Political News

ఏపీలో రాక్షస పాలన…: ప్రజలకు బాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఏడాది పాలనపై వైసీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తోంటే…టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ ఏడాది పాలనలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని…అభివృద్ధి అటకెక్కిందని దుయ్యబడుతున్నారు. వైసీపీ పాలనలో ఏపీలో సంక్షేమ పథకాలు ఆగిపోయాయని…ఇసుక కొరత మొదలు కరోనా కిట్ల కొనుగోలు వరకు అంతా అవినీతిమయమని విమర్శిస్తున్నారు. జగన్ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలకు బహిరంగ లేఖరాసిన చంద్రబాబు పలు విషయాలు వెల్లడించారు.

దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందని, కానీ, ఏపీలో మాత్రం జగన్ రాసిన రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి రాక్షస పాలన ఎక్కడా చూడలేదని, రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఇంతటి విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదని, ఇది కక్ష సాధింపు ప్రభుత్వం అని చంద్రబాబు విమర్శించారు. గత ఏడాదిగా రాష్ట్రంలో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని, వైసీపీ నేతల దుర్మార్గాలతో రాష్ట్రానికి కీడు జరుగుతోందని అన్నారు. జగన్ పాలనలో ప్రజలకు చేటు జరుగుతోందని తెలియజేసేందుకే తాను ఈ బహిరంగలేఖ రాస్తున్నానని చంద్రబాబు అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని.. పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపుతో రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల కోసం తెచ్చిన సంక్షేమ పథకాలు రద్దు చేశారు.. కరెంటు బిల్లులు, మద్యం ధరలు, ఇసుక, సిమెంటు ధరలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. ప్రజలపై రూ.50వేల కోట్ల భారం మోపారని, రూ.87వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు తరిమేడయంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందన్నారు చంద్రబాబు.

వైఎస్సార్‌సీపీ ఏడాది పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపిస్తే టీడీపీపై కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి విధ్వంసాలకు పాల్పడుతున్నారని.. ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నారని.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బెదిరించి, ప్రలోభపరిచి లొంగదీసుకోవడమే వాళ్ల సిద్ధాంతమన్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ గనుల యజమానులపై రూ.2వేల కోట్ల జరిమానాలు విధించారని.. నెల్లూరులో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఇళ్లు కూల్చేశారని.. పల్నాడులో భయానక వాతావరణంతో టీడీపీ కార్యకర్తల్ని ఊళ్లలోంచి తరిమేశారని విరుచుకుపడ్డారు.

ఏపీలో గత ఏడాది కాలంలో అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని..పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపు వంటి చర్యలతో రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేశారని, కరెంటు బిల్లులు, మద్యం ధరలు, ఇసుక, సిమెంటు ధరలు విపరీతంగా పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ప్రజలపై రూ.50వేల కోట్ల భారం మోపారని, రూ.87వేల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలనలోని లోపాలను ఎత్తిచూపిస్తే టీడీపీపై కక్షసాధిస్తున్నారని, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ప్రత్యర్థి నేతలను బెదిరించి, ప్రలోభపరిచి, వారి వ్యాపారలను దెబ్బతీస్తామని బెదిరించి లొంగదీసుకోవడమే వైసీపీ సిద్ధాంతమని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రకాశంలో గ్రానైట్‌ గనుల యజమానులపై రూ.2వేల కోట్ల జరిమానాలు విధించారని, నెల్లూరులో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఇళ్లు కూల్చేశారని, పల్నాడులో భయానక వాతావరణంతో టీడీపీ కార్యకర్తల్ని ఊళ్లలోంచి తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున అండగా నిలుస్తామని అన్నారు.

Satya

Recent Posts

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

13 minutes ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

47 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

3 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

4 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

4 hours ago