Political News

రోజాకు ఝ‌ల‌క్ త‌ప్ప‌దా..?

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, జ‌బ‌ర్ద‌స్త్ రోజాకు ఈ సారికూడా ఝ‌ల‌క్ త‌ప్ప‌ద‌నే అంటున్నారు ప‌రిశీల‌కు లు. 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని చిత్తూరు జిల్లా న‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకున్న రోజా.. 2014లో పార్టీ కోసం.. ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అసెంబ్లీలో అప్ప‌టి స‌ర్కారుపైనా.. సీఎం చంద్ర‌బాబుపైనా నిప్పులు చెరిగారు. ఈ క్ర‌మంలోనే ఏడాది పాటు స‌స్పెండ్ కు కూడా గుర‌య్యారు. ఇలా పార్టీకోసం.. ఏమైనా చేసేందుకు నేను సిద్ధ‌మ‌నే సంకేతాల‌ను బ‌లంగా పంపించారు. దీంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులే వేయించుకున్నారు.

ఈ క్ర‌మంలో 2019లో వైసీపీ స‌ర్కారు వ‌చ్చినప్పుడు త‌న‌కు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని.. ఆమె ఆశించారు. అంతేకాదు.. ఏకంగా హోం శాఖ మంత్రిగా ఆమెను జ‌గ‌న్ కూర్చోబెడ‌తార‌ని.. ప‌రోక్షంగా వార్త‌లు కూడా రాయించుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. అయితే.. చిత్తూరు జిల్లా నుంచి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు, పెద్ద త‌ల‌కాయ్‌గాభావించే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి, ఎస్సీ కోటాలో నారాయ‌ణ స్వామికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. దీంతో రోజా ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. కొన్ని రోజులు అలిగిన ఆమె త‌ర్వాత‌.. ఏపీఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌వికి క‌ట్ట‌బెట్ట‌డంతో శాంతించారు. అయితే..ఇ ప్ప‌డు మ‌రోసారి మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే దీనిని పూర్తి చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ… కొన్ని కార‌ణాల‌తో వాయిదా వేవారు. దీనిని ఉగాది త‌ర్వాత‌.. చేప‌డ‌తార‌ని తెలుస్తోంది. అయితే.. అప్పుడు కూడా రోజాకు అవ‌కాశం ద‌క్క‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే.,. కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు.  ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో చేర్చారు. దీంతో పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేవు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, కుప్పం నియోజకవర్గాలున్నాయి.

ఇదిలావుంటే, చిత్తూరు ను విభ‌జించి ఏర్పాటు చేయ‌నున్న శ్రీబాలాజీ జిల్లా నుంచి ఇద్ద‌రు కీల‌క నేత‌లు పోటీలో ఉన్నారు. శ్రీబాలాజీ జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి నియోజకవర్గాలున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గం శ్రీబాలాజీ జిల్లాలోకి వచ్చి చేరింది. అదేవిధంగా తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఒక‌వేళ శ్రీబాలాజీ జిల్లాకు.. మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని భావిస్తే.. ఖ‌చ్చితంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య పోటీ ఉంటుంది. అయితే.. సీఎం కుటుంబానికి ఆప్తుడిగా గుర్తింపు పొందిన చెవిరెడ్డికి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. అలాగ‌ని భూమ‌న‌ను ప‌క్క‌న పెడ‌తారా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

This post was last modified on January 30, 2022 10:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

39 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago