ప్రముఖ నటుడు ప్రభాస్ పై తెలంగాణ రెవెన్యూ అధికారి కేసు పెట్టారు. కేసు ఏంటో తెలుసా? ప్రభాస్ తన గెస్టు హౌస్ లోకి తాను వెళ్లినందుకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఈ కేసు పెట్టారు. అదేంటి ప్రభాస్ తన గెస్ట్ హౌస్ తాను వాడితే కేసు పెట్టడం ఏంటి? అనుకుంటున్నారా… ఇక్కడో ట్విస్ట్ ఉంది.
2200 గజాల్లో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ ప్రభాస్ దే కానీ అది నిర్మించిన స్థలం మాత్రం వివాదంలో ఉంది. రాయదుర్గం పరిధిలోని 46వ సర్వే నెంబరులో 84 ఎకరాల 30 గుంటల భూమిపై నలభై సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబరులో ప్రభాస్ తన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. అదేంటి 40 ఏళ్ల నుంచి వివాదం నడుస్తుంటే… ఇటీవల ఆయనలా అక్కడకు పోయి కట్టుకున్నాడనేది మరో సమస్య.
సీజ్ చేసిన గెస్ట్ హౌస్ లోకి లాక్ డౌన్ సమయంలో ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అంటూ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో ప్రభాస్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. చాలారోజుల క్రితమే గెస్ట్ హౌస్ ను అధికారులు సీజ్ చేశారు. వాస్తవానికి అది ప్రభుత్వం స్థలం అన్నది రెవెన్యూ అధికారుల వాదన. దీనిని ఆల్రెడీ నోటిఫై కూడా చేశారు. అయితే, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి గతంలోనే ప్రభాస్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదింకా పెండింగ్ లో ఉంది. ఈ కేసు ప్రస్తుతం కూకట్ పల్లి కోర్టు మెట్లెక్కింది.
This post was last modified on June 9, 2020 8:03 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…