Political News

ఎక్స్‌గ్రేషియా వద్దు.. వాడ్ని నడిరోడ్డు మీద ఉరి తీయాలి

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన పద్నాలుగేళ్ల బాలిక ఆత్మహత్య ఉదంతం.. విన్న వారందరి కంట కన్నీరు కార్పిస్తోంది. స్థానిక రాజకీయ నేతగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా.. అపార్ట్ మెంట్ పెద్ద మనిషిగా వ్యవహరించే వినోద్ జైన్ అనే కామపిశాచి దాహానికి పద్నాలుగేళ్ల చిన్నారి బలైంది. ఈ దారుణం షాకింగ్ గా మారటమే కాదు.. ఇలాంటి నీచుడ్ని అంత తేలికగా వదలకూడదన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లి అనురాధ మాట్లాడుతూ.. తన కుమార్తె గురించి చెప్పిన వివరాల్ని విన్నంతనే అయ్యో.. అన్న ఆవేదన కలుగక మానదు.

మా బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకున్నాం.. ఇప్పటివరకు బిడ్డ రక్తపు చుక్క కూడా చూడలేదు. చదువులో నా బిడ్డ టాపర్. మల్టీ టాలెంటెడ్. ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు పాప ఏడ్చింది. అడిగితే.. మిమ్మల్ని మిస్ అవుతున్నానని బాధ పడింది.  ఆత్మహత్య చేసుకునే రోజు సాయంత్రం చివరిసారి నాతో మాట్లాడింది. అమ్మ ఐలవ్యూ అంటూ రెండు సార్లు పిలిచి.. గట్టిగా హగ్ చేసుకుంది. అప్పటికే ఐదు పేజీల సూసైడ్ నోట్ నా బిడ్డ రాసుకుంది. టుడే ఈజ్ లాస్ట్ డే.

డెత్ డే అంటూ సూసైడ్ నోట్లో రాసింది. ఎవరో ఒక పాప బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయిందని చెప్పటంతో వెళ్లి చూశాం. చివరకు మా అమ్మాయి చనిపోయింది. నా చిట్టి తల్లి ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన వినోద్ జైన్ను నడిరోడ్డులో ఎన్ కౌంటర్ చేయలి. అప్పుడే నా బిడ్డ ఆత్మ శాంతిస్తుంది’’ అంటూ తన అక్రోశాన్ని వ్యక్తం చేసింది.
మనమరాలి వయసున్న చిన్నారిని దారుణంగా వేధించిన వినోద్ జైన్ ను శిక్షించాలని.. ఏ తల్లికీ తమలాంటి గర్భశోకం కలగకూడదంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటామని.. తమకు ఎలాంటి ఎక్స్ గ్రేషియా అక్కర్లేదని.. మరో బిడ్డకు ఇలాంటి గతి పట్టకూడదని వాపోయారు.

మా పాపకు న్యాయం చేయాలన్న ఆ తల్లిదండ్రుల ఆవేదన చూస్తే.. మనసంతా విషాదంతో నిండిపోతుంది. ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వాలు.. ఎక్స్ గ్రేషియాను ప్రకటించటం తెలిసిందే. అయితే.. తమకు అలాంటివేమీ అక్కర్లేదని.. తమ బిడ్డ చావుకు కారణమైనోడిని కఠినంగా శిక్షించాలన్న పాప తల్లి చేసిన డిమాండ్ ను పలువురు సమర్థిస్తున్నారు. డబ్బుతో అన్ని తిరిగి రావు.. కానీ..కఠినమైన శిక్షల్ని తక్షణం విధించటం ద్వారా.. నేరం చేయాలనే వారిలో వణుకు పుడుతుందన్నది మర్చిపోకూడదు. మరి.. ఈ ఉదంతంలో జగన్ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.

Satya

Recent Posts

పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?

వైసీపీలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. పీఏసీకి…

2 hours ago

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…

4 hours ago

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం…

5 hours ago

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

6 hours ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

7 hours ago

బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!

పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…

7 hours ago