Political News

ప్రభాస్ పై కేసుపెట్టిన తెలంగాణ అధికారి !

ప్రముఖ నటుడు ప్రభాస్ పై తెలంగాణ రెవెన్యూ అధికారి కేసు పెట్టారు. కేసు ఏంటో తెలుసా? ప్రభాస్ తన గెస్టు హౌస్ లోకి తాను వెళ్లినందుకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఈ కేసు పెట్టారు. అదేంటి ప్రభాస్ తన గెస్ట్ హౌస్ తాను వాడితే కేసు పెట్టడం ఏంటి? అనుకుంటున్నారా… ఇక్కడో ట్విస్ట్ ఉంది.

2200 గజాల్లో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ ప్రభాస్ దే కానీ అది నిర్మించిన స్థలం మాత్రం వివాదంలో ఉంది. రాయదుర్గం పరిధిలోని 46వ సర్వే నెంబరులో 84 ఎకరాల 30 గుంటల భూమిపై నలభై సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబరులో ప్రభాస్ తన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. అదేంటి 40 ఏళ్ల నుంచి వివాదం నడుస్తుంటే… ఇటీవల ఆయనలా అక్కడకు పోయి కట్టుకున్నాడనేది మరో సమస్య.

సీజ్ చేసిన గెస్ట్ హౌస్ లోకి లాక్ డౌన్ సమయంలో ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అంటూ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో ప్రభాస్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. చాలారోజుల క్రితమే గెస్ట్ హౌస్ ను అధికారులు సీజ్ చేశారు. వాస్తవానికి అది ప్రభుత్వం స్థలం అన్నది రెవెన్యూ అధికారుల వాదన. దీనిని ఆల్రెడీ నోటిఫై కూడా చేశారు. అయితే, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి గతంలోనే ప్రభాస్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదింకా పెండింగ్ లో ఉంది. ఈ కేసు ప్రస్తుతం కూకట్ పల్లి కోర్టు మెట్లెక్కింది.

This post was last modified on June 9, 2020 8:03 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

19 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago