ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు నిర్ణయంపై సర్వత్రా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్ ధరలు తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతామని భావిస్తున్న ధియటర్ల యజమానులు.. వాటిని మూసే స్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వం థియేటర్లలో తనిఖీలు ముమ్మరం చేసింది. దీంతో మరిన్ని మూతబడు తున్నాయి. దీంతో ఆయా ధియేటర్లలో పనిచేస్తున్న అన్ని రకాల సిబ్బంది రోడ్డున పడినట్టు అయింది. థియేటర్ల విషయంలో ఏపీ ప్రభు త్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
థియేటర్లు మూసివేయడం వల్ల దాని మీద ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతూనే ఉంది. ఇక, టికెట్ల ధరల తగ్గింపుపై కొందరు నటులు గొంతు విప్పగా మరికొందరు మాత్రం మౌనంగా ఉన్నారు. ఇక, ఇటీవల రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇంతలోనే చర్చకు వెళ్లి మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు. అయితే.. ఈ విషయం ఏం జరిగిందో ఏమో.. 100 శాతం సంతృప్తి అంటూనే మళ్లీ హైదరాబాద్కు వెళ్లిన తర్వాత.. విమర్శల పరంపర కొనసాగించారు.
ఇదిలావుంటే.. ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్లు, ధియోటర్ల సమస్యను తాను పరిష్కరిస్తానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణలో టికెట్ ధరలు పెంచామని.. ఐదో ఆటకు అనుమతి ఇచ్చామన్నారు. ఏపీలో థియేటర్ల సమస్యపై తాను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తలసాని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు.
సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవన్నారు. సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమ న్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందని తలసాని పేర్కొన్నారు. హైదరాబాద్లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు. తెలంగాణ లో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తలసాని పేర్కొన్నారు. ఏపీ సమస్యలపై తాను చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…