Political News

అమరావతి అడుగులు ఇలా… 2014 టు 2021

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అమరావ‌తిని వికేంద్రీక‌రిస్తూ మూడు రాజ‌ధానులు చేశారు. ఇక ఈ రోజు మూడు రాజ‌ధానుల‌ను ర‌ద్దు చేస్తూ మ‌రోసారి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అస‌లు అమ‌రావ‌తి రాజ‌ధానిగా 2014 – 2021 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఏం జ‌రిగిందో ఓ సారి చూద్దాం.

  • 2014లో న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ ఏర్ప‌డి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే అమ‌రావ‌తి రాజ‌ధాని అని నాటి టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
  • 2014 డిశంబ‌ర్ 31 సీఆర్డీయే చ‌ట్టానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.
  • అమ‌రావ‌తిలో మొత్తం 217 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో రాజ‌ధాని ప్రాంతంగా గుర్తించారు.
  • రాజధాని కోసం 54 వేల ఎకరాల ప్రభుత్వ, రైతుల భూముల సమీకరించాల‌ని అనుకున్నారు.
  • మొత్తం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 56 మండలాల్లో సీఆర్డీయే ప‌రిధి విస్త‌రించి ఉంది.
  • 2015 అక్టోబ‌ర్ 22వ తేదీ ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా అమ‌రావ‌తి శంకుస్థాప‌న జ‌రిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు.
  • నాలుగేళ్ల కాలంలో రు. 7200 కోట్ల‌తో నిర్మాణాలు, రోడ్లు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఏర్ప‌డ్డాయి.
  • 2019 డిశంబ‌ర్ 17వ తేదీన మూడు రాజ‌ధానులు అంటూ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.
  • మంత్రులు క‌మిటీ, బోస్ట‌న్ క‌మిటీ. జిఎన్ రావు క‌మిటీ నివేదిక‌ల ఆధారంగా రాజ‌ధానిని వికేంద్ర‌క‌రిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం చేసింది.
  • 2020 జ‌న‌వ‌రిలో సీఆర్డీయే ర‌ద్దు, పాల‌నా వికేంద్ర‌క‌ర‌ణ పేరిట మూడు రాజ‌ధానుల‌ బిల్లులు అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. బిల్లు శాస‌న‌స‌భ‌లో ఆమోదం పొందింది.
  • ప్ర‌భుత్వ బిల్లును శాస‌న మండ‌లిలో ప్ర‌తిప‌క్షం అడ్డుకుంది. ఇక్క‌డ బిల్లు ఆమోదం పొంద‌లేదు.
  • మండలి ప‌రిణామాల‌పై ఆగ్ర‌హంతో జ‌గ‌న్ ఏకంగా మండ‌లినే ర‌ద్దు చేస్తూ తీర్మానం చేశారు.
  • ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై రైతులు, రాజ‌కీయ ప‌క్షాల నేత‌లు హైకోర్టును ఆశ్ర‌యించారు.
  • రెండేళ్లుగా రాజ‌ధానిపై కోర్టులో విచార‌ణ సాగుతూనే ఉంది. ప్ర‌భుత్వం చ‌ట్టాల‌పై గ‌తంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది.
  • ఇక అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరుతో రైతులు మ‌హాపాద‌యాత్ర చేస్తున్నారు.
  • స‌డెన్ ట్విస్టుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల బిల్లు, సీఆర్డీయే ర‌ద్దు బిల్లును క్యాన్సిల్ చేస్తున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

మ‌రి ఏపీ రాజ‌ధాని విష‌యంలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో ? కాల‌మే చెపుతుంది.

This post was last modified on November 22, 2021 3:28 pm

Share

Recent Posts

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

1 hour ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

4 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

8 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

12 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

12 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

13 hours ago