Political News

టార్గెట్ చంద్ర‌బాబు.. వైసీపీ వేసిన వ్యూహం ఇదే!

టార్గెట్ చంద్ర‌బాబు.. కేంద్రంగా.. వైసీపీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క అడుగులు వేసింది. వైసీపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. నిన్న‌టి వ‌ర‌కు కూడా.. అసెంబ్లీ నిర్వ‌హ‌ణ విష‌యంలో మొండి ప‌ట్టుద‌ల‌కు పోయిన‌.. వైసీపీ ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా అది కూడా అనూహ్యంగానే నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల‌ను ఆది నుంచి కూడా ఒక్క‌రోజుకే ప‌రిమితం చేయాల‌ని.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. ఆరు మాసాల‌కు ఒక‌సారి.. స‌భ‌ను నిర్వ‌హించాల‌నే కార‌ణంగా రేప‌టితో(న‌వంబ‌రు 19) ఆరు మాసాల గ‌డువు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో క‌నీసం ఒక్క‌రోజు నిర్వ‌హించి మ‌మ అనిపించాల‌ని అనుకుంది.

అయితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మాత్రం.. దీనికి భిన్నంగా.. 15 రోజులైనా స‌భ‌ను నిర్వ‌హించాల‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అనేకం ఉన్నాయ‌ని.. వాట‌న్నింటినీ.. స‌భ‌లో చ‌ర్చించాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. అయిన ప్ప‌టికీ.. వైసీపీ ప్ర‌భుత్వం ససేమిరా అంది. దీంతో ఏకంగా.. టీడీపీ ఒక్క‌రోజు స‌భ‌కు తాము హాజ‌ర‌య్యేది లేద‌ని మీడియాకు స్ప‌ష్టం చేసింది. ఈ వివాదం కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే.. మునిసిపాలిటీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. రాష్ట్రంలో తాజాగా 12 మునిసిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు జ‌రిగాయి.

ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయి.. వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. గడిచిన నాలుగు ద‌శాబ్దాల్లో.. చంద్ర బాబు కంచుకోట‌లోటీడీపీయేత‌ర పార్టీ పాగా వేయ‌డం.. ఇదే తొలిసారి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు క‌ళ్ల‌లో బాధ‌ను చూడాల‌నే ఏకైక కార‌ణంగా.. ఆయ‌న‌ను స‌భావేదిక‌గా ఆట‌ప‌ట్టించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో వైసీపీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. స‌భ‌ను ఒక‌రోజు నుంచి ఏకంగా.. ఆరు రోజుల‌కు పొడిగించింది. ఈ నెల 26 వ తేదీ వ‌ర‌కు స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని.. స్పష్టం చేసింది. అంతేకాదు.. స‌భ ప్రారంభానికి ముందు.. నిర్వ‌హించిన బీఏసీ స‌మావేశంలోనే ముఖ్య‌మంత్రి ఈవిష‌యాన్ని ప్ర‌స్తావించారు. సో.. దీనిని బ‌ట్టి.. అసెంబ్లీ ప‌నిదినాల‌ను అనూహ్యంగా పెంచ‌డం వెనుక ఉన్న వ్యూహం ఏంట‌నేది స్ప‌ష్ట‌మైంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో విద్యుత్ చార్జీ ల పెంపు, పెట్రోల్ ధ‌ర‌ల పెంపు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు.. ఇసుక ల‌భ్య‌త‌, పెట్టుబ‌డులు, అక్ర‌మాలు.. పోలీసుల దూకుడు వంటి అనేక స‌మ‌స్య‌ల‌తోపాటు.. రైతుల స‌మ‌స్య‌ల‌ను కూడా ప్ర‌స్తావించాల‌నేది టీడీపీ వ్యూహం. అయితే.. వైసీపీ వ్యూహం అంతా కూడా రాజ‌కీయంగానే జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్టమైంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌లు.. చంద్ర‌బాబు దీక్ష‌, కేంద్రంలో ఆయ‌న ప‌రువు.. ఇలా.. కొన్ని వివాదాస్ప‌ద అంశాల‌నే వైసీపీ అజెండాగా తీసుకునే అవ‌కాశం ఉంది. మొత్తంగా ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago