Political News

గట్టిగా ఇరుక్కున్న మోడీ

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల దగ్గర ప్రధానమంత్రి నరేంద్రమోడి గట్టిగా తగులుకున్నట్లే ఉన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను మడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని దానికి అనుబంధంగా ఉన్న మరికొన్ని చట్టాలను రద్దు చేయటంతో పాటు కొన్ని చట్టాలను చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) గట్టిగా పట్టుబడుతోంది. ఎలాగు తొందరలోనే ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకనే ప్రతిపక్షాలన్నీ బీకేయూకి గట్టి మద్దతుగా మారాయి.

బీకేయూ పట్టుబడుతున్న చట్టాల రద్దులో వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు కీలకమైనది. అలాగే చేయాల్సిన చట్టంలో పంటలకు కనీస మద్దతు ధర ముఖ్యమైనది. ఇప్పటివరకు కనీసస మద్దతు ధర అన్నది ప్రభుత్వం నిర్ణయంమీదుంది. అవసరానికి ఎప్పటికప్పుడు కేంద్రం పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తోంది. అలా కాకుండా కనీస మద్దతు ధరను చట్టం రూపంలోకి తీసుకొస్తే ఇకనుండి కేంద్రం దయపైన ఆధారపడక్కర్లేదన్నది బీకేయూ వాదన.

ఇక వీటితో పాటు వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న డిమాండ్లు ఎలాగు ఉన్నాయి. బీకేయూ డిమాండ్లకు తోడు కొన్ని ప్రాంతీయపార్టీల డిమాండ్లు ఎలాగూ ఉన్నాయి. తెలంగాణానే తీసుకుంటే బాయిల్డ్ రైస్ ను కేంద్రం కొని తీరాలంటు కేసీయార్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని, రచ్చ చేయాలని తన ఎంపీలకు కేసీయార్ స్పష్టంగా చెప్పారు. కేసీయార్ ఆదేశాల ప్రకారం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో గోల చేయటం ఖాయం.

ఇదే సమయంలో తుపానులు, భారీ వర్షాల కారణంగా అవసరమైనంత సాయం చేయలేదని తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం కేంద్రంపై మండిపోతోంది. కాబట్టి కేంద్రాన్ని నిలదీసేందుకు డీఎంకే ఎంపీలు రెడీ అయ్యారు. ఇక ఏపీ విషయానికి వస్తే ప్రత్యేకహోదా, పోలవరం నిధులు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకమనే డిమాండ్లతో వైసీపీ ఎంపీలు కూడా గోల చేయటానికి రెడీ అవుతున్నారు. వీళ్ళందరికీ తోడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎలాగు ఉన్నారు. తమ రాష్ట్రం ప్రయోజనాల విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందంటు వాళ్ళు మండిపోతున్నారు.

దీనికి అదనంగా ఉత్తరప్రదేశ్ లో రైతులపైకి వాహనాలను నడిపి నలుగురి మరణాలకు కారకుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ డిమాండ్ తో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఎంపీలు గోల చేయటానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వచ్చే మార్చిలోగా యూపీలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి కాబట్టి. యూపీలో ప్రతిపక్షాలన్నీ ఇఫుడు రైతుల జపమే చేస్తున్నాయి కాబట్టి రచ్చ చేయటం ఖాయమే. మొత్తానికి ఏ విధంగా చూసినా ప్రతిపక్షాలు పార్లమెంటులో రచ్చ రచ్చ చేయటం ఖాయమని అర్ధమైపోతోంది. మరి ఈ గోలను మోడీ ఏ విధంగా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది.

This post was last modified on November 29, 2021 12:54 pm

Share
Show comments
Published by
news Content

Recent Posts

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

38 mins ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

2 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

2 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

2 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

3 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

4 hours ago