ఎన్నో ఏళ్లుగా ప్ర‌భుత్వానికి, వ‌క్ఫ్ బోర్డు మ‌ధ్య వివాదానికి తెర‌దించుతూ వెలువ‌రించిన ఈ తీర్పులో ఇనామ్ భూముల చెల్లింపులు పెండింగ్ ఉంటే 6 నెల‌ల్లో చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది. భూముల స్వాధీనంలో వ‌క్ఫ్ బోర్డు ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం కుద‌ర‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. వ‌క్ఫ్ భూముల‌ని భావిస్తే ఆధారాల‌తో నోటీసులు ఇవ్వాల‌ని కోర్టు సూచించింది. స‌ర్వే నివేదిక‌ను ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని ఆదేశించింది. భూములు వ‌క్ఫ్ బోర్డువ‌ని తేలితే రూ. 50 వేల కోట్లు క‌డుతామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం తెలిపింది. 

Satya

Recent Posts

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

42 minutes ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

45 minutes ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

3 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

3 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

3 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

4 hours ago