Political News

నోటీసులతో మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోయిన రఘురామ

తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈసారి సంక్రాంతి పండక్కి.. తాను ప్రాతినిధ్యం వహించే నరసాపురానికి వెళ్లనున్నట్లుగా ఆయన ప్రకటన చేయటం తెలిసిందే. సొంత పార్టీ మీద అదే పనిగా విరుచుకుపడే రఘురామ.. తన ఊరికి వెళితే.. పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సంక్రాంతికి ఊరికి వెళ్లేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయనకు.. ఏపీ సీఐడీ వారి పుణ్యమా అని ఊహించని షాక్ తగలటం తెలిసిందే.


బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులు.. ఆయనకు నోటీసులుఇచ్చారు. గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంటూ వెళ్లిపోయారు. అయితే.. ఏ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారన్న దానిపై మాత్రం సమాచారం ఇవ్వలేదు. రఘురామను అరెస్టు చేయొద్దని.. సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసే అవకాశం లేదు.

అయినప్పటికీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ రఘురామకు మళ్లీ సీఐడీ నోటీసులు ఎందుకు వచ్చింది? సుప్రీం ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. నోటీసులు ఎందుకు ఇచ్చారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించని పరిస్థితి. ఇటీవల తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రఘురామ చెప్పటం తెలిసిందే. సంక్రాంతికి సొంతూరికి వెళతానని ఆయన ప్రకటించి.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకుంటున్న వేళలో హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. బుధవారం ఏపీ సీఐడీ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న రఘురామ.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి వెల్లిపోయినట్లుగా చెబుతున్నారు. తాజాగా అందజేసిన నోటీసుల నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణ గురించి చర్చలు జరిపేందుకు.. న్యాయ నిపుణులతో మాట్లాడేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. మొత్తమ్మీదా తాజా నోటీసుల పుణ్యమా అని.. సంక్రాంతికి ఊరికి వెళ్లలేని పరిస్థితి రఘురామకు ఎదురైందని చెప్పక తప్పదు.

This post was last modified on January 13, 2022 1:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునామీ సుడిగుండంలో జపాన్

జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…

57 minutes ago

మట్కాని చూపించే పద్దతి ఇది

మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…

4 hours ago

ఆదివారం పరీక్షలో విజేత ఎవరు

నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…

5 hours ago

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…

5 hours ago

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

13 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

14 hours ago