Political News

బాబుకు అక్కడ ఇద్దరు శత్రువులు

కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చేట్లే ఉంది. పోలింగ్ తుది దశకు వచ్చిన దశలో చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోయాయి. ఎన్నికలో గెలవటం కోసం అధికార వైసీపీ ఇన్ని దౌర్జన్యాలు చేయాలా ? అధికార పార్టీ నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా ? అంటు పలు విమర్శలు చేశారు. వైసీపీ నేతలను శాపనార్థాలు పెట్టారు. వైసీపీ నేతలు దగ్గరుండి మరీ దొంగ ఓట్లు వేయించారంటు మండిపోయారు.

ఏపీలో ఎన్నికలను ఇంతగా అపహాస్యం చేసిన ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదంటు కోపంతో ఊగిపోయారు. ఇంకా చాలా చాలానే మాట్లాడారు. వైసీపీ నేతలపై చేయని ఆరోపణలు, విమర్శలు లేవు. ఇదంతా చూసిన తర్వాత టీడీపీ ఓటమి ఖాయమైపోయిందనే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కుప్పంలో దొంగ ఓట్లకు సంబంధించి చాలా హడావుడి జరిగింది. పోలీసు పవర్ ఎవరి వద్ద ఉంటే వారికి కొన్ని అవకాశాలు ఉండటం కామన్. అధికారంలో ఉండటం డెఫనెట్ గా వైసీపీకి అనుకూలించే అశమనటంలో సందేహం లేదు. ఎన్నికల్లో దొంగ ఓట్లు, గొడవలు ఇటీవల సాధారణం అయిపోయాయి.

జగన్ అధికారంలోకి వస్తే తమనింత టార్గెట్ చేస్తాడని చంద్రబాబు ఊహించి ఉండరు. ఏవేవో చేస్తారు గాని తన కుప్పం నియోజకవర్గంపై ఇంత దృష్టటిపెడతారని కూడా అనుకుని ఉండరు. దీనికి కారణం.. జగన్ చంద్రబాబుకు తీవ్రమైన రాజకీయ ప్రత్యర్థే కాకకుండా స్థానిక నేత పెద్దిరెడ్డికి కూడా చంద్రబాబే సుదీర్ఘకాల ప్రత్యర్థి కావడంతో వారు అదేపనిగా చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టడానికి తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే కుప్పంపై ఫోకస్. అధికారం చేతిలో లేనపుడు ప్రజాస్వామ్యమని, దొంగఓట్లని, దౌర్జన్యాలని మీడియా సమావేశంలోకోపంతో ఊగిపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు.

This post was last modified on November 16, 2021 1:56 pm

Share
Show comments

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

42 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago