Political News

బాబు వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని రియాక్షన్

కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం. ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తమ్మినేనికి తాను రాజకీయంగా పున:భిక్ష పెట్టానంటూ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. బాబు మాటల్లో నిజం లేదన్న ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు.

తనకు రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు అని.. తర్వాత రాజకీయంగా పున:భిక్ష పెట్టింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ‘నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కాదు. నేను టీడీపీలో చేరే నాటికి చంద్రబాబు ఆ పార్టీలోనే లేరు. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నారు. ఎన్టీఆర్ నన్ను పిలిచి పార్టీలోకి ఆహ్వానించి ప్రజాప్రతినిధిని చేశారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వచ్చి చేరారు’ అని గుర్తు చేశారు.

ఆ మాటకు వస్తే చంద్రబాబుకు కూడా రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆరేనన్న తమ్మినేని.. తర్వాతి కాలంలో వివిధ అంశాల మీద తాను విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చేశానన్నారు. ఆ తర్వాత తాను వరుసగా ఎన్నికల్లో ఓడిపోయి పదిహేనేళ్ల పాటు రాజకీయంగా వెనుకబడిపోయానన్నారు. అలాంటి వేళలో జగన్మోహన్ రెడ్డి తనను పిలిపించి.. పార్టీలో చేరాలని ఆహ్వానించారని గుర్తు చేశారు.

జగన్ సూచనలతో తాను వైఎస్ విజయమ్మ సమక్షంలో వైసీపీలో చేరినట్లు చెప్పారు. ఈ లెక్క చూసుకుంటే తనకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెడితే.. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పున:భిక్ష పెట్టారన్నారు. సభాపతి స్థానంలో ఉన్న తనను చంద్రబాబు అనటంతో వాస్తవాల్ని వెల్లడిస్తున్నానని.. సభకు తెలియజేస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.

This post was last modified on November 20, 2021 11:40 am

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

2 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

5 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

6 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

6 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

6 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

7 hours ago