అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలనే డిమాండ్ తో తొందరలోనే రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని అమరావతి జేఏసీ డిసైడ్ చేసింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కంటిన్యూ చేయాలని డిమాండ్ తో ఆందోళనకారులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి జేఏసీ నేతలు కావలిలో మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లులో లోపాలున్నాయన్న కారణంగానే హఠాత్తుగా ఉపసంహరించుకున్నట్లుగా మండిపడ్డారు.
మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహిరంచుకుంటున్నట్లు తెలియగానే సోమవారం ఉదయం పాదయాత్రలో ఉన్న జేఏసీ నేతలు, ఆందోళనకారులు స్వీట్లు పంచుకున్నారు. అయితే మధ్యాహ్నానికల్లా ఇపుడు ఉపసంహరించుకున్న బిల్లునే మరింత సమగ్రంగా తిరిగి తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడాన్ని ఆందోళనకారులు తట్టుకోలేకపోయారు. తమ ఉత్సాహం కొద్ది గంటల్లోనే ఆవిరైపోవటాన్ని జీర్ణించుకోలేకపోయారు.
అందుకనే అప్పటికప్పుడు సమావేశం పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని డిసైడ్ చేశారు. తమ పాదయాత్రకు వస్తున్న జనాల మద్దతు చూసే మూడు రాజధానుల ఏర్పాటు నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గిందని ముందుగా అనుకున్నారు. అయితే సాంకేతిక కారణాలతో మాత్రమే ప్రభుత్వం వెనక్కు తగ్గిందని తెలియగానే ఆందోళనకారులు తట్టుకోలేకపోయారు. తమ బిల్లులో తప్పులున్నాయని ప్రభుత్వమే ఒప్పుకుందని జేఏసీ నేతలు చెప్పారు.
మొదటిసారి ప్రవేశపెట్టిన బిల్లుకే జగన్ ప్రభుత్వం రెండేళ్లు తీసుకుంటే మళ్ళీ కొత్త బిల్లును తీసుకొస్తామని ప్రకటించటంలో అర్ధమేలేదంటు మండిపోయారు. కొత్తగా తీసుకొచ్చే బిల్లుకు ప్రభుత్వం ఇంకెంత కాలం తీసుకుంటుందని సూటిగా ప్రశ్నించారు. అమరావతి పాదయాత్రకు ప్రజల్లో భారీ స్పందన వస్తుండటంతో రాష్ట్రమంతటా పాదయాత్రలు చేయడానికి జేఏసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
This post was last modified on November 23, 2021 10:19 am
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…