Political News

బాబు మాటే నెగ్గుతోందా… వైసీపీ ఇదే మాట అంటోందా…!

ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న వారు ఇదే మాట చెబుతున్నారు. ఇక‌, అధికార పార్టీలోనూ ఇదే గుస‌గుస వినిపిస్తోంది. “చంద్ర‌బాబు చెప్పిందే ఫైన‌లా?” అంటూ వైసీపీ నాయ‌కులు కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల విష‌యంలో త‌లెత్తిన వివాదం ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల‌ను విలీనం చేయాల‌నే ప్ర‌తిపాద‌నతో ప్ర‌భుత్వం జీవో 42, జీవో 50ల‌ను తీసుకువ‌చ్చింది. త‌ద్వారా ఆయా విద్యాసంస్థ‌లు.. ప్రైవేటు ప‌రం అవుతాయ‌ని.. దీంతో పేద విద్యార్థులు చ‌దువుల‌కు దూరం అవుతార‌ని.. టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. ఇటీవ‌ల అనంత‌పురంలో జ‌రిగిన ఆందోళ‌న ప‌రాకాష్ట‌కు చేరింది. విద్యార్థుల‌పై లాఠీ చార్జీతో ప్ర‌భుత్వంపై మ‌రింత సెగ పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ఈ అంశంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎయిడెడ్‌పై ఇచ్చిన జీవోలను వెన‌క్కి తీసుకోవాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. దేశంలో ఎక్క‌డా ఎయిడెడ్ సంస్థ‌ల‌ను విలీనం చేసుకున్న ప్ర‌భుత్వం లేద‌ని.. ఆయ‌న చెప్పారు.

ఇక‌, రాబోయే రోజుల్లో టీడీపీ ఎయిడెడ్ విద్యార్థుల‌కు అండగా ఉంటుంద‌ని.. వారి ఉద్య‌మానికి మ‌ద్ద‌తిస్తున్నది తెలిపారు. ఈ అంశం.. ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్తోంది. పైగా విద్యావ్య‌వ‌స్థ‌తో కూడుకున్న సున్నిత విష‌యం కావ‌డంతో ప్ర‌జ‌లు కూడా అలానే రియాక్ట్ అవుతున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ వెర్ష‌న్ చూసుకుంటే.. తామేమీ బ‌లవంతం చేయ‌డం లేద‌ని.. విలీనం ప్ర‌తిపాద‌న‌.. కేవ‌లం అంగీక‌రించిన సంస్థ‌ల‌కే వ‌ర్తించ‌నుంద‌ని.. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేస్తున్నాయ‌ని.. చెబుతున్నారు.

అయితే.. ప్ర‌భుత్వ వాద‌న కంటే కూడా ప్ర‌తిప‌క్షం వాద‌న బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంద‌ని.. ప్ర‌భుత్వ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని వివ‌ర‌ణ‌లు ఇచ్చినా.. మంత్రులు కూడా ఈ విష‌యంపై స్పందించినా.. ప్ర‌జ‌ల్లోకి మాత్రం ప్ర‌తిప‌క్ష‌వాద‌నే బ‌లంగా చేరింది. దీంతో చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే జ‌రుగుతుందా? ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గాలా? అనే సందేహాలు.. మంత్రుల్లోనే వినిపిస్తున్నాయి. దీనిపై సీఎం జోక్యం చేసుకుని.. ఇప్ప‌టికైనా మీడియా ముందుకు రావాల‌ని.. ఎయిడెడ్‌పై వివ‌రించాల‌ని వారు కోరుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

20 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

6 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago