Political News

తప్పు దిద్దుకున్న కాంగ్రెస్

ఇంతకాలానికి కాంగ్రెస్ అధిష్టానంలో మార్పు వచ్చినట్లే ఉంది. మధ్యప్రదేశ్ లో జరిగిన తప్పు రాజస్థాన్ విషయంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి సీనియర్ నేత సచిన్ పైలట్ వర్గానికి మధ్య పరిస్థితులు ఉప్పు-నిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. ఒక సమయంలో తన వర్గాన్ని తీసుకుని పైలెట్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అధిష్టానం అప్రమత్తమవటంతో సచిన్ తన ప్రయత్నాలను మానుకున్నారు కాబట్టే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ అవుతోంది.

నిజానికి రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవ్వడంలో సచిన్ కష్టమే ఎక్కువుంది. అయితే సీనియర్ అయిన గెహ్లాట్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అండ్ కో దగ్గర తనకున్న సన్నిహితాన్ని ఉపయోగించుకుని తానే సీఎం అయ్యారు. సీఎం అయిన దగ్గర నుండి సచిన్ వర్గాన్ని చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. దాంతో గెహ్లాట్-సచిన్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది వ్యవహారం. అందుకనే పార్టీ నుంచి సచిన తన వర్గంతో బయటకు వెళ్ళిపోవాలని అనుకున్నారట.

సరే అధిష్టానం జోక్యం చేసుకుని రెండు వర్గాల మధ్య సంధి చేసింది. ఇందులో భాగంగానే మంత్రివర్గం మొత్తాన్ని రాజీనామా చేయించింది. ఆదివారం సాయంత్రం ఏర్పడిన కొత్త మంత్రివర్గంలో సచిన్ వర్గానికి బాగానే ప్రాధాన్యత దక్కింది. కొత్త మంత్రివర్గంలో సచిన్ వర్గంలోని 5 మందికి చోటు దక్కింది. శాఖలు కూడా ప్రాధాన్యత ఉన్నవే దక్కాయి. దాంతో సచిన్ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి పనిచేయని కారణంగానే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది.

సీఎం కమలనాథ్ కు జ్యోతిరాదిత్య సింధియాకు పడకపోయినా అధిష్టానం జోక్యం చేసుకోలేదు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సింథియానే. అయినా కమలనాథ్ సీఎం అయిపోయారు. దాంతో సమస్యలు మొదలయ్యాయి. ఇపుడు రాజస్థాన్ విషయంలో అధిష్టానం జోక్యం చేసుకున్నట్లే అప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా జోక్యం చేసుకునుంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండుండేది.

చేజేతులారా తమ ప్రభుత్వాన్ని తామే కూల్చుకున్న తర్వాత అధిష్టానానికి కనువిప్పు అయినట్లుంది. అందుకనే రాజస్ధాన్లో జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని కాపాడుకుంది. నిజానికి పార్టీలో వృద్ధ తరాన్ని పక్కన పెట్టేసి యువతకు పెద్ద పీట వేయాలనే నినాదం పార్టీలో ఎప్పటి నుండో వినిపిస్తోంది. సభలు, సమావేశాల్లో అందరు దీనికి మద్దతుగా మాట్లాడుతారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వృద్ధతరానిదే ఆధిపత్యమవుతోంది. దీంతో యువనేతలు చాలామంది పార్టీని వదిలేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధిష్టానం కళ్ళు తెరుస్తుందా ?

This post was last modified on November 22, 2021 3:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీనియర్ స్టార్ల సంక్రాంతి… క్లాష్ సాధ్యమేనా

పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…

2 minutes ago

ఫ‌లించిన ప‌వ‌న్ ప్ర‌య‌త్నం.. బ‌డ్జెట్‌లో `కొబ్బ‌రి`కి కీల‌క స్థానం

ఏపీలోని కోన‌సీమ ప్రాంతంలో కొబ్బ‌రి సాగు ఎక్కువ‌. దేశంలో కేర‌ళ త‌ర్వాత‌.. కోన‌సీమ‌లో భారీ ఎత్తున కొబ్బ‌రి సాగు చేస్తున్నారు.…

51 minutes ago

వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…

60 minutes ago

మూడోసారి దొరికిపోయిన మర్దాని

ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…

1 hour ago

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

3 hours ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

3 hours ago