సీనియర్ రాజకీయ నాయకుడిగా సుపరిచితుడైన జేసీ బ్రదర్స్.. వాహన వ్యాపారాల వ్యాపార లోగుట్టు బయటకు వచ్చింది. ఇటీవల కాలంలో వారు చేసే వ్యాపారాలకు సంబంధించి కళ్లు చెదిరే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఏపీ రవాణా శాఖ అధికారుల పుణ్యమా అని.. మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. దీంతో.. వారిపై ఏకంగా ఇరవై నాలుగు కేసులు బుక్ చేశారు.
జేసీవారి వ్యాపారం గురించి వింటే.. అంత పెద్ద నాయకుడి ఆలోచనలు ఇంత చిన్నగా ఉంటాయా? అన్న భావన కలుగక మనదు. బీఎస్ -3 వాహనాల్ని బీఎస్-4గా చూపించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించటాన్ని ఒక ఎత్తు అయితే..లారీల్ని కొనుగోలు చేసి వాటిని బస్సులుగా మార్చి తిప్పుతున్న వైనం తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.
ఇలా చెప్పుకుంటే జేసీ వారి వ్యాపార అక్రమ లీలలు కళ్లు తిరిగేలా ఉన్నాయి. వారి అక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది తాజాగా రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. అశోక్ లేలాండ్ తయారు చేసిన బీఎస్-3 లారీల్ని తుక్కు కింద పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం.. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు గుర్తించారు. పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన వాటిని ఎలా మారుస్తారన్నది తాజా లెక్కలతో సహా బయటకు వచ్చాయి.
98 లారీల్ని నాగాలాండ్ లో.. 32 లారీల్ని ఏపీలో.. మరో 24 లారీల్ని తమిళనాడు.. ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లారీల్లో 101 లారీలు ఏపీలో.. 33 కర్ణాటకలో.. 15 తెలంగాణలో.. తమిళనాడు.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు లారీల ఆచూకీ లభించాల్సి ఉంది. నాలుగు లారీల్ని బస్సులుగా మార్చి తిప్పుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన లారీల్ని బ్లాక్ లిస్టులో ఉంచాలని నిర్ణయించారు.
జేసీ అక్రమాలు ఆధారాలతో సహా లభించటంతో వారి లారీల్ని జాతీయ వాహన డేటా బేస్ నుంచి తొలగించారు. దీంతో వాటిని అమ్మే అవకాశం లేకుండా పోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. లారీలకు తీసుకున్న బీమా పత్రాలు కూడా నకిలీవేనన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు.. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన లారీల్ని వేర్వేరు వారికి అమ్మేసిన వైనం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో జేసీకి చెందిన జటాధర కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు. లాభాల కోసం వ్యాపారాలు చేయటం మామూలే. కానీ.. మరీ ఇంత కక్కుర్తి ఏంది జేసీ సాబ్?
This post was last modified on June 10, 2020 11:00 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…