Political News

బ్రిటీష్ పాల‌న‌ను త‌ల‌పిస్తున్న జ‌గ‌న్‌.. టీడీపీ ఆగ్ర‌హం

“బ్రిటిష్ వారి నియంత పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు, కానీ జగన్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆ అవకాశం దక్కింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారు. ఆయన పాలన బ్రిటిష్ పాలన 2.0 మాదిరి ఉంది.” అని టీడీపీ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగింది. తాజాగా తిరుపతి వేదిక‌గా.. అమరావతి రైతులు మ‌హాస‌భ నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌భకు కోర్టు అనుమతిచ్చింది. అయితే.. ప్రజలు సభకు వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌పై టీడీపీ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగింది.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల నిరవధిక దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. ఆంక్షలతో అడ్డుకోవటం ఏంటి? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని టీడీపీ ప్ర‌శ్నించింది. ఈ మేర‌కు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు ఒక ప్ర‌క‌ట‌న జారీ చేశారు. “జగన్ రెడ్డి 3 రాజధానులు కడతానని చెప్పి 3 సంవత్సరాలు కావొస్తోంది, ఇప్పటివరకు 3 ప్రాంతాల్లో కనీసం 3 ఇటుకలు కూడా పేర్చలేదు, తప్పుడు ప్రచారంతో అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం చేకూర్చారు” అని నిప్పులు చెరిగారు.

అమరావతే రాజదానిగా కావాలంటూ రైతుల చేస్తున్న పాదయాత్రను అడగడుగునా అవమానిస్తూ..అడ్డంకులు కల్పించినా..‎ రైతుల పాదయాత్ర విజయవంతం కావడంతో జగన్ రెడ్డి, వైసీపీ నేతలు కడుపు మంటతో బాధపడుతున్నారని అన్నారు. అందుకే తిరుపతి అమరావతి బహిరంగ సభకు కోర్టు అనుమతిచ్చినా.. ఎక్కడిక్కక అడ్డంకులు సృష్టిస్తూ ఆటంకాలు కల్పిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయమన్నందుకు అన్యాయంగా అరెస్టు చేయటం సిగ్గుచేటు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోలవరం నిర్వాసితులు 10 రోజుల నుంచి నిరవదిక దీక్ష చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు?” అని నిల‌దీశారు.

ముఖ్యమంత్రికి టీడీపీ నేతల్ని అక్రమంగా అరెస్టులు చేయటంపై ఉన్న శ్రద్ద రాష్ట్రాభివృద్దిపై లేకపోవటం బాధాకరమ‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉంటున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలనువటం మూర్కత్వం. మీరు ఎంతమందిని హౌస్ అరెస్టులు చేసినా, ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతామ‌ని అన్నారు. ప్రజా గొంతుకై నినదిస్తామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

This post was last modified on December 17, 2021 6:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago