Political News

పాద‌యాత్ర ఎఫెక్ట్‌.. త‌ల‌ప‌ట్టుకుంటున్న జ‌గ‌న్‌..!


వైసీపీ అధినేతకు పాద‌యాత్ర సంక‌టం ప‌ట్టుకుందా? ఆయ‌నకు పాద‌యాత్ర త‌ల‌నొప్పిగా మారిందా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు ఔన‌నే అంటున్నారు. అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అడిగిన వారికి అడిగిన‌ట్టు హామీలు కుమ్మ‌రించారు. ఒక్క కాపు సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ త‌ప్ప‌.. మిగిలిన అనేక వ‌ర్గాల‌కు ఆయ‌న హామీలు ఇచ్చారు. దీనిలో ప్ర‌ధానంగా కీల‌క‌మైన ఉద్యోగ వ‌ర్గాల‌కు సీపీఎస్ పింఛ‌న్‌ను ర‌ద్దు చేస్తాన‌ని.. ఆయ‌న చెప్పారు. అదేవిధంగా పీఆర్సీ.. వంటి కీల‌క హామీ కూడా ఇచ్చారు.

అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేయ‌డం కూడా ఇప్పుడు ప్ర‌భుత్వానికి త‌ల‌కు మించిన భారంగా మారింది. వ‌స్తున్న నిధులు వ‌చ్చిన‌ట్టుగానే ఖ‌ర్చయి పోతుండ డం.. ఆదాయం పెంచుకునే మార్గాలు క‌నిపించ‌క‌పోవ‌డం.. ప‌న్న‌లు, సెస్సులు పెంచ‌క‌పోతే..న‌డ‌వ‌ని ప‌రిస్థితి ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఏర్ప‌డింది. దీంతో జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్యంగా గ‌త కొద్ది రోజులుగా ఉద్యోగ సంఘాల నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

నిజానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి అనుకూలంగా వాయిస్ వినిపించారు. అయితే.. ఇప్పుడు ఇదే ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘాలు.. ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ఉన్నాయి. పీఆర్సీ అమ‌లు కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే.. ఇది వేల కోట్ల రూపాయ‌ల‌తో కూడుకున్న‌ది కావ‌డం.. ఖ‌జానా ఇబ్బందుల్లో ఉండ‌డం తో దీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక పోవ‌డం వంటివి.. క‌నిపిస్తున్నాయి.

ఇదిలావుంటే.. పాద‌యాత్ర స‌మ‌యంలో త‌మ‌కు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌లేద‌ని.. కూడా ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నాయ‌కుడు.. సూర్య‌నారాయ‌ణ వంటివారు బాహాటంగాఏ ఆరోపిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌భుత్వ అనుకూల పార్టీగా టీడీపీ ఒక్క‌టే నిలిచింద‌నే వాద‌న ఉద్యోగుల్లో వినిపిస్తోంది. దీంతో ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. త‌మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. వైసీపీ నాయ‌కులు భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 12, 2021 7:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago