Political News

2021: జగన్ రివ‌ర్స్ గేర్‌.. ఎన్నిక‌ల్లో టాప్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌తో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతోన్న న‌వ‌ర‌త్నాల పేరుతో ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల రూపంలో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతూనే ఉన్నారు. అధికారంలోకి రాగానే కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం ఆయ‌న త‌న నిర్ణ‌యాల్లో కొన్నింటిని వెన‌క్కి తీసుకున్నారు. పాల‌న‌ప‌రంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. కానీ రాజ‌కీయాల ప‌రంగా మాత్రం రాష్ట్రంలో 2021లో జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ వైసీపీ విజ‌యాలు సాధించింది.

మూడు రాజ‌ధానుల‌పై..
జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌రావ‌తి ఒక్క‌టే రాజ‌ధానిగా ఉండ‌ద‌ని.. మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా, క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా, విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా మారుస్తామ‌న్నారు. అయితే వైసీపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. జ‌గ‌న్ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా అమ‌రావ‌తి రైతులు దీక్ష‌కు దిగారు. మూడు రాజ‌ధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ ర‌ద్దుపై హైకోర్టులో విచార‌ణ కూడా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ ర‌ద్దు బిల్లును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. మార్పుల‌తో తిరిగి బిల్లులు ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని చెప్పినప్పటికీ జ‌గ‌న్ నిర్ణ‌యాల్లో ముఖ్యమైన దాన్ని వెన‌క్కి తీసుకోవ‌డం ఈ ఏడాదే జ‌రిగింది.

అవి కూడా..
మ‌రోవైపు శాస‌న మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉప సంహ‌రించుకుంది. శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన జ‌గ‌న్ ఏడాదిన్న‌ర తిర‌గ‌కుండానే ఆ బిల్లును కూడా వెన‌క్కి తీసుకున్నారు. మండ‌లిలో బ‌లం పెర‌గ‌డంతో రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే  ఉద్దేశంతో జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గార‌ని స‌మాచారం. ఇక మ‌ద్య నిషేధం కోసం ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ ఏడాది వాటిని త‌గ్గించింది.

రాజ‌కీయంగా హిట్‌..
రాజ‌కీయంగా మాత్రం జ‌గ‌న్‌కు ఈ ఏడాది ఎంత‌గానో క‌లిసొచ్చింది. పంచాయ‌తీ, మున్సిపాలిటీ, కార్పొరేష‌న్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి విజ‌యాలు అందుకుంది. ప్ర‌త్య‌ర్థి టీడీపీని చిత్తు చిత్తు చేసింది. ముఖ్యంగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కంచు కోట కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లోనూ పార్టీ రికార్డు స్థాయి మెజారిటీ సాధించింది. 

This post was last modified on December 31, 2021 8:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

39 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago