Political News

ఎక్స్‌గ్రేషియా వద్దు.. వాడ్ని నడిరోడ్డు మీద ఉరి తీయాలి

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన పద్నాలుగేళ్ల బాలిక ఆత్మహత్య ఉదంతం.. విన్న వారందరి కంట కన్నీరు కార్పిస్తోంది. స్థానిక రాజకీయ నేతగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా.. అపార్ట్ మెంట్ పెద్ద మనిషిగా వ్యవహరించే వినోద్ జైన్ అనే కామపిశాచి దాహానికి పద్నాలుగేళ్ల చిన్నారి బలైంది. ఈ దారుణం షాకింగ్ గా మారటమే కాదు.. ఇలాంటి నీచుడ్ని అంత తేలికగా వదలకూడదన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లి అనురాధ మాట్లాడుతూ.. తన కుమార్తె గురించి చెప్పిన వివరాల్ని విన్నంతనే అయ్యో.. అన్న ఆవేదన కలుగక మానదు.

మా బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకున్నాం.. ఇప్పటివరకు బిడ్డ రక్తపు చుక్క కూడా చూడలేదు. చదువులో నా బిడ్డ టాపర్. మల్టీ టాలెంటెడ్. ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు పాప ఏడ్చింది. అడిగితే.. మిమ్మల్ని మిస్ అవుతున్నానని బాధ పడింది.  ఆత్మహత్య చేసుకునే రోజు సాయంత్రం చివరిసారి నాతో మాట్లాడింది. అమ్మ ఐలవ్యూ అంటూ రెండు సార్లు పిలిచి.. గట్టిగా హగ్ చేసుకుంది. అప్పటికే ఐదు పేజీల సూసైడ్ నోట్ నా బిడ్డ రాసుకుంది. టుడే ఈజ్ లాస్ట్ డే.

డెత్ డే అంటూ సూసైడ్ నోట్లో రాసింది. ఎవరో ఒక పాప బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయిందని చెప్పటంతో వెళ్లి చూశాం. చివరకు మా అమ్మాయి చనిపోయింది. నా చిట్టి తల్లి ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన వినోద్ జైన్ను నడిరోడ్డులో ఎన్ కౌంటర్ చేయలి. అప్పుడే నా బిడ్డ ఆత్మ శాంతిస్తుంది’’ అంటూ తన అక్రోశాన్ని వ్యక్తం చేసింది.
మనమరాలి వయసున్న చిన్నారిని దారుణంగా వేధించిన వినోద్ జైన్ ను శిక్షించాలని.. ఏ తల్లికీ తమలాంటి గర్భశోకం కలగకూడదంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటామని.. తమకు ఎలాంటి ఎక్స్ గ్రేషియా అక్కర్లేదని.. మరో బిడ్డకు ఇలాంటి గతి పట్టకూడదని వాపోయారు.

మా పాపకు న్యాయం చేయాలన్న ఆ తల్లిదండ్రుల ఆవేదన చూస్తే.. మనసంతా విషాదంతో నిండిపోతుంది. ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వాలు.. ఎక్స్ గ్రేషియాను ప్రకటించటం తెలిసిందే. అయితే.. తమకు అలాంటివేమీ అక్కర్లేదని.. తమ బిడ్డ చావుకు కారణమైనోడిని కఠినంగా శిక్షించాలన్న పాప తల్లి చేసిన డిమాండ్ ను పలువురు సమర్థిస్తున్నారు. డబ్బుతో అన్ని తిరిగి రావు.. కానీ..కఠినమైన శిక్షల్ని తక్షణం విధించటం ద్వారా.. నేరం చేయాలనే వారిలో వణుకు పుడుతుందన్నది మర్చిపోకూడదు. మరి.. ఈ ఉదంతంలో జగన్ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on February 1, 2022 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

2 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

2 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

3 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

3 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

4 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

5 hours ago