మళ్ళీ అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. విజృంభిస్తున్న కరోనా వైరస్ అమెరికాను పూర్తిగా వణికించేస్తోంది. గడచిన 24 గంటల్లో అమెరికా మొత్తంమీద సుమారు 6 లక్షల కేసులు నమోదయ్యాయి. చాల కాలం తర్వాత ఇన్ని లక్షల కేసులు అమెరికాలో నమోద్దవటంతో సంచలనంగా మారింది. వీరిలో సుమారు 1400 మంది చనిపోవటంతో అగ్రరాజ్యంలో కలకలం మొదలైంది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో సుమారు 22 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజ రోజుకు పెరిగిపోతున్నాయట.
సగటున ప్రతిరోజు 10 వేలమంది పెద్దలు, 500 మంది పిల్లాలు కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిల్లో చేరుతున్నారు. మళ్ళీ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో క్రిక్కిరిసిపోతున్నాయి. ఆసుపత్రుల బెడ్ల స్ధాయికి మించి రోగులు వచ్చేస్తుండటంతో వారిని చేర్చుకోవటానికి ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఒకపుడు కొలంబియా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలే జరగటం అప్పట్లో సంచలనమైంది.
ఆసుపత్రుల్లో బెడ్లు లేక, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ సంఖ్య సరిపోక అప్పట్లో రోగులను చాలా ఆసుపత్రులు చేర్చుకోలేదు. మళ్ళీ అలాంటి పరిస్ధితి అమెరికాలో ఇపుడు కనబడుతోంది. ఒకేరోజు 6 లక్షల కేసులంటే మామూలు విషయం కాదు. ఇపుడు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో, కరోనా బారిన పడుతున్న వాళ్ళల్లో కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారు కూడా ఉన్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. అంటే టీకాలు వేసుకున్నా కూడా కరోనా వైరస్ నుండి నూరుశాతం రక్షణ రావటం లేదన్నది అర్ధమవుతోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే కోవిడ్ టీకాలు వేయించుకున్నా తాజా వేరియంట్ ఒమిక్రాన్ టీకాను బురిడి కొట్టించి శరీరంలోకి ప్రవేశిస్తోందని వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పారు. కాకపోతే టీకాలు తీసుకోని వాళ్ళమీద చూపించినంత ప్రభావం టీకాలు తీసుకున్న వాళ్ళలో కనబవడటం లేదని కూడా శాస్త్రజ్ఞులు తేల్చారు. కేసులు పెరుగుతున్న కారణంగా అమెరికాలో బూస్టర్ డోసు వేయటాన్ని స్పీడుచేశారు. ఏదేమైనా కరోనా వైరస్ అమెరికాలో మళ్ళీ విజృంభిస్తోందంటే యావత్ ప్రపంచం అప్రమత్తమైపోతోంది.
This post was last modified on January 1, 2022 11:40 am
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…