కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చేట్లే ఉంది. పోలింగ్ తుది దశకు వచ్చిన దశలో చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోయాయి. ఎన్నికలో గెలవటం కోసం అధికార వైసీపీ ఇన్ని దౌర్జన్యాలు చేయాలా ? అధికార పార్టీ నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా ? అంటు పలు విమర్శలు చేశారు. వైసీపీ నేతలను శాపనార్థాలు పెట్టారు. వైసీపీ నేతలు దగ్గరుండి మరీ దొంగ ఓట్లు వేయించారంటు మండిపోయారు.
ఏపీలో ఎన్నికలను ఇంతగా అపహాస్యం చేసిన ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదంటు కోపంతో ఊగిపోయారు. ఇంకా చాలా చాలానే మాట్లాడారు. వైసీపీ నేతలపై చేయని ఆరోపణలు, విమర్శలు లేవు. ఇదంతా చూసిన తర్వాత టీడీపీ ఓటమి ఖాయమైపోయిందనే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కుప్పంలో దొంగ ఓట్లకు సంబంధించి చాలా హడావుడి జరిగింది. పోలీసు పవర్ ఎవరి వద్ద ఉంటే వారికి కొన్ని అవకాశాలు ఉండటం కామన్. అధికారంలో ఉండటం డెఫనెట్ గా వైసీపీకి అనుకూలించే అశమనటంలో సందేహం లేదు. ఎన్నికల్లో దొంగ ఓట్లు, గొడవలు ఇటీవల సాధారణం అయిపోయాయి.
జగన్ అధికారంలోకి వస్తే తమనింత టార్గెట్ చేస్తాడని చంద్రబాబు ఊహించి ఉండరు. ఏవేవో చేస్తారు గాని తన కుప్పం నియోజకవర్గంపై ఇంత దృష్టటిపెడతారని కూడా అనుకుని ఉండరు. దీనికి కారణం.. జగన్ చంద్రబాబుకు తీవ్రమైన రాజకీయ ప్రత్యర్థే కాకకుండా స్థానిక నేత పెద్దిరెడ్డికి కూడా చంద్రబాబే సుదీర్ఘకాల ప్రత్యర్థి కావడంతో వారు అదేపనిగా చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టడానికి తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే కుప్పంపై ఫోకస్. అధికారం చేతిలో లేనపుడు ప్రజాస్వామ్యమని, దొంగఓట్లని, దౌర్జన్యాలని మీడియా సమావేశంలోకోపంతో ఊగిపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు.
This post was last modified on November 16, 2021 1:56 pm
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…