Political News

చంద్ర‌బాబు కూడా త‌ప్పులు చేశారు.. చింతమ‌నేని

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కావాల‌నే కేసులు పెడుతున్నార‌ని.. అదేస‌మ‌యంలో మీడియా కూడా త‌న‌పై లేనిపోనివి ప్ర‌చారం చేసి…త‌న‌ను క్రిమిన‌ల్ మాదిరిగా చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నించింద‌ని.. దీంతో త‌ను పెద్ద త‌ప్పుడు నాయ‌కుడిన‌ని.. ప్ర‌జ‌లు భావించేలా చేశార‌ని అన్నారు.అయితే..త‌నేమిటో.. తెలియ‌ని వారు ఇలా చేస్తే.. బాధ ఉండేది కాద‌ని. కానీ అన్నీ తెలిసిన మీడియా స‌హా నాగురించి తెలిసిన‌.. జ‌గ‌న్ కూడా నాపై కేసులు పెట్టి బ‌ద్నాం చేయ‌డం బాధ క‌లిగించింద‌న్నారు.

ఈ విష‌యంలో మా పార్టీ నేత‌లు.. ఏమ‌నుకున్నా.. పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా త‌ప్పు చేశార‌ని.. అన్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేసి ఆయ‌న త‌ప్పులు చేశార‌న్నారు. అడ‌గ‌కుండానే ప్ర‌జ‌లకు సౌకర్యాలు క‌ల్పించేందుకు సిమెంటు రోడ్లు వేయించార‌ని చెప్పారు. ఆక‌లి వేసిన వాడికి అన్నం పెట్టాల‌ని.. కానీ.. ఆక‌లి వేయ‌నివాడికి కూడా అన్నం పెడితే… అతి అయిపోతుంద‌ని.. చంద్ర‌బాబు ఇదే చేశార‌ని.. చెప్పారు. ఉపాధి హామీ ప‌నుల్లో 60 శాతం మెటీరియ‌ల్ కాంపొనెంట్ తెచ్చి, 40 శాతం లేబ‌ర్ కాంపొనెంట్ తెచ్చి.. రాష్ట్ర విడిపోయిన త‌ర్వాత‌… ఈ రాష్ట్రాన్ని అలికి ముగ్గు పెట్టాల‌న‌ని క‌ల‌లు క‌న్నార‌ని చెప్పారు.

అయితే.. చంద్ర‌బాబు క‌న్న క‌ల‌ల‌ను ప్ర‌జ‌లు స్వీక‌రించ‌లేద‌ని అన్నారు. రోడ్లు వేస్తుంటే.. దానిలో మాకు వాటాలు ఉన్నాయ‌ని.. మేం దోచుకున్నామ‌న‌ని.. ఈ ప్ర‌జ‌లు భావించారు. దీనికి కార‌ణం.. మేం అతి చేయ‌డ‌మే. మ‌మ్మ‌ల్ని రోడ్డు అడ‌గ‌కుండానే రోడ్డు వేయ‌డం త‌ప్పు క‌దా?!  ఇది మాకు, మా పార్టీకి బుద్ధి వ‌చ్చేలా చేసింద‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన ప‌నుల‌కు సంబంధించి మాకు, మానాయ‌కుల‌కు ఇప్ప‌టికీ 75 శాతం నిధులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. పాల‌కుడు దుర్మార్గుడు కావ‌డంతో మా నాయ‌కులు అనేక మంది చేసిన‌ప‌నుల‌కు సంబంధించి తెచ్చిన సొమ్ముకు.. ఆస్తులు అమ్మి అప్పులు క‌ట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందన్నారు.

గ‌తంలో చేసిన ప‌నుల‌ను ప‌రిశీలిస్తే.. కాంట్రాక్ట‌ర్ మార్జిన్ లేకుండానే చంద్ర‌బాబు ఎస్టిమేష‌న్లు చేయించా ర‌ని తెలిపారు. ఈ ప‌నులు చేస్తే. పార్టీకి, నేత‌ల‌కు మంచి పేరు వ‌స్తుంద‌ని.. భావించి చంద్ర‌బాబు చేసిన ప‌నులతో మేం ఇప్పుడు అప్పుల పాల‌య్యాం. మా నాయ‌కులు చెప్పార‌ని.. కాంట్రాక్ట‌ర్లు.. అన్నీ వ‌దులుకుని కూడా ప‌నులు చేశార‌న్నారు. దీంతో నాయ‌కులు ఆర్థికంగా దెబ్బ‌తిని.. త‌ద్వారా.. పార్టీ ఈరోజు దెబ్బ‌తినిపోయింద‌న్నారు. 

This post was last modified on February 1, 2022 3:15 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

3 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

5 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

5 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

7 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

10 hours ago