Political News

జగన్ తప్పు చేస్తున్నారా ?

జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నట్లే ఉంది. ఉద్యోగులతో అనవసరంగా గోక్కుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిందంటే అందులో ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. అలాంటి ఉద్యోగులతో జగన్ ప్రభుత్వం కోరి ఎందుకని గోక్కుంటున్నదో అర్థం కావటంలేదు. బుధవారం ఉద్యోగ సంఘాల నేతలు చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈనెల 7వ తేదీ నుంచి సమ్మె చేయబోతున్నట్లు నోటీసిచ్చారు. లాంగ్ పెండింగ్ డిమాండ్ల సాధనకై తాము సమ్మె చేయాలని డిసైడ్ అయినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 

పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయడం, అమలు చేయడం, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయడం లాంటి డిమాండ్లున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు మొదటి నుండి జగన్మోహన్ రెడ్డితో నేరుగా మాట్లాడాలని కోరుకుంటున్నారు. అయితే అది సాధ్యం కావడం లేదు. ఎంతసేపు నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీతోనే భేటీ అవుతున్నారు. కారణాలు తెలీదు కానీ సీఎం మాత్రం ఉద్యోగ సంఘాల నేతలతో భేటీకి ఇష్టపడటంలేదు. 

పీఆర్సీ అమలు సంగతిని పక్కన పెట్టేసినా అసలు పీఆర్సీ నివేదికనే ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయటం లేదో అర్థం కావటంలేదు. ఏ ప్రభుత్వమైనా పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు ఇవ్వటం మామూలే. ఆ నివేదికను స్టడీ చేసిన తర్వాత నేతలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. నేతలు-చీఫ్ సెక్రటరీ లేదా నేతలు-మంత్రుల బృందంతో ఫిట్మెంట్ ఫైనల్ అయిన తర్వాతే సీఎంతో భేటీ అవుతారు. ఎంత ఫిట్మెంట్ ఇచ్చేది సీఎం ప్రకటిస్తారు. 

ఇదంతా ఎవరు అధికారంలో ఉన్నా రివాజుగా జరిగే తంతే. చంద్రబాబునాయుడు హయాంలోనే. ఉద్యోగులకు భారీగా జీతాలు పెరగడంతో  ఇపుడు అందులో పాతిక శాతం కూడా ఫిట్మెంట్ ఇవ్వలేని స్థితిలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఉంది.  ఉద్యోగులకు ఎవరు సీఎంగా ఉన్నారన్నది అనవసరం. పీఆర్సీ అమలైందా ? డీఏలు అమలవుతున్నాయా లేదా ? అన్నదే పాయింట్ ఇక్కడ. 

పీఆర్సీ అమలు విషయాన్ని పక్కనపెట్టినా ముందు ఆ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు అందచేయకుండా ప్రభుత్వం తప్పుచేస్తోంది. ఎప్పుడైతే నివేదికను ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందో అందరికీ నివేదికపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. వేలాది కోట్ల రూపాయలను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఖర్చుపెడుతున్న జగన్ ఉద్యోగుల విషయంలో ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం కావటంలేదు. కోరి ఉద్యోగులతో గొడవలు పెట్టుకోవటం ప్రభుత్వానికి ఏమాత్రం క్షేమం కాదు. మరి ఈ విషయాన్ని జగన్ ఎందుకు గుర్తించటం లేదో.

This post was last modified on December 2, 2021 11:12 am

Share
Show comments

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago