తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉంది. తాజాగా పరిటాల శ్రీరామ్ చేసిన హెచ్చరికలు విన్న తర్వాత పార్టీలో అందరూ ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇంతకీ శ్రీరామ్ చేసిన హెచ్చరిక ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేయటానికి తనకు టికెట్ ఇవ్వకపోతే రాజకీయాల నుండే శాశ్వతంగా తప్పుకుంటానని ఏకంగా చంద్రబాబునాయుడుకే అల్టిమేటం జారీ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.
శ్రీరామ్ ఎక్కడా చంద్రబాబు పేరెత్తలేదు. కానీ టీడీపీలో టికెట్లు కేటాయించాల్సింది, బీఫారమ్ లపై సంతకాలు పెట్టాల్సింది చంద్రబాబే కదా. కాబట్టే శ్రీరామ్ వార్నింగుపై ఇంతటి ప్రచారం జరుగుతోంది. నిజానికి ధర్మవరంలో పోటీ విషయమై 2019లోనే పరిటాల సునీత, శ్రీరామ్ చాలా ప్రయత్నాలే చేశారు. అయితే అప్పటి సిట్టింగ్ ఎంఎల్ఏ గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి)ను కాదని శ్రీరామ్ కు టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో తన తల్లి సునీత పోటీ చేయాల్సిన రాప్తాడులో తాను పోటీ చేశారు. రాప్తాడులో శ్రీరామ్, ధర్మవరంలో సూరి ఇద్దరూ ఓడిపోయారు.
ఎప్పుడైతే టీడీపీతో పాటు తాను కూడా ఓడిపోయారో వెంటనే సూరి టీడీపీకి రాజీనామా చేసేసి బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుండి ధర్మవరంపై శ్రీరామ్ కన్నుంది. ఎలాగూ నియోజకవర్గంలో పార్టీకి సరైన నాయకుడు లేడు కాబట్టి చంద్రబాబు కూడా శ్రీరామ్ నే ఇన్చార్జిగా చేసేశారు. అంటే ధర్మవరంలో శ్రీరామ్ పోటీకి దాదాపు లైన్ క్లియర్ అనే చెప్పాలి. మరలాంటపుడు టికెట్ విషయంలో శ్రీరామ్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదే సమయంలో రాప్తాడులో మళ్ళీ సునీతే పోటీ చేయటానికి రెడీ అవుతున్నారు.
రాప్తాడులో తన తల్లి, ధర్మవరంలో తాను పోటీ చేయటం ఖాయమంటు శ్రీరామ్ బాహాటంగానే ప్రకటించేశారు. దాంతో తల్లీ, కొడుకులు ఇద్దరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమనే అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్యుంది. తల్లీ, కొడుకులు ఇద్దరు పోటీ చేస్తే రెండు నియోజకవర్గాలను సమన్వయం చేసుకునేది ఎవరు ? ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే పోటీలో ఉంటే రెండో వాళ్ళు ప్రచారం, నేతలు, కార్యకర్తల అవసరాలను చూసుకునేందుకు వీలుంటుంది. అలాకాదని ఇద్దరు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సమన్వయం చేసుకునే అవకాశాలు చాలా కష్టమైపోతాయి. మరి ఈ విషయాన్ని తల్లీ, కొడుకులు ఆలోచించకుండానే ఉంటారా ?
This post was last modified on December 20, 2021 12:15 pm
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…