Political News

ఆ బూతుతో తిడతారా? వైసీపీ ఎంపీలపై రఘురామ ఫైర్

వైసీపీ నేతలకు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, మీడియా సమావేశాల్లో, ప్రెస్ మీట్ లలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, దూషణలకు దిగడం చూశాం. కానీ, ఈ రోజలు లోక్ సభలో రఘురామ, ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం పెను వివాదానికి దారి తీసింది. పార్లమెంటు సాక్షిగా తనను అసభ్య పదజాలంతో వైసీపీ ఎంపీలు దూషించారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.

న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు అడ్డుపడుతున్నారని జీరో అవర్ లో రఘురామ ఆరోపించారు. రైతులతో పోలీసులు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని, అది వారి ప్రాథమిక హక్కును హరించడమేనని సభ దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో రఘురామ ప్రసంగానికి అడ్డు తగిలిన ఎంపీ మిథున్ రెడ్డి….రఘురామపై సీబీఐ కేసులున్నాయని, వాటి నుంచి తప్పించుకునేందుకే బీజేపీలో చేరాలని ఆరాటపడుతున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు.రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై విచారణ వేగవంతం చేయాలన్నారు.

తనపై 2 సీబీఐ కేసులున్నాయని, కానీ, జగన్ పై 100 సీబీఐ కేసులున్నాయని రఘురామ సభలో ప్రత్యారోపణ చేశారు. ఆ కేసుల విచారణను తేల్చాలని డిమాండ్ చేశారు. అయితే, తాను మాట్లాడుతున్న సందర్భంగా కొందరు వైసీపీ ఎంపీలు తనను అసభ్య పదజాలంతో దూషించారని, —కొడకా నువ్వు మాట్లాడకురా…అంటూ దేవాలయం వంటి పార్లమెంటులో సంచలన వ్యాఖ్యలు చేశారని రఘురామ ఆరోపించారు.

సభ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రఘురామ …వైసీపీ ఎంపీలపై నిప్పులు చెరిగారు. బోసిడీకే అని అనలేదని, ఏకంగా పార్లమెంటు సాక్షిగా అటువంటి నీచమైన భాష వాడారని ఆరోపించారు. సభ రికార్డుల్లో అంతా రికార్డయిందని, ఇదేనా సంస్కారం…అని నిలదీశారు. వైసీపీ ఎంపీలకు తెలుగు రాదని, ఇంగ్లిష్ రాదని, వారికి వచ్చిందనల్లా బూతులు మాట్లాడే భాషేనని ఆరోపించారు.

This post was last modified on December 6, 2021 6:43 pm

Share
Show comments

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

14 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago