Political News

కేంద్రంపై కేసీయార్ యుద్ధమైపోయినట్లేనా ?

కేంద్రం మీద యుద్ధమన్నారు.. ఆకాశం బద్దలైపోతుందన్నారు. జనాలంతా నిజమే అనుకుంటే తీరా ఇంకేదో అయ్యింది. వరికి ప్రత్యామ్నాయ పంటలుగా వేరుశెనగ, పత్తి, మినుములు, పెసర, శనగల్లాంటి పంటలపై రైతులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం కేసీయార్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించి రైతులతో ముచ్చట్లాడారు. సంవత్సరమంతా వరి వేసి ఇబ్బందులు పడే బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును కూడా ఆలోచించాలన్నారు.

వరి కొనుగోలు విషయంలో కేంద్రంపై కేసీయార్ నోటికొచ్చినట్లు విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణా పండిన వరిని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదో చూస్తానంటూ రంకెలేశారు. తెలంగాణలో వరిని కేంద్రం కొనుగోలు చేసి తీరాల్సిందే అంటూ తీవ్రంగానే వార్నింగ్ ఇచ్చారు. కేసీయార్ వార్నింగుపై  కేంద్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వక పోయేసరికి మంత్రులు, నేతల బృందాన్ని వేసుకుని ఏకంగా ఢిల్లీకే వెళ్ళిపోయారు.

అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా అసలు అపాయిట్మెంటే ఇవ్వలేదు. మూడు రోజులు ఢిల్లీలోనే కేసీయార్ వెయిట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని కేసీయార్ చివరకు హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. కేంద్రమేమో రా రైస్ తప్ప బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని స్పష్టంగా ప్రకటించేసింది. ఇదే సమయంలో కేసీయార్ మాత్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందే అంటు పట్టుబట్టారు.

వరి రాజకీయంపై దాదాపు పది రోజులు కేసీయార్-బీజేపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. బాయిల్డ్ రైస్ ను తెలంగాణా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు నానా రచ్చచేశారు. కేంద్రం తెలంగాణాపై  సవతి తల్లి ప్రేమను కురిపిస్తోందంటు కేసీయార్ అండ్ కో నానా గోల చేశారు. ఇదే సమయంలో కేసీయార్ ను టార్గెట్ చేస్తు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ కో ఇందిరాపార్క్ దగ్గర  పెద్ద సీనే క్రియేట్ చేశారు.

వరి చుట్టూ పెద్ద రాజకీయమే నడవటంతో తెలంగాణలో ఏదో జరగబోతోందనే అనుకున్నారు. తీరా చూస్తే వరికి ప్రత్యామ్నాయ పంటలను వేయాలని కేసీయార్ రైతులకు  చెప్పటంతో కేంద్రం మీద యుద్ధం అయిపోయినట్లే అనిపిస్తోంది. ఇంతోటి దానికి రైతులను రెచ్చగొట్టడం, యుద్ధమని ప్రకటించటం, ఇందిరా పార్కు దగ్గర స్వయంగా కేసీయారే దీక్ష చేయటం, అపాయిట్మెంట్ లేకపోయినా ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు కూర్చోవడం లాంటివి ఎందుకు చేసినట్లో ఎవరికీ అర్థం కావడం లేదు.

This post was last modified on December 3, 2021 11:29 am

Share
Show comments
Published by
news Content

Recent Posts

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

35 mins ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

2 hours ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

2 hours ago

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

4 hours ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

4 hours ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

10 hours ago