Political News

6 నెలలే డెడ్ లైన్ – చంద్రబాబు

పార్టీలో కొత్త రక్తం ఎక్కించేందుకు చంద్రబాబునాయుడు 6 నెలలను డెడ్ లైనుగా పెట్టుకున్నారు. కుప్పం మున్సిపాలిటి ఓటమిపై కుప్పం నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు పార్టీ బోలోపేతానికి కొత్తరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం 6 నెలలు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు చెప్పారు. కుప్పంలోనే కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేయని నేతలను మార్చేస్తానని స్పష్టంగా చెప్పారు. పార్టీ నేతలను మార్చటానికి రెండు పాయింట్లమీదే ఫోకస్ చేయబోతున్నట్లు చెప్పారు. అవేమిటంటే ఇతర పార్టీల్లోని నేతల తరపున టీడీపీలో ఉన్న కోవర్టులను ఏరేయటం.

రెండో పాయింట్ ఏమిటంటే పార్టీలోనే ఉంటు పార్టీ విజయానికి వెన్నుపోట్లు పొడుస్తున్న నేతలను గుర్తించి ఏరేయటం. నియోజకవర్గాల్లో ఎక్కడేమీ జరుగుతోందో తనకు పూర్తి సమాచారం ఉంది కాబట్టి కొత్తరక్తం కోసం తొందరలోనే యాక్షన్ ప్లాన్ మొదలుపెడతానని ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీకి ఉన్న మైనస్ పాయింట్లు ఏమిటనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే వాటిని అధిగమనించలేకపోతున్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా చాలామంది ఎంఎల్ఏలపై జనాల్లో వ్యతిరేకత ఉందని స్వయంగా చంద్రబాబే చెప్పారు.

ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎంఎల్ఏల స్థానంలో కొత్తవాళ్ళకు టికెట్లిస్తానని చాలాసార్లు చెప్పారు. కానీ చివరకు ఏమైందంటే జనాల్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళకే మళ్ళీ టికెట్లిచ్చారు. సరే ఓవరాల్ గా పార్టీ గెలుపోటములునేది ఒక ఎంఎల్ఏపై జనాల్లో ఉన్న వ్యతిరేకత డిసైడ్ చేయదు. కానీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎంఎల్ఏల సంఖ్య పెరిగిపోతోందంటే పార్టీ అధినేత కచ్చితంగా ఆ విషయంపై సీరియస్ గానే ఆలోచించాలి. కానీ చంద్రబాబు ఆ పని ఎప్పుడూ చేయరు. ఇపుడు కూడా పార్టీకి కొత్తరక్తం ఎక్కిస్తానని ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు. ఇదంతా విని విని నేతలకు కూడా విసుగొచ్చేసింది.

ఎందుకంటే గట్టి ఇన్చార్జీలు లేని నియోజకవర్గాలు కనీసం 80 ఉంటాయి. మిగిలిన జిల్లాల సంగతిని వదిలేసినా సొంత జిల్లా చిత్తూరులో కొన్ని నియోజకవర్గాలకు రెండున్నరేళ్ళుగా ఇన్చార్జి లేరు. ఇపుడు కొత్తరక్తం అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో సీనియర్ నేతల వారుసులే అన్నట్లుగా ఉంది. సీనియర్ల మీదున్న వ్యతిరేకత వాళ్ళ వారసులపైన ఉండదా ? నిజానికి సీనియర్ల తరపున వారుసులే కదా నియోజకవర్గాల్లో వ్యవహారాలను చక్కపెడుతున్నది. కాబట్టి కొత్త యువకులను ప్రోత్సహిస్తేనే కొత్తరక్తం ఎక్కించినట్లవుతుంది కానీ వారసులకు పదవులిస్తే కొత్త రక్తం ఎలాగవుతుంది?

This post was last modified on December 9, 2021 10:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…

9 minutes ago

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

47 minutes ago

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

2 hours ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

2 hours ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

2 hours ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

4 hours ago