కరోనా మహమ్మారికి జాలి దయ అని ఏమీ లేదు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి పండు ముసలి వరకు అందరినీ కబళిస్తోంది. పిల్లలు, పెద్ద వాళ్ల మీదే తీవ్ర ప్రభావం చూపుతోంది. వారి ప్రాణాలను బలిపెడుతోంది. పెద్దవాళ్లెవరైనా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండి కరోనా సోకితే అంతే సంగతులు. వారి ప్రాణం మీదికి వస్తోంది. అలాగే చిన్న పిల్లలకు కరోనా సోకినా వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. పిల్లలు, ముసలి వాళ్లకు రోగ నిరోధక శక్తి తక్కువ కావడంతో కరోనా వేగంగా దాడి చేస్తోంది.
ఈ నేపథ్యంలో కేవలం నాలుగు నెలల వయసున్న పాపకు కరోనా సోకడంతో ఆ చిన్నారిని ఎలా కాపాడుకుంటామో తెలియక అల్లాడిపోయారు తల్లిదండ్రులు. కానీ ఆ చిన్నారికి అత్యుత్తమ చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడింది. కరోనాను జయించి తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఉదంతం.
తూర్పుగోదావరి జిల్లా మహిళ ఒకావిడకు కరోనా సోకింది. తర్వాత కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయగా.. నాలుగు నెలల వయసున్న ఆమె పాపకు కూడా కరోనా ఉన్నట్లు తేలింది. ఈ పాపను విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించి 18 రోజుల పాటు చికిత్స అందించారు. డాక్టర్లు ఈ పాప కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
18 రోజుల పాటు ఆ చిన్నారిని వెంటిలేటర్ మీదే పెట్టి చికిత్స అందించడంతో ముప్పు తొలగింది. తాజాగా పరీక్షలు చేసి చూడగా పాపలో కరోనా లక్షణాలు లేవని తేలింది. పాపను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. ఈ విషయాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియాకు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా నివారణ చర్యలు, చికిత్స విషయంలో మొదట విమర్శలు వచ్చాయి కానీ.. ఇప్పుడు ఏపీని అందరూ అభినందిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేయడమే కాక.. కరోనా చికిత్స విషయంలో ఏపీ అప్రమత్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఈ ఉదంతం తాజా ఉదాహరణ.
This post was last modified on June 13, 2020 11:19 pm
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…