Political News

ఆ బూతుతో తిడతారా? వైసీపీ ఎంపీలపై రఘురామ ఫైర్

వైసీపీ నేతలకు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, మీడియా సమావేశాల్లో, ప్రెస్ మీట్ లలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, దూషణలకు దిగడం చూశాం. కానీ, ఈ రోజలు లోక్ సభలో రఘురామ, ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం పెను వివాదానికి దారి తీసింది. పార్లమెంటు సాక్షిగా తనను అసభ్య పదజాలంతో వైసీపీ ఎంపీలు దూషించారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.

న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు అడ్డుపడుతున్నారని జీరో అవర్ లో రఘురామ ఆరోపించారు. రైతులతో పోలీసులు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని, అది వారి ప్రాథమిక హక్కును హరించడమేనని సభ దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో రఘురామ ప్రసంగానికి అడ్డు తగిలిన ఎంపీ మిథున్ రెడ్డి….రఘురామపై సీబీఐ కేసులున్నాయని, వాటి నుంచి తప్పించుకునేందుకే బీజేపీలో చేరాలని ఆరాటపడుతున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు.రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై విచారణ వేగవంతం చేయాలన్నారు.

తనపై 2 సీబీఐ కేసులున్నాయని, కానీ, జగన్ పై 100 సీబీఐ కేసులున్నాయని రఘురామ సభలో ప్రత్యారోపణ చేశారు. ఆ కేసుల విచారణను తేల్చాలని డిమాండ్ చేశారు. అయితే, తాను మాట్లాడుతున్న సందర్భంగా కొందరు వైసీపీ ఎంపీలు తనను అసభ్య పదజాలంతో దూషించారని, —కొడకా నువ్వు మాట్లాడకురా…అంటూ దేవాలయం వంటి పార్లమెంటులో సంచలన వ్యాఖ్యలు చేశారని రఘురామ ఆరోపించారు.

సభ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రఘురామ …వైసీపీ ఎంపీలపై నిప్పులు చెరిగారు. బోసిడీకే అని అనలేదని, ఏకంగా పార్లమెంటు సాక్షిగా అటువంటి నీచమైన భాష వాడారని ఆరోపించారు. సభ రికార్డుల్లో అంతా రికార్డయిందని, ఇదేనా సంస్కారం…అని నిలదీశారు. వైసీపీ ఎంపీలకు తెలుగు రాదని, ఇంగ్లిష్ రాదని, వారికి వచ్చిందనల్లా బూతులు మాట్లాడే భాషేనని ఆరోపించారు.

This post was last modified on December 6, 2021 6:43 pm

Share
Show comments

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago