మళ్ళీ అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. విజృంభిస్తున్న కరోనా వైరస్ అమెరికాను పూర్తిగా వణికించేస్తోంది. గడచిన 24 గంటల్లో అమెరికా మొత్తంమీద సుమారు 6 లక్షల కేసులు నమోదయ్యాయి. చాల కాలం తర్వాత ఇన్ని లక్షల కేసులు అమెరికాలో నమోద్దవటంతో సంచలనంగా మారింది. వీరిలో సుమారు 1400 మంది చనిపోవటంతో అగ్రరాజ్యంలో కలకలం మొదలైంది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో సుమారు 22 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజ రోజుకు పెరిగిపోతున్నాయట.
సగటున ప్రతిరోజు 10 వేలమంది పెద్దలు, 500 మంది పిల్లాలు కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిల్లో చేరుతున్నారు. మళ్ళీ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో క్రిక్కిరిసిపోతున్నాయి. ఆసుపత్రుల బెడ్ల స్ధాయికి మించి రోగులు వచ్చేస్తుండటంతో వారిని చేర్చుకోవటానికి ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఒకపుడు కొలంబియా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలే జరగటం అప్పట్లో సంచలనమైంది.
ఆసుపత్రుల్లో బెడ్లు లేక, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ సంఖ్య సరిపోక అప్పట్లో రోగులను చాలా ఆసుపత్రులు చేర్చుకోలేదు. మళ్ళీ అలాంటి పరిస్ధితి అమెరికాలో ఇపుడు కనబడుతోంది. ఒకేరోజు 6 లక్షల కేసులంటే మామూలు విషయం కాదు. ఇపుడు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో, కరోనా బారిన పడుతున్న వాళ్ళల్లో కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారు కూడా ఉన్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. అంటే టీకాలు వేసుకున్నా కూడా కరోనా వైరస్ నుండి నూరుశాతం రక్షణ రావటం లేదన్నది అర్ధమవుతోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే కోవిడ్ టీకాలు వేయించుకున్నా తాజా వేరియంట్ ఒమిక్రాన్ టీకాను బురిడి కొట్టించి శరీరంలోకి ప్రవేశిస్తోందని వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పారు. కాకపోతే టీకాలు తీసుకోని వాళ్ళమీద చూపించినంత ప్రభావం టీకాలు తీసుకున్న వాళ్ళలో కనబవడటం లేదని కూడా శాస్త్రజ్ఞులు తేల్చారు. కేసులు పెరుగుతున్న కారణంగా అమెరికాలో బూస్టర్ డోసు వేయటాన్ని స్పీడుచేశారు. ఏదేమైనా కరోనా వైరస్ అమెరికాలో మళ్ళీ విజృంభిస్తోందంటే యావత్ ప్రపంచం అప్రమత్తమైపోతోంది.
This post was last modified on January 1, 2022 11:40 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…