టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” సినిమా సూపర్ హిట్ రేంజ్ సాధించిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. తాను కూడా ఈ సినిమా చూశానని తెలిపారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ సినిమా చూస్తే చాలని హీటెక్కించే వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో “అఖండ” సినిమా చూస్తే అర్థమవుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు.. అఖండ సినిమా అద్దం పడుతోందని ఆయన చెప్పారు.
మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. తాను కూడా “అఖండ” సినిమా చూశానని చంద్రబాబు వెల్లడించారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న ‘అఖండ’ మూవీ ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. నిజానికి చంద్రబాబు సినిమాలు చూసే సమయం చాలా చాలా తక్కువ. అయితే.. ఇటీవల కాలంలో కొంత ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో ఆయన అఖండ సినమాను రిలాక్స్ కోసం చూసినట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది ‘అఖండ’ సినిమాలో చూపించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతోందో దాన్ని ‘అఖండ’ సినిమాలో చూపించారని, సినిమా చాలా బాగుందని చంద్రబాబు ప్రశంసించారు. ముఖ్యంగా బాలయ్య నటన అఘోరాగా అద్భుతంగా ఉందని కీర్తించారు. తాను ఊహించలేదని.. అంతబాగా నటించారని పేర్కొన్నారు. దర్శకుడు బోయపాటి.. మంచి ఇతివృత్తాన్ని ఎంచుకున్నారని.. ప్రజలు ఇప్పటికైనా.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలపై దండెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.
This post was last modified on December 11, 2021 7:13 pm
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…