Political News

చార్టెడ్ ఫ్లైట్ లకు అనుమతివ్వాలని జగన్ లేఖ

మహమ్మారి వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్నీ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ ను కట్టడి చేయడానికి భారత్ తో పాటు పలు దేశాలలో లాక్ డౌన్ విధించడంతో వేలాది మంది విదేశాలలో చిక్కుకుపోయారు. ఉద్యోగం, వ్యాపారం, విద్య, పర్యాటకం…తదితర కారణాలతో లాక్ డౌన్ లో విదేశాల్లో భారతీయులు చాలామంది ఉండిపోయారు.

వీరందరినీ స్వదేశాలకు తరలించేందుకు కేంద్రం….వందే భారత్ మిషన్ చేపట్టింది. వందే భారత్ మిషన్ లో భాగంగా విమానాల ద్వారా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశాలకు కేంద్రం తరలిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో ఉన్న పలువురు తెలుగు వారు ఏపీకి, తెలంగాణకు వస్తున్నారు. అయితే, చార్టెడ్ విమానాలకు మాత్రం కేంద్రం అనుమతివ్వలేదు.

దీంతో, భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. మరిన్ని వందే భారత్ విమానాలను నడిపి ఏపీ వాసులను తీసుకురావాలని విన్నవించారు. ప్రవాసాంధ్రులను రప్పించేందుకు విమానాల సంఖ్యను పెంచడంతో పాటు చార్టెడ్ ఫ్లైట్ లకు అనుమతినివ్వాలని కోరారు.

కిర్గిజ్ స్థాన్, కతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్ తదితర దేశాల్లో చాలామంది తెలుగు వారు చిక్కుకుపోయారని జగన్ తెలిపారు. ఆయా దేశాల నుంచి ఏపీకి చార్టెడ్ ఫ్లైట్స్ ను అనుమతించాలని ప్రవాసాంధ్రులు కోరుతున్నాయని చెప్పారు. వందే భారత్ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ లను సాదరంగా ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు.

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ చాలా గొప్పదని జగన్ ప్రశంసించారు. విమానాల సంఖ్య పెంచడం, చార్టెడ్ ఫ్లైట్ లను అనుమతించడం ద్వారా మరింత వేగంగా….మరింత మందిని స్వరాష్ట్రాలకు తరలించవచ్చని జగన్ అన్నారు.

This post was last modified on June 12, 2020 8:38 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

తిరుమలలో పాము కాటు… నిజమెంత?

తిరుమ‌ల‌పై మ‌రో దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కార‌ణం ఎవ‌రు? ఎక్క‌డ నుంచి జ‌రిగింది?…

3 hours ago

అసెంబ్లీలో ల‌డ్డూపై చ‌ర్చ‌.. కానీ జగన్…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దానికి త‌గిన విధంగా ప‌నిచే స్తున్నారా? అనేది…

6 hours ago

జగన్ వస్తే లోకేష్ టికెట్ ఇస్తారట

త‌న‌పై వైసీపీ నాయ‌కులు స‌హా.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…

7 hours ago

మణిరత్నం సినిమా… పెర్ఫామెన్సులు పేలిపోతాయ్

నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…

13 hours ago

215 కోట్ల ఆఫర్ వద్దనుకున్నారా

దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…

14 hours ago

‘భ‌ర్త సంపాద‌న ఎంతో భార్య‌కు చెప్ప‌క్క‌ర్లేదు’

స‌హ‌జంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్య‌లు ఆస‌క్తి చూపుతారు. ఈ విష‌యం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…

15 hours ago