Political News

ఈ ఓవర్ యాక్షన్ అవసరమా ?

కుప్పంలో పోలీసుల ఓవర్ యాక్షన్ పై హైకోర్టు మండిపడింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధులు ముందస్తుగా తమ నుండి అనుమతి తీసుకోవాలని పలమనేరు డీఎస్పీ నోటీసులివ్వటం బాగా వివాదాస్పదమైంది. దారినపోయే చెత్తను నెత్తినేసుకున్నట్లుంది పోలీసుల వ్యవహారం. అవసరం లేనిచోట బాగా ఓవర్ యాక్షన్ చేసి చివరకు హైకోర్టు దగ్గర అంక్షితలు వేయించుకుంటే కానీ పోలీసులకు తృప్తి తీరలేదేమో.

నిజానికి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పోలీసులకు అసలు సంబంధమే లేదు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు, అభ్యర్థులు, మద్దతుదారులు ప్రచారం చేసుకోవటం అన్నది వారి హక్కు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అభ్యర్థులు లేదా వాళ్ళ మద్దతుదారులు ప్రచారం చేసుకోకుండా ఎలాగుంటారు ? ఇంత చిన్న లాజిక్ మిస్సయిన పోలీసులు అనవసరంగా కలగజేసుకున్నారు. ప్రచారానికి తమ అనుమతి తీసుకోవాలని కుప్పంలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తున్న పలమనేరు డీఎస్పీ టీడీపీ అభ్యర్ధులు+నేతలకు నోటీసులివ్వటం వివాదాస్పదమైంది.

పోలీసుల నోటీసులపై వెంటనే టీడీపీ కోర్టుకెక్కింది. దాంతో కేసును విచారించిన హైకోర్టు పోలీసులను ఫుల్లుగా వాయించేసింది. ఇపుడు ప్రచారానికి అనుమతి తీసుకోవాలని చెప్పిన పోలీసులు రేపు నామినేషన్లు వేయటానికి కూడా తమ అనుమతి తీసుకోవాలని చెబుతారేమో అన్న కోర్టు ప్రశ్న నూరుశాతం కరెక్టే అనడంలో సందేహం లేదు. ప్రచారానికి పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని డీఎస్పీకి తెలీదా ? తెలిసీ నోటీసులు ఎలా ఇచ్చారు ?

ఇచ్చే నోటీసులేదో వైసీపీ అభ్యర్థులు, నేతలకు కూడా ఇచ్చుంటే అది వేరే విధంగా ఉండేది. కానీ కేవలం టీడీపీకి మాత్రమే ఇవ్వటంతో వివాదాస్పదమైంది. తెరవెనుక వైసీపీ నేతల ఆదేశాల ప్రకారమే పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి

విచిత్రమేమంటే అప్పట్లో టీడీపీ అయినా ఇపుడు వైసీపీ అయినా బాగానే ఉన్నాయి. మధ్యలో కోర్టులో తలొంచుకున్నది పోలీసులే. తెరమీద ఎప్పుడు కూడా పోలీసుల ఓవర్ యాక్షనే ఎక్స్ పోజ్ అవుతోంది. ఈ విషయంలో రాజకీయపార్టీలు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. పోలీసుల ఓవర్ యాక్షన్ను కంట్రోల్ చేయకపోతే చివరకు పార్టీలే పోలీసుల దెబ్బకు బలైపోతారు. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా పోలీసు వ్యవస్ధ జోలికి పోకుండా ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో దుష్ఫలితాలను సమాజమే అనుభవించాల్సుంటుంది.

This post was last modified on November 12, 2021 11:08 am

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

19 minutes ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

25 minutes ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

2 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

2 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

2 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

8 hours ago