మళ్ళీ అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. విజృంభిస్తున్న కరోనా వైరస్ అమెరికాను పూర్తిగా వణికించేస్తోంది. గడచిన 24 గంటల్లో అమెరికా మొత్తంమీద సుమారు 6 లక్షల కేసులు నమోదయ్యాయి. చాల కాలం తర్వాత ఇన్ని లక్షల కేసులు అమెరికాలో నమోద్దవటంతో సంచలనంగా మారింది. వీరిలో సుమారు 1400 మంది చనిపోవటంతో అగ్రరాజ్యంలో కలకలం మొదలైంది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో సుమారు 22 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజ రోజుకు పెరిగిపోతున్నాయట.
సగటున ప్రతిరోజు 10 వేలమంది పెద్దలు, 500 మంది పిల్లాలు కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిల్లో చేరుతున్నారు. మళ్ళీ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో క్రిక్కిరిసిపోతున్నాయి. ఆసుపత్రుల బెడ్ల స్ధాయికి మించి రోగులు వచ్చేస్తుండటంతో వారిని చేర్చుకోవటానికి ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఒకపుడు కొలంబియా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలే జరగటం అప్పట్లో సంచలనమైంది.
ఆసుపత్రుల్లో బెడ్లు లేక, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ సంఖ్య సరిపోక అప్పట్లో రోగులను చాలా ఆసుపత్రులు చేర్చుకోలేదు. మళ్ళీ అలాంటి పరిస్ధితి అమెరికాలో ఇపుడు కనబడుతోంది. ఒకేరోజు 6 లక్షల కేసులంటే మామూలు విషయం కాదు. ఇపుడు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో, కరోనా బారిన పడుతున్న వాళ్ళల్లో కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారు కూడా ఉన్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. అంటే టీకాలు వేసుకున్నా కూడా కరోనా వైరస్ నుండి నూరుశాతం రక్షణ రావటం లేదన్నది అర్ధమవుతోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే కోవిడ్ టీకాలు వేయించుకున్నా తాజా వేరియంట్ ఒమిక్రాన్ టీకాను బురిడి కొట్టించి శరీరంలోకి ప్రవేశిస్తోందని వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పారు. కాకపోతే టీకాలు తీసుకోని వాళ్ళమీద చూపించినంత ప్రభావం టీకాలు తీసుకున్న వాళ్ళలో కనబవడటం లేదని కూడా శాస్త్రజ్ఞులు తేల్చారు. కేసులు పెరుగుతున్న కారణంగా అమెరికాలో బూస్టర్ డోసు వేయటాన్ని స్పీడుచేశారు. ఏదేమైనా కరోనా వైరస్ అమెరికాలో మళ్ళీ విజృంభిస్తోందంటే యావత్ ప్రపంచం అప్రమత్తమైపోతోంది.
This post was last modified on January 1, 2022 11:40 am
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…
తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస…