Political News

జగన్ తప్పు చేస్తున్నారా ?

జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నట్లే ఉంది. ఉద్యోగులతో అనవసరంగా గోక్కుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిందంటే అందులో ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. అలాంటి ఉద్యోగులతో జగన్ ప్రభుత్వం కోరి ఎందుకని గోక్కుంటున్నదో అర్థం కావటంలేదు. బుధవారం ఉద్యోగ సంఘాల నేతలు చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈనెల 7వ తేదీ నుంచి సమ్మె చేయబోతున్నట్లు నోటీసిచ్చారు. లాంగ్ పెండింగ్ డిమాండ్ల సాధనకై తాము సమ్మె చేయాలని డిసైడ్ అయినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 

పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయడం, అమలు చేయడం, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయడం లాంటి డిమాండ్లున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు మొదటి నుండి జగన్మోహన్ రెడ్డితో నేరుగా మాట్లాడాలని కోరుకుంటున్నారు. అయితే అది సాధ్యం కావడం లేదు. ఎంతసేపు నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీతోనే భేటీ అవుతున్నారు. కారణాలు తెలీదు కానీ సీఎం మాత్రం ఉద్యోగ సంఘాల నేతలతో భేటీకి ఇష్టపడటంలేదు. 

పీఆర్సీ అమలు సంగతిని పక్కన పెట్టేసినా అసలు పీఆర్సీ నివేదికనే ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయటం లేదో అర్థం కావటంలేదు. ఏ ప్రభుత్వమైనా పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు ఇవ్వటం మామూలే. ఆ నివేదికను స్టడీ చేసిన తర్వాత నేతలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. నేతలు-చీఫ్ సెక్రటరీ లేదా నేతలు-మంత్రుల బృందంతో ఫిట్మెంట్ ఫైనల్ అయిన తర్వాతే సీఎంతో భేటీ అవుతారు. ఎంత ఫిట్మెంట్ ఇచ్చేది సీఎం ప్రకటిస్తారు. 

ఇదంతా ఎవరు అధికారంలో ఉన్నా రివాజుగా జరిగే తంతే. చంద్రబాబునాయుడు హయాంలోనే. ఉద్యోగులకు భారీగా జీతాలు పెరగడంతో  ఇపుడు అందులో పాతిక శాతం కూడా ఫిట్మెంట్ ఇవ్వలేని స్థితిలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఉంది.  ఉద్యోగులకు ఎవరు సీఎంగా ఉన్నారన్నది అనవసరం. పీఆర్సీ అమలైందా ? డీఏలు అమలవుతున్నాయా లేదా ? అన్నదే పాయింట్ ఇక్కడ. 

పీఆర్సీ అమలు విషయాన్ని పక్కనపెట్టినా ముందు ఆ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు అందచేయకుండా ప్రభుత్వం తప్పుచేస్తోంది. ఎప్పుడైతే నివేదికను ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందో అందరికీ నివేదికపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. వేలాది కోట్ల రూపాయలను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఖర్చుపెడుతున్న జగన్ ఉద్యోగుల విషయంలో ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం కావటంలేదు. కోరి ఉద్యోగులతో గొడవలు పెట్టుకోవటం ప్రభుత్వానికి ఏమాత్రం క్షేమం కాదు. మరి ఈ విషయాన్ని జగన్ ఎందుకు గుర్తించటం లేదో.

This post was last modified on December 2, 2021 11:12 am

Share
Show comments
Published by
news Content

Recent Posts

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల…

2 hours ago

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

2 hours ago

పీవీ రమేష్ ట్వీట్ తో భారీ డ్యామేజ్ ?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారం వాడి వేడిగా సాగుతున్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన‌ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…

3 hours ago

పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న బ‌రిలో ఉన్న…

6 hours ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

8 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

9 hours ago