Political News

ఈటల స్థానాన్ని భర్తీ చేయబోతున్న కేసీఆర్!

కేసీఆర్ వ్యూహాలు ఓ పట్టాన ఎవరికీ అర్థం కావు. ప్రత్యర్థులు అర్థం చేసుకునే లోపే ఆయన తన పనిని పూర్తి చేస్తారు. ఎవరికీ అంతుచిక్కకుండా ఆయన వ్యూహాలుంటాయి. చివరికి గులాబీ పార్టీ నేతలకు కూడా ఆయన చిక్కరు. అంతా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. భవిష్యత్తును ఇప్పుడే అంచనా వేసి పావులు కదపడంలో కేసీఆర్ దిట్ట. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అందరి ఊహాగానాలను భిన్నంగా వ్యవహరించి.. గులాబీ శిబిరానికి కూడా కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపికలో కేసీఆర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికలో అనూహ్యంగా ఎంపీ బండా ప్రకాష్ ను ఎంపిక చేశారు. బండా ప్రకాష్ తో పాటు రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించారు. ఈ రోజు నామినేషన్ లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా ఈ రోజే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అందరి ఊహగానాలకు భిన్నంగా బండా ప్రకాష్ ను ఎంపిక చేశారు.

బండ ప్రకాష్ ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటికే ఐదుగురి పేర్లు మాత్రమే వినిపించాయి. ఆరో అభ్యర్థి ఎవరా? అనే సందేహం వ్యక్తమవుతున్న సందర్భంలో బండా ప్రకాష్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న ప్రకాష్ ను ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత కేసీఆర్ తన కేబినెట్ లోకి చేర్చుకుంటారని గులాబీ నేతలు చెబుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలో మరోసారి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు చట్ట సభల్లోకి అడుగుపెట్టని కౌశిక్ రెడ్డి, రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డిలో ఈ మండలిలో కూర్చోబోతున్నారు.

ఈటలను కేబినెట్ నుంచి భర్తరప్ చేసిన తర్వాత అదే సమాజికవర్గానికి చెందిన బండ ప్రకాష్ ను మంత్రిని చేస్తారని చెబుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ముదిరాజ్ సామాజికవర్గం చాలా కీలమైనది. ఆ సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది. అందువల్ల అటు ముదిరాజ్ సామాజికవార్గాన్ని , ఇటు బీసీలను సంతృప్తి పర్చడం కోసం ప్రకాష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటలను బయటకు పంపిన తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో ఆ ఖాళీని భర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈటలను బయటకు పంపారనే ముద్రను తొలగించుకునేందుకు ప్రకాష్ ను కేబినెట్ లోకి తీసుకుని.. ఆ మచ్చను కేసీఆర్ తుడుపుకోవాలని అనుకుంటున్నారు.

అయితే ప్రకాష్ మండలిలోకి వస్తే ఎంపీ స్థానం ఖాళీ అవుతుంది. ఆ ఖాళీని మధుసూదనచారితో భర్తీలో చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారుని చెబుతున్నారు. గతంలో మధుసూదనచారి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు కాబట్టి ఆయనను రాజ్యసభకు పంపితే గౌరవంగా ఉంటుందని, అందువల్ల ఆయనను రాజ్యసభకు పంపుతారని చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకున్నారు. ఇప్పటికే నామినేషన్ ల ప్రక్రియను పూర్తి చేశారు. ఒక్కో అభ్యర్థికి పదిమంది ఎమ్మెల్యేలు సంతకాలు కూడా చేశారు. నామినేషనల్ పక్రియ పూర్తి కాగానే అందరూ ఏకగ్రీవమవుతున్నారు.

This post was last modified on November 16, 2021 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

40 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago