తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసిన వైనంపై టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. అరెస్టుల్ని తాము కోర్టుల్లో ఎదుర్కొంటామన్న ఆయన.. తన సోదరుడిపై వస్తున్న ఆరోపణలపై పెద్దగా రియాక్టు కాకున్నా.. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఏమీ తెలీదన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టే సమర్థత వైఎస్సార్ పార్టీ నేతలకు ఉందన్న ఆయన.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేస్తున్నారన్నారు.
ఏపీ అధికారులంతా జగన్ ప్రభుత్వానికి జీ హుజూర్ అంటున్నారని.. బాబు వెంట ఉన్న వారందరిని అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేయాలన్న యోచనలో ఉన్నట్లు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నేతల ఆర్థిక మూలాల్ని దెబ్బ తీయాలన్న కుట్రకు తెర తీశారన్నారు. బ్రిటీష్ సర్కారు కంటే ఘోరమైనది జగన్ ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు.
తన సోదరుడు.. ఆయన కుమారుడు అరెస్టుపై జేసీ మాట్లాడుతూ.. మావాడు ఎవరిన్నీ లెక్క చేయడంటూ జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై స్పందించారు. తన చిన్నాన్నను రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారన్నారు.
విచారణ ఎదుర్కొనేందుకు పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించిన తర్వాత కూడా అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. అసలు సూత్రధారుల్ని వదిలేసి.. బాధితులైన తన చిన్నాన్న.. ఆయన కుమారుడ్ని అరెస్టు చేయటం సరికాదన్నారు.
This post was last modified on June 13, 2020 10:19 am
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…