Political News

జగన్‌కు మళ్లీ సుప్రీం కోర్టు పంచ్

కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది ఏపీ సర్కారుకు. రాష్ట్ర హైకోర్టులో ఏడాది కాలంలో ఏకంగా 60 సార్లకు పైగా మొట్టికాయలు వేయించుకున్న ఘనత జగన్ సర్కారుదే. అయినా ఆయనేమీ వెనక్కి తగ్గట్లేదు. కోర్టుల్లో నిలబడవని తెలిసినా కొన్ని నిర్ణయాల్లో ఆయన ముందుకెళ్లిపోతున్నారు. ఈ మధ్య ఆయనకు సుప్రీం కోర్టులో సైతం ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసిన విషయమై ఇటీవలే జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. ఇప్పుడు మరోసారి సర్వోన్నత న్యాయస్థానం ఏపీ సర్కారుకు ఝలక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ప్రసాద్‌‌ను తొలగించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్ చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ జగన్ సర్కారు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో ఏపీ సర్కారు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. కానీ రమేష్ కుమార్‌ను తొలగించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్, జీవోలను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి మాత్రం సుప్రీం కోర్టు నిరాకరించింది.

ఏపీ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్‌ను పక్కన పెట్టాలని హైకోర్టు ఆదేశించడంతో రమేష్ కుమార్ తిరిగి సీీఈసీగా బాధ్యతలు చేపట్టడానికి రెడీ అయ్యారు. కానీ అందుకు జగన్ సర్కారు అంగీకరించలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి.. ఆయనకు బ్రేక్ వేయాలని చూసింది. ఇప్పుడు అక్కడా ఎదురు దెబ్బ తగలడంతో ప్రభుత్వం ఏమీ చేయడానికి లేకపోయింది. రమేష్ కుమార్ తిరిగి సీఈసీ కావడం లాంఛనమే అని న్యాయ నిపుణులు అంటున్నారు. మరి ఆయనకు అడ్డు కట్ట వేయడానికి జగన్ సర్కారు ఇంకే మార్గం వెతుకుతుందో చూడాలి.

This post was last modified on June 10, 2020 5:50 pm

Share
Show comments
Published by
satya
Tags: APECJagan

Recent Posts

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…

1 hour ago

చిన్న దర్శకుడి మీద పెద్ద బాధ్యత

మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…

1 hour ago

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి…

2 hours ago

ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…

3 hours ago

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…

3 hours ago

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

3 hours ago