Political News

చంద్ర‌బాబు కూడా త‌ప్పులు చేశారు.. చింతమ‌నేని

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కావాల‌నే కేసులు పెడుతున్నార‌ని.. అదేస‌మ‌యంలో మీడియా కూడా త‌న‌పై లేనిపోనివి ప్ర‌చారం చేసి…త‌న‌ను క్రిమిన‌ల్ మాదిరిగా చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నించింద‌ని.. దీంతో త‌ను పెద్ద త‌ప్పుడు నాయ‌కుడిన‌ని.. ప్ర‌జ‌లు భావించేలా చేశార‌ని అన్నారు.అయితే..త‌నేమిటో.. తెలియ‌ని వారు ఇలా చేస్తే.. బాధ ఉండేది కాద‌ని. కానీ అన్నీ తెలిసిన మీడియా స‌హా నాగురించి తెలిసిన‌.. జ‌గ‌న్ కూడా నాపై కేసులు పెట్టి బ‌ద్నాం చేయ‌డం బాధ క‌లిగించింద‌న్నారు.

ఈ విష‌యంలో మా పార్టీ నేత‌లు.. ఏమ‌నుకున్నా.. పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా త‌ప్పు చేశార‌ని.. అన్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేసి ఆయ‌న త‌ప్పులు చేశార‌న్నారు. అడ‌గ‌కుండానే ప్ర‌జ‌లకు సౌకర్యాలు క‌ల్పించేందుకు సిమెంటు రోడ్లు వేయించార‌ని చెప్పారు. ఆక‌లి వేసిన వాడికి అన్నం పెట్టాల‌ని.. కానీ.. ఆక‌లి వేయ‌నివాడికి కూడా అన్నం పెడితే… అతి అయిపోతుంద‌ని.. చంద్ర‌బాబు ఇదే చేశార‌ని.. చెప్పారు. ఉపాధి హామీ ప‌నుల్లో 60 శాతం మెటీరియ‌ల్ కాంపొనెంట్ తెచ్చి, 40 శాతం లేబ‌ర్ కాంపొనెంట్ తెచ్చి.. రాష్ట్ర విడిపోయిన త‌ర్వాత‌… ఈ రాష్ట్రాన్ని అలికి ముగ్గు పెట్టాల‌న‌ని క‌ల‌లు క‌న్నార‌ని చెప్పారు.

అయితే.. చంద్ర‌బాబు క‌న్న క‌ల‌ల‌ను ప్ర‌జ‌లు స్వీక‌రించ‌లేద‌ని అన్నారు. రోడ్లు వేస్తుంటే.. దానిలో మాకు వాటాలు ఉన్నాయ‌ని.. మేం దోచుకున్నామ‌న‌ని.. ఈ ప్ర‌జ‌లు భావించారు. దీనికి కార‌ణం.. మేం అతి చేయ‌డ‌మే. మ‌మ్మ‌ల్ని రోడ్డు అడ‌గ‌కుండానే రోడ్డు వేయ‌డం త‌ప్పు క‌దా?!  ఇది మాకు, మా పార్టీకి బుద్ధి వ‌చ్చేలా చేసింద‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన ప‌నుల‌కు సంబంధించి మాకు, మానాయ‌కుల‌కు ఇప్ప‌టికీ 75 శాతం నిధులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. పాల‌కుడు దుర్మార్గుడు కావ‌డంతో మా నాయ‌కులు అనేక మంది చేసిన‌ప‌నుల‌కు సంబంధించి తెచ్చిన సొమ్ముకు.. ఆస్తులు అమ్మి అప్పులు క‌ట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందన్నారు.

గ‌తంలో చేసిన ప‌నుల‌ను ప‌రిశీలిస్తే.. కాంట్రాక్ట‌ర్ మార్జిన్ లేకుండానే చంద్ర‌బాబు ఎస్టిమేష‌న్లు చేయించా ర‌ని తెలిపారు. ఈ ప‌నులు చేస్తే. పార్టీకి, నేత‌ల‌కు మంచి పేరు వ‌స్తుంద‌ని.. భావించి చంద్ర‌బాబు చేసిన ప‌నులతో మేం ఇప్పుడు అప్పుల పాల‌య్యాం. మా నాయ‌కులు చెప్పార‌ని.. కాంట్రాక్ట‌ర్లు.. అన్నీ వ‌దులుకుని కూడా ప‌నులు చేశార‌న్నారు. దీంతో నాయ‌కులు ఆర్థికంగా దెబ్బ‌తిని.. త‌ద్వారా.. పార్టీ ఈరోజు దెబ్బ‌తినిపోయింద‌న్నారు. 

This post was last modified on February 1, 2022 3:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

2 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

5 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

6 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

9 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

10 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

11 hours ago