రాబోయే ఎన్నిలకు సంబంధించి శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీలో పెద్దమార్పులే జరగబోతున్నాయట. టీడీపీ యంగ్ టైగర్ గా క్రేజ్ అందుకుంటున్న శ్రీకాకుళం ఎంపీ ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో లేరని సమాచారం. నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరి ఎంపీ సీటును కాదని అసెంబ్లీకి ఎందుకు పోటీ చేయాలని కింజరాపు అనుకుంటున్నారనే విషయంలో క్లారిటి లేదు.
టీడీపీ ఆవిర్భావం తర్వాత శ్రీకాకుళం పార్లమెంటుకు కింజరాపు కుటుంబమే ఎక్కువసార్లు పోటీచేసింది. కింజరాపు ఎర్రన్నాయుడు వారసుడిగా రామ్మోహన్ నాయుడు ఎంపీ గా పోటీ చేసి గెలిచారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంపై కింజరాపు కుటుంబానికి మంచి పట్టుంది. మరంతటి పటున్న ఎంపీ నియోజకవర్గాన్ని కాదని నరసన్నపేట అసెంబ్లీకి పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు ? అన్నదే సస్పెన్సుగా మారింది. పైగా నరసన్నపేటలో టీడీపీ రికార్డు కూడా ఏమంత ఘనంగా లేదు.
ఇపుడు ఈ నియోజకవర్గం నుంచి ధర్మాన కృష్ణదాస్ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మాన కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటిది లోక్ సభ నియోజకవర్గాన్ని కాదని అసెంబ్లీకి పోటీ చేయటం ద్వారా రామ్మోహన్ నాయుడు గట్టిపోటీని ఎదుర్కోవాల్సొస్తుంది. పార్లమెంటు సీటుకు తనకు బదులుగా తన సోదరి, రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. వివాహమైపోయి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి వెళ్ళిపోయిన భవానానీని మళ్ళీ పుట్టింటికి ఎందుకు తీసుకువద్దామని అనుకుంటున్నారో తెలీటం లేదు.
ఇపుడు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బగ్గు రమణమూర్తి పరిస్ధితే అయోమయంగా తయారైంది. ఇదే సమయంలో కృష్ణదాస్ స్ధానంలో వచ్చే ఎన్నికల్లో ఆయన వారసుడు చైతన్య పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే ధర్మాన ప్రసాదరావుకు బదులు రాబోయే ఎన్నికల్లో ఆయన కొడుకు రమ్మనోహర్ నాయుడు పోటీలోకి దిగబోతున్నారనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. ఏదేమైనా శ్రీకాకుళం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పెద్ద మార్పులే ఉండబోతున్నట్లు అనిపిస్తోంది.
This post was last modified on January 10, 2022 5:33 pm
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…