ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల వ్యవస్థ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది కొంత కాలంగా. ఏపీలో జనాల సినీ అభిమానం ఎలాంటిదో.. సినిమాలను అక్కడ ఏ స్థాయిలో ఆదరిస్తారో.. థియేటర్లకు ఏ స్థాయిలో ఆదాయం వస్తుందో తెలిసిందే. ఐతే గత ఏడాది నుంచి మామూలుగా థియేటర్ల పరిస్థితి ఏమీ బాగా లేదు. కరోనా వల్ల ఆ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అది చాలదన్నట్లు ఏపీలో టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడం, ఏళ్ల నాటి ధరల్ని ప్రభుత్వం పట్టుబట్టి అమలు చేయడంతో చాలా థియేటర్ల మనుగడే ప్రమాదంలో పడింది.
దీనికి తోడు ఈ మధ్య అధికారులు థియేటర్ల మీద దాడులు జరిపి నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేశారు. ఇలా ఏపీలో వందకు పైగానే థియేటర్లు మూతపడ్డట్లు వార్తలొచ్చాయి. పుష్ప, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు బాగా ఆడుతుండగా.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలు రాబోతుండగా ఇలా థియేటర్లు మూతపడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఐతే ఈ విషయంలో ప్రభుత్వం మరీ పట్టుదలకు పోకుండా కాస్త వెసులుబాటు ఇవ్వడంతో ఏపీలో ఇటీవల మూత పడ్డ థియేటర్లన్నీ తిరిగి తెరుచుకున్నాయి.
ఏపీలో థియేటర్ల సమస్యల గురించి ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’కి సంబంధించిన ఒక ఈవెంట్లో మాట్లాడిన సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి.. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి నేరుగా రంగంలోకి దిగారు. కొందరు ఎగ్జిబిటర్లను వెంటబెట్టుకుని ఆయన తాజాగా మంత్రి పేర్ని నానిని కలిశారు. థియేటర్లను సీజ్ చేయడం, టికెట్ల ధరలు, ఇతర సమస్యలపై ఆయన మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశ ఫలితం వెంటనే కనిపించింది. ఇటీవల సీజ్ అయిన థియేటర్లను తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాకపోతే ఇందుకు కొన్ని షరతులు విధించింది. అధికారులు ఎత్తి చూపిన లోటు పాట్లను సవరించుకోవడానికి, లైసెన్సులు రెన్యువల్ చేసుకోవడానికి నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ లోపు అన్నీ సరిదిద్దుకుని, జరిమానాలు, లైసెన్స్ ఫీజులు కట్టి ఏ రకమైన సమస్యలూ లేకుండా చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
This post was last modified on December 30, 2021 2:46 pm
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…