Political News

అమరావతి అందరిదీ…హైకోర్టు సీజే మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పిటిషన్ల విచారణలో జాప్యం జరిగిందని, త్వరగా వీటి విచారణ పూర్తి చేస్తామని నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. ఈ క్రమంలోనే నేడు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రాజధాని సమస్య కేవలం రైతులదే కాదని, అది రైతుల రాజధాని కాదని, ఏపీ ప్రజలందరి రాజధాని అని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, దేశంలో ఇన్ని వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన దాఖలాలు లేవని అభిప్రాయపడ్డారు.

ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు. అమరావతి రైతులు తమ స్వార్థం కోసం ఉద్యమం చేయడం లేదని, ఏపీ రాజధాని కోసం చేస్తున్నారని అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడారని, అది వాళ్ల కోసం పోరాడడం మాత్రమే కాదని అన్నారు. ఆ స్వాతంత్ర్యం కేవలం సమరయోధులకు సంబంధించినది కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని సీజే మిశ్రా స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. అమరావతి రాజధానిగా ఏర్పడిన నేపథ్యం, అందుకు రైతులు చేసిన త్యాగాలు, ప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందాలు వంటి పలు అంశాలు కోర్టు దృష్టికి తెచ్చారు.

Satya

Recent Posts

ప్రభాస్ సినిమా పోతుందని ముందే తెలుసట

‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…

1 hour ago

లెనిన్ మీద మెగాభిమానుల గుస్సా

అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…

3 hours ago

చిరుకు తండ్రిగా గ‌ర్వం… న‌టుడిగా క‌ష్టం

రెండో సినిమా మ‌గ‌ధీర‌తోనే తాను తండ్రికి త‌గ్గ త‌న‌యుడిని అని చాటుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఇక…

4 hours ago

పాప రాలేదు.. కుక్క ఇక లేదు.. ఏపీకి స‌వాల్‌గా కేసు!

ఏపీ ప్ర‌భుత్వానికి.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పోలీసుల‌కు కూడా ఓ కేసు స‌వాల్‌గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…

4 hours ago

కంగనా క్రేజ్ మటాష్

ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…

6 hours ago

ఐశ్వర్య చెప్పింది నిజమేనా?

ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…

8 hours ago