ఓ వైపు కరోనా గురించి వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినీ తారలు అవగాహన కలిగించేందుకు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్, హ్యాండ్ వాష్, మాస్క్ ధరించడంపై వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో వాట్సాప్ యూనివర్సిటీల్లో పీహెచ్ డీలు చేసిన కొందరు నేతలు తమ పైత్యాన్నంతా ప్రజలపై రుద్దుతున్నారు. గోమూత్రంతో కరోనా పోతుందంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంపై విమర్శలు వచ్చాయి. ఇక గో కరోనా గో అంటూ బీజేపీ నేత అథవాలే అన్న మాటల పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే కరోనాపై వాట్సాప్ ప్రొఫెసర్లు వదిలిన ఎన్నో ఆణిముత్యాలు మనకు దొరుకుతాయి. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరారు. కరోనా కడుపులోకి చేరితే….పిప్పి పిప్పి అయి బయటకు వస్తుందంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ సభలో కరోనా వైరస్ గురించి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా వచ్చి పడిశంలో, గొంతులో ఉంటే శరీరానికి ఎక్కుతుందని, జ్వరం, జలుబు లేకపోతే కరోనా కడుపులోకి పోతుందని అన్నారు. మన కడుపులో మిషన్ మంచిదని, బొక్కలు(ఎముకలు), సిమెంట్ వంటి వాటిని కూడా నమిలిపెడుతుందని, కాబట్టి కడుపులోకి కరోనా పోతే పిప్పి పిప్పి అయ్యి బయటకు వస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గొంతులో, ముక్కులో శరీరంపై కరోనా ప్రభావం చూపుతుందన్న ఎర్రబెల్లి…వేడి నీటి ద్వారా కడుపులోకి వెళ్తే.. ఇబ్బందేం ఉండదంటూ సెలవిచ్చారు. ఎర్రబెల్లి కామెంట్స్ పై నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. డాక్టర్ ఎర్రబెల్లి…ఎంబీబీఎస్, ఎండీ, ఎఫ్ ఆర్సీఎస్, చైనా వచ్చేశారని…ఇక కరోనా పారిపోతుందని ట్రోల్ చేస్తున్నారు. ‘ఎర్రబెల్లి ఉండగా కరోనా గురించి భయమెందుకు దండగా’ అంటూ మరో నెటిజన్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఎర్రబెల్లి దెబ్బకు గజగజ వణికిపోతోన్న కరోనా అంటూ ఓ రేంజ్ లో సెటైర్లు, మీమ్స్ పేలుతున్నాయి. బెల్లీ థియరీతో ఎర్రబెల్లి లొల్లి అంటూ పంచ్ లు వేస్తున్నారు.
This post was last modified on June 10, 2020 8:31 pm
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…