ల్యాంకోహిల్స్… ఒకప్పుడు ఈ పేరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సంచలనం. అయితే, అదే రీతిలో వివాదాస్పదంగా కూడా మారింది. ప్రభుత్వానికి – వక్ఫ్ బోర్డుకు మధ్య ఈ భూముల యాజమాన్య హక్కుల విషయంలో ఏర్పడిన పేచీ వల్ల హైదరాబాద్లోని మణికొండలో ఏర్పాటైన ఈ భారీ టవర్స్ భూములు వివాదంలో చిక్కుకున్నాయి.
అయితే, ఈ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1654.32 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మణికొండ జాగీర్ భూములపై తమకే హక్కు ఉందని వక్ఫ్ బోర్డ్ వాదించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు మధ్య హైకోర్టులో వాదోపవాదాలు సాగాయి. 2012, ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం మణికొండ భూముల విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. జస్టిస్ హేమంత్ గుప్తా బెంచ్ 156 పేజీల తీర్పును నేడు వెలువరించింది. మొత్తం భూములపై సర్వహక్కులు తెలంగాణ ప్రభుత్వానివే అని కోర్టు పేర్కొంది.
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డు మధ్య వివాదానికి తెరదించుతూ వెలువరించిన ఈ తీర్పులో ఇనామ్ భూముల చెల్లింపులు పెండింగ్ ఉంటే 6 నెలల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. భూముల స్వాధీనంలో వక్ఫ్ బోర్డు ఇష్టారీతిలో వ్యవహరించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. వక్ఫ్ భూములని భావిస్తే ఆధారాలతో నోటీసులు ఇవ్వాలని కోర్టు సూచించింది. సర్వే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించింది. భూములు వక్ఫ్ బోర్డువని తేలితే రూ. 50 వేల కోట్లు కడుతామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
This post was last modified on February 7, 2022 5:53 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…