Political News

అమరావతి అందరిదీ…హైకోర్టు సీజే మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పిటిషన్ల విచారణలో జాప్యం జరిగిందని, త్వరగా వీటి విచారణ పూర్తి చేస్తామని నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. ఈ క్రమంలోనే నేడు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రాజధాని సమస్య కేవలం రైతులదే కాదని, అది రైతుల రాజధాని కాదని, ఏపీ ప్రజలందరి రాజధాని అని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, దేశంలో ఇన్ని వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన దాఖలాలు లేవని అభిప్రాయపడ్డారు.

ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు. అమరావతి రైతులు తమ స్వార్థం కోసం ఉద్యమం చేయడం లేదని, ఏపీ రాజధాని కోసం చేస్తున్నారని అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడారని, అది వాళ్ల కోసం పోరాడడం మాత్రమే కాదని అన్నారు. ఆ స్వాతంత్ర్యం కేవలం సమరయోధులకు సంబంధించినది కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని సీజే మిశ్రా స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. అమరావతి రాజధానిగా ఏర్పడిన నేపథ్యం, అందుకు రైతులు చేసిన త్యాగాలు, ప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందాలు వంటి పలు అంశాలు కోర్టు దృష్టికి తెచ్చారు.

This post was last modified on November 16, 2021 11:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

9 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago