Political News

ఈటల స్థానాన్ని భర్తీ చేయబోతున్న కేసీఆర్!

కేసీఆర్ వ్యూహాలు ఓ పట్టాన ఎవరికీ అర్థం కావు. ప్రత్యర్థులు అర్థం చేసుకునే లోపే ఆయన తన పనిని పూర్తి చేస్తారు. ఎవరికీ అంతుచిక్కకుండా ఆయన వ్యూహాలుంటాయి. చివరికి గులాబీ పార్టీ నేతలకు కూడా ఆయన చిక్కరు. అంతా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. భవిష్యత్తును ఇప్పుడే అంచనా వేసి పావులు కదపడంలో కేసీఆర్ దిట్ట. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అందరి ఊహాగానాలను భిన్నంగా వ్యవహరించి.. గులాబీ శిబిరానికి కూడా కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపికలో కేసీఆర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికలో అనూహ్యంగా ఎంపీ బండా ప్రకాష్ ను ఎంపిక చేశారు. బండా ప్రకాష్ తో పాటు రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించారు. ఈ రోజు నామినేషన్ లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా ఈ రోజే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అందరి ఊహగానాలకు భిన్నంగా బండా ప్రకాష్ ను ఎంపిక చేశారు.

బండ ప్రకాష్ ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటికే ఐదుగురి పేర్లు మాత్రమే వినిపించాయి. ఆరో అభ్యర్థి ఎవరా? అనే సందేహం వ్యక్తమవుతున్న సందర్భంలో బండా ప్రకాష్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న ప్రకాష్ ను ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత కేసీఆర్ తన కేబినెట్ లోకి చేర్చుకుంటారని గులాబీ నేతలు చెబుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలో మరోసారి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు చట్ట సభల్లోకి అడుగుపెట్టని కౌశిక్ రెడ్డి, రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డిలో ఈ మండలిలో కూర్చోబోతున్నారు.

ఈటలను కేబినెట్ నుంచి భర్తరప్ చేసిన తర్వాత అదే సమాజికవర్గానికి చెందిన బండ ప్రకాష్ ను మంత్రిని చేస్తారని చెబుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ముదిరాజ్ సామాజికవర్గం చాలా కీలమైనది. ఆ సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది. అందువల్ల అటు ముదిరాజ్ సామాజికవార్గాన్ని , ఇటు బీసీలను సంతృప్తి పర్చడం కోసం ప్రకాష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటలను బయటకు పంపిన తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో ఆ ఖాళీని భర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈటలను బయటకు పంపారనే ముద్రను తొలగించుకునేందుకు ప్రకాష్ ను కేబినెట్ లోకి తీసుకుని.. ఆ మచ్చను కేసీఆర్ తుడుపుకోవాలని అనుకుంటున్నారు.

అయితే ప్రకాష్ మండలిలోకి వస్తే ఎంపీ స్థానం ఖాళీ అవుతుంది. ఆ ఖాళీని మధుసూదనచారితో భర్తీలో చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారుని చెబుతున్నారు. గతంలో మధుసూదనచారి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు కాబట్టి ఆయనను రాజ్యసభకు పంపితే గౌరవంగా ఉంటుందని, అందువల్ల ఆయనను రాజ్యసభకు పంపుతారని చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకున్నారు. ఇప్పటికే నామినేషన్ ల ప్రక్రియను పూర్తి చేశారు. ఒక్కో అభ్యర్థికి పదిమంది ఎమ్మెల్యేలు సంతకాలు కూడా చేశారు. నామినేషనల్ పక్రియ పూర్తి కాగానే అందరూ ఏకగ్రీవమవుతున్నారు.

This post was last modified on November 16, 2021 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ డే – కంటెంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం

టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…

4 hours ago

మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?

ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…

4 hours ago

పేర్ని నాని… ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేయగలరా?

రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…

5 hours ago

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

7 hours ago

అలా చెప్పుకోవడం కరెక్టేనా సీఎం గారు?

కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…

11 hours ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

12 hours ago