Political News

కేంద్రంపై కేసీయార్ యుద్ధమైపోయినట్లేనా ?

కేంద్రం మీద యుద్ధమన్నారు.. ఆకాశం బద్దలైపోతుందన్నారు. జనాలంతా నిజమే అనుకుంటే తీరా ఇంకేదో అయ్యింది. వరికి ప్రత్యామ్నాయ పంటలుగా వేరుశెనగ, పత్తి, మినుములు, పెసర, శనగల్లాంటి పంటలపై రైతులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం కేసీయార్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించి రైతులతో ముచ్చట్లాడారు. సంవత్సరమంతా వరి వేసి ఇబ్బందులు పడే బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును కూడా ఆలోచించాలన్నారు.

వరి కొనుగోలు విషయంలో కేంద్రంపై కేసీయార్ నోటికొచ్చినట్లు విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణా పండిన వరిని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదో చూస్తానంటూ రంకెలేశారు. తెలంగాణలో వరిని కేంద్రం కొనుగోలు చేసి తీరాల్సిందే అంటూ తీవ్రంగానే వార్నింగ్ ఇచ్చారు. కేసీయార్ వార్నింగుపై  కేంద్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వక పోయేసరికి మంత్రులు, నేతల బృందాన్ని వేసుకుని ఏకంగా ఢిల్లీకే వెళ్ళిపోయారు.

అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా అసలు అపాయిట్మెంటే ఇవ్వలేదు. మూడు రోజులు ఢిల్లీలోనే కేసీయార్ వెయిట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని కేసీయార్ చివరకు హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. కేంద్రమేమో రా రైస్ తప్ప బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని స్పష్టంగా ప్రకటించేసింది. ఇదే సమయంలో కేసీయార్ మాత్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందే అంటు పట్టుబట్టారు.

వరి రాజకీయంపై దాదాపు పది రోజులు కేసీయార్-బీజేపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. బాయిల్డ్ రైస్ ను తెలంగాణా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు నానా రచ్చచేశారు. కేంద్రం తెలంగాణాపై  సవతి తల్లి ప్రేమను కురిపిస్తోందంటు కేసీయార్ అండ్ కో నానా గోల చేశారు. ఇదే సమయంలో కేసీయార్ ను టార్గెట్ చేస్తు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ కో ఇందిరాపార్క్ దగ్గర  పెద్ద సీనే క్రియేట్ చేశారు.

వరి చుట్టూ పెద్ద రాజకీయమే నడవటంతో తెలంగాణలో ఏదో జరగబోతోందనే అనుకున్నారు. తీరా చూస్తే వరికి ప్రత్యామ్నాయ పంటలను వేయాలని కేసీయార్ రైతులకు  చెప్పటంతో కేంద్రం మీద యుద్ధం అయిపోయినట్లే అనిపిస్తోంది. ఇంతోటి దానికి రైతులను రెచ్చగొట్టడం, యుద్ధమని ప్రకటించటం, ఇందిరా పార్కు దగ్గర స్వయంగా కేసీయారే దీక్ష చేయటం, అపాయిట్మెంట్ లేకపోయినా ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు కూర్చోవడం లాంటివి ఎందుకు చేసినట్లో ఎవరికీ అర్థం కావడం లేదు.

This post was last modified on December 3, 2021 11:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

2 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

2 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

4 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

6 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

7 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

7 hours ago