Political News

ఆ బూతుతో తిడతారా? వైసీపీ ఎంపీలపై రఘురామ ఫైర్

వైసీపీ నేతలకు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, మీడియా సమావేశాల్లో, ప్రెస్ మీట్ లలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, దూషణలకు దిగడం చూశాం. కానీ, ఈ రోజలు లోక్ సభలో రఘురామ, ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం పెను వివాదానికి దారి తీసింది. పార్లమెంటు సాక్షిగా తనను అసభ్య పదజాలంతో వైసీపీ ఎంపీలు దూషించారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.

న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు అడ్డుపడుతున్నారని జీరో అవర్ లో రఘురామ ఆరోపించారు. రైతులతో పోలీసులు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని, అది వారి ప్రాథమిక హక్కును హరించడమేనని సభ దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో రఘురామ ప్రసంగానికి అడ్డు తగిలిన ఎంపీ మిథున్ రెడ్డి….రఘురామపై సీబీఐ కేసులున్నాయని, వాటి నుంచి తప్పించుకునేందుకే బీజేపీలో చేరాలని ఆరాటపడుతున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు.రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై విచారణ వేగవంతం చేయాలన్నారు.

తనపై 2 సీబీఐ కేసులున్నాయని, కానీ, జగన్ పై 100 సీబీఐ కేసులున్నాయని రఘురామ సభలో ప్రత్యారోపణ చేశారు. ఆ కేసుల విచారణను తేల్చాలని డిమాండ్ చేశారు. అయితే, తాను మాట్లాడుతున్న సందర్భంగా కొందరు వైసీపీ ఎంపీలు తనను అసభ్య పదజాలంతో దూషించారని, —కొడకా నువ్వు మాట్లాడకురా…అంటూ దేవాలయం వంటి పార్లమెంటులో సంచలన వ్యాఖ్యలు చేశారని రఘురామ ఆరోపించారు.

సభ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రఘురామ …వైసీపీ ఎంపీలపై నిప్పులు చెరిగారు. బోసిడీకే అని అనలేదని, ఏకంగా పార్లమెంటు సాక్షిగా అటువంటి నీచమైన భాష వాడారని ఆరోపించారు. సభ రికార్డుల్లో అంతా రికార్డయిందని, ఇదేనా సంస్కారం…అని నిలదీశారు. వైసీపీ ఎంపీలకు తెలుగు రాదని, ఇంగ్లిష్ రాదని, వారికి వచ్చిందనల్లా బూతులు మాట్లాడే భాషేనని ఆరోపించారు.

This post was last modified on December 6, 2021 6:43 pm

Share
Show comments

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago