Political News

రాష్ట్రమంతా పాదయాత్రలట

అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలనే డిమాండ్ తో తొందరలోనే రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని అమరావతి జేఏసీ డిసైడ్ చేసింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కంటిన్యూ చేయాలని డిమాండ్ తో ఆందోళనకారులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి జేఏసీ నేతలు కావలిలో మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లులో లోపాలున్నాయన్న కారణంగానే హఠాత్తుగా ఉపసంహరించుకున్నట్లుగా మండిపడ్డారు.

మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహిరంచుకుంటున్నట్లు తెలియగానే సోమవారం ఉదయం పాదయాత్రలో ఉన్న జేఏసీ నేతలు, ఆందోళనకారులు స్వీట్లు పంచుకున్నారు. అయితే మధ్యాహ్నానికల్లా ఇపుడు ఉపసంహరించుకున్న బిల్లునే మరింత సమగ్రంగా తిరిగి తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడాన్ని ఆందోళనకారులు తట్టుకోలేకపోయారు. తమ ఉత్సాహం కొద్ది గంటల్లోనే ఆవిరైపోవటాన్ని జీర్ణించుకోలేకపోయారు.

అందుకనే అప్పటికప్పుడు సమావేశం పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని డిసైడ్ చేశారు. తమ పాదయాత్రకు వస్తున్న జనాల మద్దతు చూసే మూడు రాజధానుల ఏర్పాటు నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గిందని ముందుగా అనుకున్నారు. అయితే సాంకేతిక కారణాలతో మాత్రమే ప్రభుత్వం వెనక్కు తగ్గిందని తెలియగానే ఆందోళనకారులు తట్టుకోలేకపోయారు. తమ బిల్లులో తప్పులున్నాయని ప్రభుత్వమే ఒప్పుకుందని జేఏసీ నేతలు చెప్పారు.

మొదటిసారి ప్రవేశపెట్టిన బిల్లుకే జగన్ ప్రభుత్వం రెండేళ్లు తీసుకుంటే మళ్ళీ కొత్త బిల్లును తీసుకొస్తామని ప్రకటించటంలో అర్ధమేలేదంటు మండిపోయారు. కొత్తగా తీసుకొచ్చే బిల్లుకు ప్రభుత్వం ఇంకెంత కాలం తీసుకుంటుందని సూటిగా ప్రశ్నించారు. అమరావతి పాదయాత్రకు ప్రజల్లో భారీ స్పందన వస్తుండటంతో రాష్ట్రమంతటా పాదయాత్రలు చేయడానికి జేఏసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

This post was last modified on November 23, 2021 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

1 hour ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

2 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago