Political News

ఆ బూతుతో తిడతారా? వైసీపీ ఎంపీలపై రఘురామ ఫైర్

వైసీపీ నేతలకు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, మీడియా సమావేశాల్లో, ప్రెస్ మీట్ లలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, దూషణలకు దిగడం చూశాం. కానీ, ఈ రోజలు లోక్ సభలో రఘురామ, ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం పెను వివాదానికి దారి తీసింది. పార్లమెంటు సాక్షిగా తనను అసభ్య పదజాలంతో వైసీపీ ఎంపీలు దూషించారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.

న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు అడ్డుపడుతున్నారని జీరో అవర్ లో రఘురామ ఆరోపించారు. రైతులతో పోలీసులు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని, అది వారి ప్రాథమిక హక్కును హరించడమేనని సభ దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో రఘురామ ప్రసంగానికి అడ్డు తగిలిన ఎంపీ మిథున్ రెడ్డి….రఘురామపై సీబీఐ కేసులున్నాయని, వాటి నుంచి తప్పించుకునేందుకే బీజేపీలో చేరాలని ఆరాటపడుతున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు.రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై విచారణ వేగవంతం చేయాలన్నారు.

తనపై 2 సీబీఐ కేసులున్నాయని, కానీ, జగన్ పై 100 సీబీఐ కేసులున్నాయని రఘురామ సభలో ప్రత్యారోపణ చేశారు. ఆ కేసుల విచారణను తేల్చాలని డిమాండ్ చేశారు. అయితే, తాను మాట్లాడుతున్న సందర్భంగా కొందరు వైసీపీ ఎంపీలు తనను అసభ్య పదజాలంతో దూషించారని, —కొడకా నువ్వు మాట్లాడకురా…అంటూ దేవాలయం వంటి పార్లమెంటులో సంచలన వ్యాఖ్యలు చేశారని రఘురామ ఆరోపించారు.

సభ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రఘురామ …వైసీపీ ఎంపీలపై నిప్పులు చెరిగారు. బోసిడీకే అని అనలేదని, ఏకంగా పార్లమెంటు సాక్షిగా అటువంటి నీచమైన భాష వాడారని ఆరోపించారు. సభ రికార్డుల్లో అంతా రికార్డయిందని, ఇదేనా సంస్కారం…అని నిలదీశారు. వైసీపీ ఎంపీలకు తెలుగు రాదని, ఇంగ్లిష్ రాదని, వారికి వచ్చిందనల్లా బూతులు మాట్లాడే భాషేనని ఆరోపించారు.

This post was last modified on December 6, 2021 6:43 pm

Share
Show comments

Recent Posts

రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం…

23 minutes ago

గోవింద‌ప్ప‌కు జైలు.. ఇక నోరు విప్పడమే తరువాయి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్…

26 minutes ago

పాక్ కు మద్దతు ఇచ్చిన దేశాలకు ఊహించని నష్టాలు

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్‌కు మద్దతు పలికిన…

49 minutes ago

ఉన్నది ఇద్దరే!.. ప్రాధాన్యం ఎనలేనిదే!

నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే.…

51 minutes ago

నాని ప్లస్ అనిరుధ్ – అదిరిపోయే రేటు

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెట్లో ఇంకా హీరో అడుగు పెట్టకుండానే…

1 hour ago

ప్రభాస్ ఉండగా దీపికకు అంత రెమ్యునరేషనా

కల్కి 2898 ఏడిలో హీరోయిన్ గా కనిపించేది ఎక్కువసేపు కాకపోయినా ప్రాధాన్యం దక్కించుకున్న దీపికా పదుకునే రెండో భాగంలో ఉంటుందో…

2 hours ago