Political News

చంద్ర‌బాబు కూడా త‌ప్పులు చేశారు.. చింతమ‌నేని

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కావాల‌నే కేసులు పెడుతున్నార‌ని.. అదేస‌మ‌యంలో మీడియా కూడా త‌న‌పై లేనిపోనివి ప్ర‌చారం చేసి…త‌న‌ను క్రిమిన‌ల్ మాదిరిగా చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నించింద‌ని.. దీంతో త‌ను పెద్ద త‌ప్పుడు నాయ‌కుడిన‌ని.. ప్ర‌జ‌లు భావించేలా చేశార‌ని అన్నారు.అయితే..త‌నేమిటో.. తెలియ‌ని వారు ఇలా చేస్తే.. బాధ ఉండేది కాద‌ని. కానీ అన్నీ తెలిసిన మీడియా స‌హా నాగురించి తెలిసిన‌.. జ‌గ‌న్ కూడా నాపై కేసులు పెట్టి బ‌ద్నాం చేయ‌డం బాధ క‌లిగించింద‌న్నారు.

ఈ విష‌యంలో మా పార్టీ నేత‌లు.. ఏమ‌నుకున్నా.. పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా త‌ప్పు చేశార‌ని.. అన్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేసి ఆయ‌న త‌ప్పులు చేశార‌న్నారు. అడ‌గ‌కుండానే ప్ర‌జ‌లకు సౌకర్యాలు క‌ల్పించేందుకు సిమెంటు రోడ్లు వేయించార‌ని చెప్పారు. ఆక‌లి వేసిన వాడికి అన్నం పెట్టాల‌ని.. కానీ.. ఆక‌లి వేయ‌నివాడికి కూడా అన్నం పెడితే… అతి అయిపోతుంద‌ని.. చంద్ర‌బాబు ఇదే చేశార‌ని.. చెప్పారు. ఉపాధి హామీ ప‌నుల్లో 60 శాతం మెటీరియ‌ల్ కాంపొనెంట్ తెచ్చి, 40 శాతం లేబ‌ర్ కాంపొనెంట్ తెచ్చి.. రాష్ట్ర విడిపోయిన త‌ర్వాత‌… ఈ రాష్ట్రాన్ని అలికి ముగ్గు పెట్టాల‌న‌ని క‌ల‌లు క‌న్నార‌ని చెప్పారు.

అయితే.. చంద్ర‌బాబు క‌న్న క‌ల‌ల‌ను ప్ర‌జ‌లు స్వీక‌రించ‌లేద‌ని అన్నారు. రోడ్లు వేస్తుంటే.. దానిలో మాకు వాటాలు ఉన్నాయ‌ని.. మేం దోచుకున్నామ‌న‌ని.. ఈ ప్ర‌జ‌లు భావించారు. దీనికి కార‌ణం.. మేం అతి చేయ‌డ‌మే. మ‌మ్మ‌ల్ని రోడ్డు అడ‌గ‌కుండానే రోడ్డు వేయ‌డం త‌ప్పు క‌దా?!  ఇది మాకు, మా పార్టీకి బుద్ధి వ‌చ్చేలా చేసింద‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన ప‌నుల‌కు సంబంధించి మాకు, మానాయ‌కుల‌కు ఇప్ప‌టికీ 75 శాతం నిధులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. పాల‌కుడు దుర్మార్గుడు కావ‌డంతో మా నాయ‌కులు అనేక మంది చేసిన‌ప‌నుల‌కు సంబంధించి తెచ్చిన సొమ్ముకు.. ఆస్తులు అమ్మి అప్పులు క‌ట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందన్నారు.

గ‌తంలో చేసిన ప‌నుల‌ను ప‌రిశీలిస్తే.. కాంట్రాక్ట‌ర్ మార్జిన్ లేకుండానే చంద్ర‌బాబు ఎస్టిమేష‌న్లు చేయించా ర‌ని తెలిపారు. ఈ ప‌నులు చేస్తే. పార్టీకి, నేత‌ల‌కు మంచి పేరు వ‌స్తుంద‌ని.. భావించి చంద్ర‌బాబు చేసిన ప‌నులతో మేం ఇప్పుడు అప్పుల పాల‌య్యాం. మా నాయ‌కులు చెప్పార‌ని.. కాంట్రాక్ట‌ర్లు.. అన్నీ వ‌దులుకుని కూడా ప‌నులు చేశార‌న్నారు. దీంతో నాయ‌కులు ఆర్థికంగా దెబ్బ‌తిని.. త‌ద్వారా.. పార్టీ ఈరోజు దెబ్బ‌తినిపోయింద‌న్నారు. 

This post was last modified on February 1, 2022 3:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

23 minutes ago

ఇళయరాజా పోరాటం… వేరొకరికి ఆదాయం

తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…

1 hour ago

దొంగకే దెబ్బ… ChatGPTతో చుక్కలు చూపించిన కుర్రాడు

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…

1 hour ago

సాయిపల్లవి నిర్ణయాలు అందుకే ఆలస్యం

గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…

2 hours ago

కొంప ముంచిన ఇండిగో స్ట్రాటజీ

హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…

2 hours ago

చంద్రబాబు, పవన్, లోకేష్ పై అంత మాట అన్నారంటి జగన్?

ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…

3 hours ago