Political News

ప్రభాస్ పై కేసుపెట్టిన తెలంగాణ అధికారి !

ప్రముఖ నటుడు ప్రభాస్ పై తెలంగాణ రెవెన్యూ అధికారి కేసు పెట్టారు. కేసు ఏంటో తెలుసా? ప్రభాస్ తన గెస్టు హౌస్ లోకి తాను వెళ్లినందుకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఈ కేసు పెట్టారు. అదేంటి ప్రభాస్ తన గెస్ట్ హౌస్ తాను వాడితే కేసు పెట్టడం ఏంటి? అనుకుంటున్నారా… ఇక్కడో ట్విస్ట్ ఉంది.

2200 గజాల్లో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ ప్రభాస్ దే కానీ అది నిర్మించిన స్థలం మాత్రం వివాదంలో ఉంది. రాయదుర్గం పరిధిలోని 46వ సర్వే నెంబరులో 84 ఎకరాల 30 గుంటల భూమిపై నలభై సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబరులో ప్రభాస్ తన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. అదేంటి 40 ఏళ్ల నుంచి వివాదం నడుస్తుంటే… ఇటీవల ఆయనలా అక్కడకు పోయి కట్టుకున్నాడనేది మరో సమస్య.

సీజ్ చేసిన గెస్ట్ హౌస్ లోకి లాక్ డౌన్ సమయంలో ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అంటూ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో ప్రభాస్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. చాలారోజుల క్రితమే గెస్ట్ హౌస్ ను అధికారులు సీజ్ చేశారు. వాస్తవానికి అది ప్రభుత్వం స్థలం అన్నది రెవెన్యూ అధికారుల వాదన. దీనిని ఆల్రెడీ నోటిఫై కూడా చేశారు. అయితే, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి గతంలోనే ప్రభాస్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదింకా పెండింగ్ లో ఉంది. ఈ కేసు ప్రస్తుతం కూకట్ పల్లి కోర్టు మెట్లెక్కింది.

This post was last modified on June 9, 2020 8:03 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

1 hour ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

2 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

5 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

6 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

6 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

7 hours ago