మళ్ళీ అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. విజృంభిస్తున్న కరోనా వైరస్ అమెరికాను పూర్తిగా వణికించేస్తోంది. గడచిన 24 గంటల్లో అమెరికా మొత్తంమీద సుమారు 6 లక్షల కేసులు నమోదయ్యాయి. చాల కాలం తర్వాత ఇన్ని లక్షల కేసులు అమెరికాలో నమోద్దవటంతో సంచలనంగా మారింది. వీరిలో సుమారు 1400 మంది చనిపోవటంతో అగ్రరాజ్యంలో కలకలం మొదలైంది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో సుమారు 22 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజ రోజుకు పెరిగిపోతున్నాయట.
సగటున ప్రతిరోజు 10 వేలమంది పెద్దలు, 500 మంది పిల్లాలు కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిల్లో చేరుతున్నారు. మళ్ళీ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో క్రిక్కిరిసిపోతున్నాయి. ఆసుపత్రుల బెడ్ల స్ధాయికి మించి రోగులు వచ్చేస్తుండటంతో వారిని చేర్చుకోవటానికి ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఒకపుడు కొలంబియా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలే జరగటం అప్పట్లో సంచలనమైంది.
ఆసుపత్రుల్లో బెడ్లు లేక, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ సంఖ్య సరిపోక అప్పట్లో రోగులను చాలా ఆసుపత్రులు చేర్చుకోలేదు. మళ్ళీ అలాంటి పరిస్ధితి అమెరికాలో ఇపుడు కనబడుతోంది. ఒకేరోజు 6 లక్షల కేసులంటే మామూలు విషయం కాదు. ఇపుడు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో, కరోనా బారిన పడుతున్న వాళ్ళల్లో కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారు కూడా ఉన్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. అంటే టీకాలు వేసుకున్నా కూడా కరోనా వైరస్ నుండి నూరుశాతం రక్షణ రావటం లేదన్నది అర్ధమవుతోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే కోవిడ్ టీకాలు వేయించుకున్నా తాజా వేరియంట్ ఒమిక్రాన్ టీకాను బురిడి కొట్టించి శరీరంలోకి ప్రవేశిస్తోందని వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పారు. కాకపోతే టీకాలు తీసుకోని వాళ్ళమీద చూపించినంత ప్రభావం టీకాలు తీసుకున్న వాళ్ళలో కనబవడటం లేదని కూడా శాస్త్రజ్ఞులు తేల్చారు. కేసులు పెరుగుతున్న కారణంగా అమెరికాలో బూస్టర్ డోసు వేయటాన్ని స్పీడుచేశారు. ఏదేమైనా కరోనా వైరస్ అమెరికాలో మళ్ళీ విజృంభిస్తోందంటే యావత్ ప్రపంచం అప్రమత్తమైపోతోంది.
This post was last modified on January 1, 2022 11:40 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…