Political News

ఉభయసభల్లో ఎదురేలేదు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉభయసభల్లోను ఎదురన్నదే లేదు. తాజాగా శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలం 32కి పెరిగింది. 58 మంది సభ్యులున్న మండలిలో వైసీపీకి 32 మంది ఉన్నారంటే మామూలు విషయం కాదు. మొన్నటివరకు మండలిలో బిల్లుల ఆమోదంలో అధికారపార్టీ ఎంతగా ఇబ్బంది పడిందో అందరు చూసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్ల అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చినా మండలిలో మైనారిటిలో ఉండటం వైసీపీ చాలా ఇబ్బందులే పడింది.

బిల్లుల ఆమోదం విషయంలో అసెంబ్లీలో ఏమీ చేయలేని టీడీపీ మండలిలో ఉన్న మెజారిటి కారణంగా ప్రతి బిల్లును అడ్డుకున్నది. నిజానికి బిల్లుల ఆమోదానికి అసెంబ్లీయే కీలకం. ఎందుకంటే ఒకసారి మండలిలో ఫెయిలైనా రెండోసారి మళ్ళీ ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకునే అవకాశాలున్నాయి. అయితే ఆ వెసులుబాటు అసెంబ్లీలో లేదు. అసెంబ్లీలో 23 మంది మాత్రమే ఉన్న టీడీపీ బిల్లుల ఆమోదంలో ఏమీ చేయలేకపోతోంది. అందుకనే శాసనమండలిలో అడ్డుకుంటోంది.

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీయే చట్టం రద్దు లాంటి బిల్లుల ఆమోదంలో మండలిలో అధికార-టీడీపీ సభ్యుల మధ్య ఎంతపెద్ద గొడవైందో అందరు చూసిందే. దాంతోనే మండలి రద్దుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయించారు. ఆవేశంలో తీర్మానం చేయించినా ఆ తర్వాత వాస్తవ పరిస్ధితులను అంచనా వేసుకుని మండలి రద్దు తీర్మానంపై వెనకడుగువేశారు. మూడు రోజుల క్రితమే గతంలో చేసిన మండలి రద్దు తీర్మానాన్ని కూడా రద్దు చేసుకున్నారు.

తాజాగా స్ధానికసంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన 11 ఎంఎల్సీలు ఏకగ్రీవమైపోయాయి. అన్నీ స్ధానాల్లోను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. దాంతో మండలిలో వైసీపీ బలం ఒక్కసారిగా 32కి పెరిగిపోయింది. 2023 చివరకు సభలో సభ్యుల బలం సుమారుగా 50కి చేరుకుంటుందని అంచనా వేసుకుంటున్నారు అధికారపార్టీ నేతలు. ఏదేమైనా ఉభయసభల్లో తమకు ఎదురన్నదే లేకపోవటం అధికారపార్టీ నేతల్లో ఫుల్లుగా జోష్ తో ఉన్నారు.

అయితే ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. అదేమిటంటే పంచాయితీ నుండి అసెంబ్లీ, మండలి దాకా అధికారపార్టీకి ఏకపక్షంగా బలం పెరిగిపోవటం ప్రజాస్వామ్యానికి అంత మంచిదికాదు. ఏకపక్షంగా దఖలుపడిన బలంతో చివరకు ప్రజాస్వామ్యాన్నే చిన్నచూపు చూసే అవకాశం కూడా ఉంది. ఎక్కడ కూడా తనకు ఎదురన్నదే లేదని పాలకులు  అనుకుంటే ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బంది అవుతుంది. పాలకులు కాస్త జాగ్రత్తగా ఉండేవాళ్ళయితే మంచిదే లేకపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి.

This post was last modified on November 27, 2021 11:13 am

Share
Show comments

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

1 hour ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago