Political News

గోవాను కూడా చెడగొట్టేశారే!

ఎన్నిక‌లు వ‌చ్చాయంటే ఏ ప‌రిస్థితులు ఎలాంటి దారి తీసుకుంటాయో ఊహించ‌డం క‌ష్టం. ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో పార్టీలు వివిధ ప‌రిణామాల‌కు తెర‌తీస్తాయి. సామాజిక వ‌ర్గం, మ‌తం, కులం.. ఇలా అన్ని ర‌కాలుగా ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తాయి. దేశ రాజకీయాల్లో ఈ వ్య‌వ‌హారం ఎప్ప‌టినుంచో కొన‌సాగుతోంది. కానీ దేశంలోని గోవా రాష్ట్రంలో మాత్రం ఈ ఎన్నిక‌ల్లోనే స‌రికొత్త‌గా కుల రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కుల స‌మీక‌ర‌ణాల ఆధారంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయ‌ని అంటున్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఆమెను వెన‌కుండి న‌డిపిస్తున్న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఎంట్రీ ఇవ్వ‌డం కూడా అందుకు ఓ కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ప‌ర్యాట‌కుల‌తో ఎప్పుడూ సంద‌డిగా ఉండే గోవా రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌లు వేడి రాజేశాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బిహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌న్నీ కుల రాజ‌కీయాల‌పైనే న‌డుస్తాయి.

కానీ గోవాలో అందుకు విభిన్నంగా ప‌రిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల పుణ్య‌మా అని అక్క‌డ కూడా కుల రాజ‌కీయాలు పుట్టుకొచ్చాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో భండారీల‌కు 18 చోట్ల మంచి ప‌ట్టుంది. దీంతో ఈ వ‌ర్గం వాళ్ల‌ను ఆక‌ట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్ పార్టీలు దృష్టి సారించాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఏకంగా భండారీ స‌మాజ్‌కు చెందిన అమిత్ పాలేక‌ర్‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీశారు. దీంతో ఇత‌ర పార్టీలు కూడా ఈ సామాజిక వ‌ర్గంపై ధ్యాస పెట్టాల్సి వ‌చ్చింది.

పార్టీని ఇత‌ర రాష్ట్రాల‌కు విస్త‌రించి ప‌ట్టు పెంచుకోవాల‌ని చూస్తున్న టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఎన్నిక‌ల వ్యూహంలో త‌న‌దైన శైలిలో దూసుకెళ్తున్నారు. గోవాలో అధికారం కోసం అక్క‌డి పార్టీల‌తో క‌లిసి పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఆమె కూడా భండారీ సామాజిక‌వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఆరుగురికి బీజేపీ, ముగ్గురికి కాంగ్రెస్ సీట్లు క‌ట్ట‌బెట్టాయి. మ‌రోవైపు గోవాలో కుల రాజ‌కీయాల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌ద‌ని మ‌రో వ‌ర్గం వాదిస్తోంది. కానీ పార్టీలు మాత్రం త‌మ ప్ర‌య‌త్నాల్లో మునిగిపోయాయి. భండారీల త‌ర్వాత అత్య‌ధిక ఓట‌ర్లు ఉన్న‌ర ఖ‌ర్వా వ‌ర్గంతోపాటు ఎస్సీ, ఎస్టీల మ‌ద్ద‌తు కూట‌గ‌ట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తున్నాయి. 

This post was last modified on February 1, 2022 6:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

9 minutes ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

48 minutes ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

1 hour ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

1 hour ago

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళ – తెలంగాణ మధ్య నిప్పు రాజుకుంది

కేర‌ళ రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…

2 hours ago