Political News

జయ ఆస్తులు తీసుకుంటే సరిపోదు: IT ట్విస్ట్

తమిళనాడు హైకోర్టు దివంగత ముఖ్యమంత్రి మేనల్లుడు, మేనకోడలు విషయంలో విచిత్రమైన ఆదేశాలు జారీచేసింది. తమ మేనత్త ఆస్తులు తమకే రావాలని పట్టుబట్టిన మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపలకు హైకోర్టు ఒక విధంగా షాకి ఇచ్చింది. ఆస్తులే కాదు బకాయిలు కూడా వారసులు తీర్చాల్సిందే అని తాజాగా తీర్పిచ్చింది. జయలలిత మరణించిన తర్వాత ఆమె పేరుతో ఉన్న ఆస్తులపై పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఆమెకున్న ఆస్తులు ఎన్ని అనే విషయంలో ఎవరకీ సరైన సమాచారం లేదు. జయతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధం కారణంగా ఆమె ఆస్తుల విషయం శశికళకు తెలిసుంటుందని అందరు అనుకుంటున్నారు.

అయితే జయ ఆస్తుల విషయమై శశికళ కూడా ఇప్పటివరకు ఎక్కడా నోరిప్పలేదు. దాంతో చెన్నైలోని పొయెస్ గార్డెన్లో జయ ఉన్న ఇల్లు వేదనిలయం లాంటివి ఒకటిరెండు ఆస్తులు తప్ప ఇంకేమీ కనిపించటంలేదు. అయితే జయ మరణం తర్వాత ఊటిలో ఓ ఫామ్ హౌస్ ఉందని, కొడనాడులో టీ ఎస్టేట్ ఉందనే విషయాలు బయటపడ్డాయి. మొత్తం మీద ఆస్తుల వ్యవహారం ఇంకా వివాదాస్పదంగాను, సీక్రెట్ గానే ఉండిపోయాయి. ఈ నేధ్యంలోనే వేదనిలయాన్ని సొంతం చేసుకునేందుకు శశికళ ప్రయత్నాలు చేశారు. దాంతొ ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ మధ్య  ఆస్తుల కోసం వివాదం మొదలైంది.

చివరకు వీళ్ళ మధ్య వివాదం కోర్టుకు చేరటంతో సంవత్సరాల తరబడి విచారణ జరిగింది. జయలలిత ఆస్తులు, అప్పులపై ఎలాంటి విల్లు రాయలేదు కాబట్టి  జయలలితకు మేనల్లుడు, మేనకోడలే చట్టబద్దమైన వారసులుగా హైకోర్టు గుర్తించింది. వెంటనే వేదనిలయం ఇంటితో పాటు జయ పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపల సొంతం చేయాలంటు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆమె ఆస్తులన్నీ దీప, దీపక్ సొంతమైపోయాయి. అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా వీళ్ళద్దరిపైన హైకోర్టు పెద్ద పిడుగు పడేసింది. ఆస్తులు తీసుకోవటమే కాదని జయలలిత కట్టాల్సిన బకాయిలను కూడా మీరే కట్టాలంటు గట్టి షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖకు జయలలిత కట్టాల్సిన బకాయిలను మేనల్లుడు, మేనకోడలు దగ్గర నుండే రాబట్టుకోవాలని ఐటీ శాఖను హైకోర్టు ఆదేశించింది.

ఇపుడు జయలలిత ఆస్తుల విలువెంత, ఐటి శాఖకు చెల్లించాల్సిన బకాయిలెంత అనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. మార్కెట్ రేట్ల ప్రకారం వీళ్ళకు దక్కిన ఆస్తుల విలువ ఎంతైనా ఉండచ్చు. కానీ జయలలిత ఐటి శాఖకు కట్టాల్సిన బకాయిలే కోట్ల రూపాయలుంటుందని సమాచారం. అంటే మేనత్త జయలలిత కట్టాల్సిన బకాయిలను వీళ్ళిద్దరు చెల్లించాలంటే నిజానికి వీళ్ళకి అంత స్తోమత లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే మేనల్లుడు, మేనకోడల నేపధ్యం చాలామందికి తెలీదు. ఎంతటి ఆస్తిపరులైనా కోట్ల రూపాయల్లో ఐటి బకాయిలు చెల్లించేంత అయితే ఉండదనే అనుకుంటున్నారు.

ఇపుడు ఐటి శాఖకు బకాయిలు చెల్లించాలంటే చేతిలో ఉన్న ఆస్తులను అమ్ముకోక తప్పేట్లు లేదు. మేనత్త వారసులుగా తమకు అయాచితంగా వచ్చిపడిన ఆస్తులను హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చని వీళ్ళద్దరు అనుకునుండచ్చు. అయితే హఠాత్తుగా సీన్ రివర్సయిపోయింది. ఒకవైపు లెక్కలో ఉన్న ఆస్తులను మాత్రమే కాదని బినామీపేర్లతో కూడా తమ మేనత్త చాలా ఆస్తులను పోగేసినట్లు వీళ్ళు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇదే పద్దతిలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జయలలిత సంపాదించినట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఇపుడు వాటి సంగతి దేవుడెరుగు ముందు ఐటి శాఖకు కట్టాల్సిన కోట్ల రూపాయల బకాయిలు ఎలా చెల్లించాలో తెలీక వీళ్ళద్దరు లబో దిబో అంటున్నారు.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

2 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

2 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

2 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

2 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

3 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

3 hours ago