ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై కారు ఎక్కడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా మొత్తం ఎనిమిది మరణించిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 3న ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం కోర్టు ముందు చార్జ్షీట్ సమర్పించింది.
ఇందులో రైతులపైకి ఉద్దేశపూర్వకంగా కారు ఎక్కించారని ఇది కావాలని పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. ఇందులో ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. దీంతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంతో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనను సిట్ చార్జ్షీట్ గురించి మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.
దీంతో మంత్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సదరు జర్నలిస్టును దుర్భషలాడుతూ దాడికి సైతం పాల్పడ్డారు. దిమాగ్ కరాబ్ హై క్యా బే(మెదడు పాడైందా ఏమి), మైక్ బంద్ కర్ బే(మైక్ కట్టెయ్), చోర్ (దొంగలు).. అంటూ బూతులు తిడుతూ ప్రశ్నించిన జర్నలిస్ట్ చేతిలో నుంచి మైక్ను లాగి బయటికి విసిరేశారు. రిపోర్టర్ ఏమీ చేయలేక అలా నిల్చునున్నాడు. అయినప్పటికీ అజయ్ మిశ్రా కోపం తగ్గలేదు.
జర్నలిస్ట్ను బూతులు తిడుతూనే అతడిని పలుమార్లు వెనక్కి బలంగా తోశారు. అక్కడే ఉన్న పోలీసులు కేంద్ర మంత్రిని ఆపే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ మిశ్రా రాజీనామా చేయాలంటూ నినదిస్తున్నారు. కొడుకు నిర్వాకంపై ప్రశ్నిస్తే బీజేపీ కేంద్రమంత్రి పిచ్చి వేషాలు వేస్తున్నాడని కేంద్రమంత్రిని బట్టలుడ దీసి తన్నాలి అంటూ నెటిజన్లు, రైతులు సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేస్తున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…