Political News

దారి మళ్లిన నిధులు…వైసీపీ ఎంపీపై కేంద్రం సీరియస్

ఏపీ ప్రభుత్వంపై తాజాగా కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై గతంలో పంపిన లేఖకు వివరణనివ్వడంలో జాప్యం జరగడంపై అసహనం వ్యక్తం చేసింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్…తన ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేశారన్న ఆరోపణలపై వెంటనే నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ఈ ప్రకారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శికి విడివిడిగా లేఖలు పంపింది.

ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీలో క్రిస్టియానిటీ పెరిగిపోయిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ వ్యవహారంపై గణాంకాలతో సహా రాష్ట్రపతికి, ప్రధానికి రఘురామ లేఖ కూడా రాశారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పైకి హిందువుల నిరంతరం చర్చిల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే చర్చి నిర్మాణానికి తన ఎంపీ లాడ్స్ ఫండ్స్ ను వైసీపీ ఎంపీ  నందిగం సురేష్ ఖర్చు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఆ కథనాలను ఉటంకిస్తూ ప్రధాని మోడీకి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. దీంతో, ఆ లేఖపై నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 2 నెలల క్రితం గణాంకాలు, ప్రణాళిక శాఖ లేఖ పంపింది. కానీ, ఆ వ్యవహారంపై ఇప్పటిదాకా ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో, తాజాగా ఏపీ సీఎస్‌కు గణాంకాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమ్య మరో లేఖ పంపారు. త్వరగా సవివరమైన నివేదిక పంపాలని కోరారు. ప్రధాని కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉందని వివరించారు.

This post was last modified on November 27, 2021 5:25 pm

Share
Show comments

Recent Posts

ముద్రగడ సమాధి కట్టేసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…

4 mins ago

ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…

1 hour ago

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

2 hours ago

ఎన్టీఆర్ పేరు చెప్పి బాబును టార్గెట్ చేస్తున్న నాని

గుడివాడ‌లో విజ‌యం కోసం నాని నానాపాట్లు ప‌డుతున్నారు. త‌న అనుచ‌రుల ఆగ‌డాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ…

2 hours ago

సుకుమార్ శిష్యులు మహా ఘటికులు

స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…

3 hours ago

మోడీ వ‌స్తున్నారు.. కూట‌మిలో జోష్‌, వైసీపీలో టెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న కూట‌మిలో మ‌రింత జోష్ పెర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే విజ‌యం ఖాయ‌మ‌నే ధీమాతో…

3 hours ago