Political News

కుప్పంలో ఓటరైన చంద్రబాబు

అదేమిటి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇఫుడు ఓటరవ్వటం ఏమిటనే సందేహం వచ్చిందా ? అనే సందేహం వచ్చిందా ? అవును మీ సందేహం కరెక్టే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కుప్పం నగర పంచాయితీకి మున్సిపల్ హోదా దక్కింది కాబట్టి చంద్రబాబు ఇపుడు తన ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కుప్పం మున్సిపాలిటిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా చంద్రబాబు ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. ప్రతి మున్సిపాలిటిలో ఎంఎల్ఏ లేదా ఎంఎల్సీ లేదా ఎంపీలు ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అందరికీ తెలిసిందే కదా.

ఆ పద్ధతిలోనే చంద్రబాబు ఎంఎల్ఏ హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటును నమోదు చేసుకున్నారు. ఇంతకాలం అవసరం రానిది ఇపుడే ఎందుకు ఓటుహక్కు తీసుకున్నారంటే ఇపుడు కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక జరుగుతుండటమే కారణం. కుప్పం మున్సిపల్ ఎన్నికలో అధికార వైసీపీ-టీడీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్న విషయం చూస్తున్నదే. ఫైట్ ఇంత టైట్ గా నడుస్తున్నపుడు ప్రతి ఓటు ఎంతో విలువైనదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అలాంటి ఎన్నికలో రేపు మున్సిపాలిటిలో గెలవడానికి టీడీపీకి ఒకవేళ ఒక ఓటు తక్కువైతే అప్పుడు ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకనే ముందుజాగ్రత్తగా చంద్రబాబు తన ఎక్స్ అఫీషియో ఓటును నమోదు చేసుకున్నారు. 25 వార్డుల మున్సిపాలిటీలో టీడీపీకి మెజారిటీ వస్తే నో ప్రాబ్లెమ్. అలా కాకుండా కేవలం ఒక్క ఓటు తేడా వస్తే ఆ తేడాను తన ఓటుతోనే భర్తీ చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. గడచిన రెండున్నరేళ్ళుగా కుప్పం మున్సిపాలిటిలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు నమోదు చేసుకోని చంద్రబాబు ఇపుడు హడావుడిగా నమోదు చేసుకోవటం గమనార్హం.

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే గెలిచారు. టీడీపీ బహిష్కరణతో పరిషత్ ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఇలాంటి నేపథ్యంలో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ఎవరు అనుకోవటం లేదు. అయితే రాజకీయాల్లో ఎప్పుడేమవుతుందో ఎవరు చెప్పలేరు. అందుకనే ముందు జాగ్రత్తగా చంద్రబాబు ఎక్స్ అఫీషియో సభ్యుడయ్యారు. దీని వల్ల రేపటి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో బహుశా మొదటిసారి చంద్రబాబు పాల్గొనే అవకాశం వస్తుందేమో చూడాలి.

అయినా ఒకవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో క్యాంపేశారు. ఇదే సమయంలో మాజీమంత్రులు, ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు టీడీపీ తరపున కుప్పంలో క్యాంపేశారు. క్షేత్రస్థాయిలో పరిస్ధితులను గమనిస్తుంటే ఫలితం నువ్వా-నేనా అనే అవసరమైతే రాదనే అనిపిస్తోంది. ఎవరు గెలిచినా క్లియర్ మెజారిటితోనే ఛైర్మన్ పదవిని గెలుచుకోవటం ఖాయమనే అనిపిస్తోంది. చూడాలి చివరకి ఏమవుతుందో.

This post was last modified on November 10, 2021 2:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

1 hour ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

5 hours ago