Political News

ఉభయసభల్లో ఎదురేలేదు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉభయసభల్లోను ఎదురన్నదే లేదు. తాజాగా శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలం 32కి పెరిగింది. 58 మంది సభ్యులున్న మండలిలో వైసీపీకి 32 మంది ఉన్నారంటే మామూలు విషయం కాదు. మొన్నటివరకు మండలిలో బిల్లుల ఆమోదంలో అధికారపార్టీ ఎంతగా ఇబ్బంది పడిందో అందరు చూసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్ల అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చినా మండలిలో మైనారిటిలో ఉండటం వైసీపీ చాలా ఇబ్బందులే పడింది.

బిల్లుల ఆమోదం విషయంలో అసెంబ్లీలో ఏమీ చేయలేని టీడీపీ మండలిలో ఉన్న మెజారిటి కారణంగా ప్రతి బిల్లును అడ్డుకున్నది. నిజానికి బిల్లుల ఆమోదానికి అసెంబ్లీయే కీలకం. ఎందుకంటే ఒకసారి మండలిలో ఫెయిలైనా రెండోసారి మళ్ళీ ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకునే అవకాశాలున్నాయి. అయితే ఆ వెసులుబాటు అసెంబ్లీలో లేదు. అసెంబ్లీలో 23 మంది మాత్రమే ఉన్న టీడీపీ బిల్లుల ఆమోదంలో ఏమీ చేయలేకపోతోంది. అందుకనే శాసనమండలిలో అడ్డుకుంటోంది.

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీయే చట్టం రద్దు లాంటి బిల్లుల ఆమోదంలో మండలిలో అధికార-టీడీపీ సభ్యుల మధ్య ఎంతపెద్ద గొడవైందో అందరు చూసిందే. దాంతోనే మండలి రద్దుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయించారు. ఆవేశంలో తీర్మానం చేయించినా ఆ తర్వాత వాస్తవ పరిస్ధితులను అంచనా వేసుకుని మండలి రద్దు తీర్మానంపై వెనకడుగువేశారు. మూడు రోజుల క్రితమే గతంలో చేసిన మండలి రద్దు తీర్మానాన్ని కూడా రద్దు చేసుకున్నారు.

తాజాగా స్ధానికసంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన 11 ఎంఎల్సీలు ఏకగ్రీవమైపోయాయి. అన్నీ స్ధానాల్లోను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. దాంతో మండలిలో వైసీపీ బలం ఒక్కసారిగా 32కి పెరిగిపోయింది. 2023 చివరకు సభలో సభ్యుల బలం సుమారుగా 50కి చేరుకుంటుందని అంచనా వేసుకుంటున్నారు అధికారపార్టీ నేతలు. ఏదేమైనా ఉభయసభల్లో తమకు ఎదురన్నదే లేకపోవటం అధికారపార్టీ నేతల్లో ఫుల్లుగా జోష్ తో ఉన్నారు.

అయితే ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. అదేమిటంటే పంచాయితీ నుండి అసెంబ్లీ, మండలి దాకా అధికారపార్టీకి ఏకపక్షంగా బలం పెరిగిపోవటం ప్రజాస్వామ్యానికి అంత మంచిదికాదు. ఏకపక్షంగా దఖలుపడిన బలంతో చివరకు ప్రజాస్వామ్యాన్నే చిన్నచూపు చూసే అవకాశం కూడా ఉంది. ఎక్కడ కూడా తనకు ఎదురన్నదే లేదని పాలకులు  అనుకుంటే ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బంది అవుతుంది. పాలకులు కాస్త జాగ్రత్తగా ఉండేవాళ్ళయితే మంచిదే లేకపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి.

This post was last modified on November 27, 2021 11:13 am

Share

Recent Posts

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

2 minutes ago

టాక్సిక్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…

42 minutes ago

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

2 hours ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

4 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

7 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

10 hours ago