Political News

చార్టెడ్ ఫ్లైట్ లకు అనుమతివ్వాలని జగన్ లేఖ

మహమ్మారి వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్నీ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ ను కట్టడి చేయడానికి భారత్ తో పాటు పలు దేశాలలో లాక్ డౌన్ విధించడంతో వేలాది మంది విదేశాలలో చిక్కుకుపోయారు. ఉద్యోగం, వ్యాపారం, విద్య, పర్యాటకం…తదితర కారణాలతో లాక్ డౌన్ లో విదేశాల్లో భారతీయులు చాలామంది ఉండిపోయారు.

వీరందరినీ స్వదేశాలకు తరలించేందుకు కేంద్రం….వందే భారత్ మిషన్ చేపట్టింది. వందే భారత్ మిషన్ లో భాగంగా విమానాల ద్వారా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశాలకు కేంద్రం తరలిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో ఉన్న పలువురు తెలుగు వారు ఏపీకి, తెలంగాణకు వస్తున్నారు. అయితే, చార్టెడ్ విమానాలకు మాత్రం కేంద్రం అనుమతివ్వలేదు.

దీంతో, భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. మరిన్ని వందే భారత్ విమానాలను నడిపి ఏపీ వాసులను తీసుకురావాలని విన్నవించారు. ప్రవాసాంధ్రులను రప్పించేందుకు విమానాల సంఖ్యను పెంచడంతో పాటు చార్టెడ్ ఫ్లైట్ లకు అనుమతినివ్వాలని కోరారు.

కిర్గిజ్ స్థాన్, కతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్ తదితర దేశాల్లో చాలామంది తెలుగు వారు చిక్కుకుపోయారని జగన్ తెలిపారు. ఆయా దేశాల నుంచి ఏపీకి చార్టెడ్ ఫ్లైట్స్ ను అనుమతించాలని ప్రవాసాంధ్రులు కోరుతున్నాయని చెప్పారు. వందే భారత్ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ లను సాదరంగా ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు.

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ చాలా గొప్పదని జగన్ ప్రశంసించారు. విమానాల సంఖ్య పెంచడం, చార్టెడ్ ఫ్లైట్ లను అనుమతించడం ద్వారా మరింత వేగంగా….మరింత మందిని స్వరాష్ట్రాలకు తరలించవచ్చని జగన్ అన్నారు.

This post was last modified on June 12, 2020 8:38 am

Share
Show comments
Published by
satya
Tags: Jagan

Recent Posts

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

3 mins ago

ఎన్టీఆర్ పేరు చెప్పి బాబును టార్గెట్ చేస్తున్న నాని

గుడివాడ‌లో విజ‌యం కోసం నాని నానాపాట్లు ప‌డుతున్నారు. త‌న అనుచ‌రుల ఆగ‌డాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ…

31 mins ago

సుకుమార్ శిష్యులు మహా ఘటికులు

స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…

1 hour ago

మోడీ వ‌స్తున్నారు.. కూట‌మిలో జోష్‌, వైసీపీలో టెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న కూట‌మిలో మ‌రింత జోష్ పెర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే విజ‌యం ఖాయ‌మ‌నే ధీమాతో…

2 hours ago

వ్య‌తిరేక‌త జ‌గ‌న్ మీద కాదు ఎమ్మెల్యేల పైనే అంటా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అధికారం నిల‌బెట్టుకోవ‌డం జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా…

2 hours ago

శింగ‌న‌మ‌ల సింగ‌మ‌లై ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ పార్టీల‌న్నీ ప్ర‌చారంలో దూసుకెళ్తున్నాయి. అభ్య‌ర్థులు…

2 hours ago