Political News

ఉద్యోగ సంఘాల దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం

ఉద్యోగ సంఘాల దెబ్బకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీ నుండి సమ్మె చేయబోతున్నట్లు చీఫ్ సెక్రటరీకి ఉద్యోగ సంఘాల నేతలు నోటీసిచ్చారు. పీఆర్సీ అమలు, పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని, పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు ఎప్పటినుండో కోరుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు ఏదో సాకు చెబుతూ కాలయాపన చేస్తోంది.

ఆర్థిక అంశాలను వాయిదా వేస్తోందంటే అర్థముంది. కానీ పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు ఇవ్వడం, సీపీఎస్ రద్దు లాంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదో ఎవరికీ అర్ధం కావటంలేదు. ప్రభుత్వంతో చర్చలు జరిపి జరిపి నేతలు విసిగిపోయి చివరకు సమ్మె నోటీసిచ్చారు. దాంతో హడావుడిగా ఈరోజు అంటే శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ డిసైడ్ అయ్యింది.

ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో అన్ని విషయాలను శుక్రవారం మధ్యాహ్నం చర్చించి నిర్ణయం తీసుకుందామని కార్యదర్శుల కమిటిలో కీలక సభ్యుడైన శశిభూషణ్ కుమార్ నుంచి నేతలకు సమాచారం అందింది. దాంతో ఉదయం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరపాలని నేతలు ఏర్పాటు చేసుకున్నారు.

అంటే జరుగుతున్నది చూస్తుంటే ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్లు అన్నీ కాకపోయినా కనీసం ముఖ్యమైన పీఆర్సీ నివేదిక అమలు, డీఏల విడుదల, సీపీఎస్ రద్దు లాంటివైనా పరిష్కారమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఉద్యోగులతో గొడవ పెట్టుకోవటం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అలా కాదని ఉద్యోగులను దూరం చేసుకుంటే ఏమవుతుందో చరిత్రను గమనిస్తే అర్ధమైపోతుంది. బహుశా ఈ విషయాన్ని గ్రహించింది కాబట్టే చివరి నిముషంలో సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

This post was last modified on December 3, 2021 11:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

26 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago