Political News

ఏపీ టికెట్ల వివాదంపై త‌ల‌సాని షాకింగ్ కామెంట్స్‌

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డంతో తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని భావిస్తున్న ధియట‌ర్ల య‌జ‌మానులు.. వాటిని మూసే స్తున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం థియేటర్ల‌లో త‌నిఖీలు ముమ్మ‌రం చేసింది. దీంతో మ‌రిన్ని మూత‌బ‌డు తున్నాయి.  దీంతో ఆయా ధియేట‌ర్ల‌లో ప‌నిచేస్తున్న అన్ని ర‌కాల సిబ్బంది రోడ్డున ప‌డిన‌ట్టు అయింది. థియేటర్ల విషయంలో ఏపీ ప్రభు త్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

థియేటర్లు మూసివేయడం వల్ల దాని మీద ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోతున్నారు.  ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై స‌ర్వ‌త్రా ఆగ్రహం వ్యక్తం  అవుతూనే ఉంది. ఇక‌, టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపుపై కొంద‌రు న‌టులు గొంతు విప్ప‌గా మ‌రికొంద‌రు మాత్రం మౌనంగా ఉన్నారు. ఇక‌, ఇటీవ‌ల రాంగోపాల్ వ‌ర్మ తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇంత‌లోనే చ‌ర్చ‌కు వెళ్లి మంత్రి పేర్ని నానితో చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే.. ఈ విష‌యం ఏం జ‌రిగిందో ఏమో.. 100 శాతం సంతృప్తి అంటూనే మ‌ళ్లీ హైద‌రాబాద్‌కు వెళ్లిన త‌ర్వాత‌.. విమ‌ర్శ‌ల ప‌రంప‌ర కొన‌సాగించారు.

ఇదిలావుంటే.. ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్లు, ధియోట‌ర్ల స‌మ‌స్య‌ను తాను ప‌రిష్క‌రిస్తాన‌ని తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు.  అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణలో టికెట్ ధరలు పెంచామని.. ఐదో ఆటకు అనుమతి ఇచ్చామన్నారు. ఏపీలో థియేటర్ల సమస్యపై తాను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తలసాని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు.

 సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవన్నారు. సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమ న్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందని తలసాని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు. తెలంగాణ లో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తలసాని పేర్కొన్నారు. ఏపీ స‌మ‌స్య‌ల‌పై తాను చ‌ర్చించి ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌న్నారు. 

This post was last modified on January 12, 2022 4:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

43 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago