Political News

గోవాను కూడా చెడగొట్టేశారే!

ఎన్నిక‌లు వ‌చ్చాయంటే ఏ ప‌రిస్థితులు ఎలాంటి దారి తీసుకుంటాయో ఊహించ‌డం క‌ష్టం. ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో పార్టీలు వివిధ ప‌రిణామాల‌కు తెర‌తీస్తాయి. సామాజిక వ‌ర్గం, మ‌తం, కులం.. ఇలా అన్ని ర‌కాలుగా ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తాయి. దేశ రాజకీయాల్లో ఈ వ్య‌వ‌హారం ఎప్ప‌టినుంచో కొన‌సాగుతోంది. కానీ దేశంలోని గోవా రాష్ట్రంలో మాత్రం ఈ ఎన్నిక‌ల్లోనే స‌రికొత్త‌గా కుల రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కుల స‌మీక‌ర‌ణాల ఆధారంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయ‌ని అంటున్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఆమెను వెన‌కుండి న‌డిపిస్తున్న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఎంట్రీ ఇవ్వ‌డం కూడా అందుకు ఓ కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ప‌ర్యాట‌కుల‌తో ఎప్పుడూ సంద‌డిగా ఉండే గోవా రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌లు వేడి రాజేశాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బిహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌న్నీ కుల రాజ‌కీయాల‌పైనే న‌డుస్తాయి.

కానీ గోవాలో అందుకు విభిన్నంగా ప‌రిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల పుణ్య‌మా అని అక్క‌డ కూడా కుల రాజ‌కీయాలు పుట్టుకొచ్చాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో భండారీల‌కు 18 చోట్ల మంచి ప‌ట్టుంది. దీంతో ఈ వ‌ర్గం వాళ్ల‌ను ఆక‌ట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్ పార్టీలు దృష్టి సారించాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఏకంగా భండారీ స‌మాజ్‌కు చెందిన అమిత్ పాలేక‌ర్‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీశారు. దీంతో ఇత‌ర పార్టీలు కూడా ఈ సామాజిక వ‌ర్గంపై ధ్యాస పెట్టాల్సి వ‌చ్చింది.

పార్టీని ఇత‌ర రాష్ట్రాల‌కు విస్త‌రించి ప‌ట్టు పెంచుకోవాల‌ని చూస్తున్న టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఎన్నిక‌ల వ్యూహంలో త‌న‌దైన శైలిలో దూసుకెళ్తున్నారు. గోవాలో అధికారం కోసం అక్క‌డి పార్టీల‌తో క‌లిసి పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఆమె కూడా భండారీ సామాజిక‌వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఆరుగురికి బీజేపీ, ముగ్గురికి కాంగ్రెస్ సీట్లు క‌ట్ట‌బెట్టాయి. మ‌రోవైపు గోవాలో కుల రాజ‌కీయాల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌ద‌ని మ‌రో వ‌ర్గం వాదిస్తోంది. కానీ పార్టీలు మాత్రం త‌మ ప్ర‌య‌త్నాల్లో మునిగిపోయాయి. భండారీల త‌ర్వాత అత్య‌ధిక ఓట‌ర్లు ఉన్న‌ర ఖ‌ర్వా వ‌ర్గంతోపాటు ఎస్సీ, ఎస్టీల మ‌ద్ద‌తు కూట‌గ‌ట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తున్నాయి. 

This post was last modified on February 1, 2022 6:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

2 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

2 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

5 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

6 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

7 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

7 hours ago