కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది ఏపీ సర్కారుకు. రాష్ట్ర హైకోర్టులో ఏడాది కాలంలో ఏకంగా 60 సార్లకు పైగా మొట్టికాయలు వేయించుకున్న ఘనత జగన్ సర్కారుదే. అయినా ఆయనేమీ వెనక్కి తగ్గట్లేదు. కోర్టుల్లో నిలబడవని తెలిసినా కొన్ని నిర్ణయాల్లో ఆయన ముందుకెళ్లిపోతున్నారు. ఈ మధ్య ఆయనకు సుప్రీం కోర్టులో సైతం ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసిన విషయమై ఇటీవలే జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. ఇప్పుడు మరోసారి సర్వోన్నత న్యాయస్థానం ఏపీ సర్కారుకు ఝలక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ ప్రసాద్ను తొలగించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్ చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ జగన్ సర్కారు వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో ఏపీ సర్కారు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. కానీ రమేష్ కుమార్ను తొలగించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్, జీవోలను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి మాత్రం సుప్రీం కోర్టు నిరాకరించింది.
ఏపీ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్ను పక్కన పెట్టాలని హైకోర్టు ఆదేశించడంతో రమేష్ కుమార్ తిరిగి సీీఈసీగా బాధ్యతలు చేపట్టడానికి రెడీ అయ్యారు. కానీ అందుకు జగన్ సర్కారు అంగీకరించలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి.. ఆయనకు బ్రేక్ వేయాలని చూసింది. ఇప్పుడు అక్కడా ఎదురు దెబ్బ తగలడంతో ప్రభుత్వం ఏమీ చేయడానికి లేకపోయింది. రమేష్ కుమార్ తిరిగి సీఈసీ కావడం లాంఛనమే అని న్యాయ నిపుణులు అంటున్నారు. మరి ఆయనకు అడ్డు కట్ట వేయడానికి జగన్ సర్కారు ఇంకే మార్గం వెతుకుతుందో చూడాలి.
This post was last modified on June 10, 2020 5:50 pm
లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సెన్సేషన్ ముకుల్ చౌదరి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. కేకేఆర్ పై అతను…
వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అధికారం చుట్టూ తిరిగిన కీలక…
రాజకీయం ఇప్పుడు డబ్బు చుట్టూ నడుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా...ఇది పచ్చి నిజం. డబ్బు లేనిది ఏ ఒక్క…
ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ కొత్త పోకడలు పోతోంది. మొదలైనప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయడం దగ్గరి…
గతంలో ఒక సినిమాకు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకునేవారు. ఎలాగైనా చెప్పిన డేటుకే…
నిన్న సాయంత్రం నుంచి విజయ్ అభిమానులకు నిద్ర రావడం లేదు. ముందు జన నాయకుడు లీక్స్ అంటూ తమిళ వెర్షన్…