Political News

బ్రిటీష్ పాల‌న‌ను త‌ల‌పిస్తున్న జ‌గ‌న్‌.. టీడీపీ ఆగ్ర‌హం

“బ్రిటిష్ వారి నియంత పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు, కానీ జగన్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆ అవకాశం దక్కింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారు. ఆయన పాలన బ్రిటిష్ పాలన 2.0 మాదిరి ఉంది.” అని టీడీపీ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగింది. తాజాగా తిరుపతి వేదిక‌గా.. అమరావతి రైతులు మ‌హాస‌భ నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌భకు కోర్టు అనుమతిచ్చింది. అయితే.. ప్రజలు సభకు వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌పై టీడీపీ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగింది.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల నిరవధిక దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. ఆంక్షలతో అడ్డుకోవటం ఏంటి? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని టీడీపీ ప్ర‌శ్నించింది. ఈ మేర‌కు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు ఒక ప్ర‌క‌ట‌న జారీ చేశారు. “జగన్ రెడ్డి 3 రాజధానులు కడతానని చెప్పి 3 సంవత్సరాలు కావొస్తోంది, ఇప్పటివరకు 3 ప్రాంతాల్లో కనీసం 3 ఇటుకలు కూడా పేర్చలేదు, తప్పుడు ప్రచారంతో అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం చేకూర్చారు” అని నిప్పులు చెరిగారు.

అమరావతే రాజదానిగా కావాలంటూ రైతుల చేస్తున్న పాదయాత్రను అడగడుగునా అవమానిస్తూ..అడ్డంకులు కల్పించినా..‎ రైతుల పాదయాత్ర విజయవంతం కావడంతో జగన్ రెడ్డి, వైసీపీ నేతలు కడుపు మంటతో బాధపడుతున్నారని అన్నారు. అందుకే తిరుపతి అమరావతి బహిరంగ సభకు కోర్టు అనుమతిచ్చినా.. ఎక్కడిక్కక అడ్డంకులు సృష్టిస్తూ ఆటంకాలు కల్పిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయమన్నందుకు అన్యాయంగా అరెస్టు చేయటం సిగ్గుచేటు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోలవరం నిర్వాసితులు 10 రోజుల నుంచి నిరవదిక దీక్ష చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు?” అని నిల‌దీశారు.

ముఖ్యమంత్రికి టీడీపీ నేతల్ని అక్రమంగా అరెస్టులు చేయటంపై ఉన్న శ్రద్ద రాష్ట్రాభివృద్దిపై లేకపోవటం బాధాకరమ‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉంటున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలనువటం మూర్కత్వం. మీరు ఎంతమందిని హౌస్ అరెస్టులు చేసినా, ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతామ‌ని అన్నారు. ప్రజా గొంతుకై నినదిస్తామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

This post was last modified on December 17, 2021 6:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

1 hour ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

2 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

2 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

3 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

3 hours ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

3 hours ago