కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్యానిక్ సిచువేషన్లో ఉన్న జనాల్లో ధైర్యం నింపడానికి, అలాగే లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనానికి ప్రభుత్వం మీద ఆగ్రహం పెరగకుండా ఉండటానికి తరచుగా ప్రెస్ మీట్లు పెట్టి మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత ఆయన మళ్లీ అంతగా మీడియా ముఖం చూసింది లేదు. ఏవైనా ఎన్నికల్లాంటివి వస్తే బహిరంగ సభల్లో పాల్గొన్నారు కానీ.. ప్రెస్ మీట్లకు హాజరు కాలేదు.
ఐతే హుజూరాబాద్ ఎన్నికల్లో పరాభవం చవిచూశాక కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం అందరి దృష్టినీ ఆకర్షించింది. హుజూరాబాద్ ఫలితం కేసీఆర్లో అహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించిందని ఈ ప్రెస్ మీట్లో స్పష్టంగా కనిపించింది. ఇంకా ఈ ప్రెస్ మీట్లో కేసీఆర్ వ్యవహార శైలి, ఆయన వ్యాఖ్యల పట్ల ఎవరికి వాళ్లు రకరకాల భాష్యాలు తీస్తున్నారు.
కాగా దుబ్బాక ఎమ్మెల్యే, భాజపా కీలక నేతల్లో ఒకరైన రఘునందనరావు ఒక టీవీ ఛానెల్తో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రెస్ మీట్ విషయంలో ఆసక్తికర విశ్లేషణ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు అనేక అర్థాలుంటాయని.. ఆయన తాజా ప్రెస్ మీట్ ఉద్దేశాలే వేరని ఆయన వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఓటమి నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తుండొచ్చని.. ఈసారి ముందస్తు గత పర్యాయంలా ఆరు నెలలుండదని.. షెడ్యూల్ కంటే ఏడాది 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని ఆయనన్నారు.
హుజూరాబాద్లో గెలిచిన ఈటల రాజేందర్ ఊరుకోవట్లేదని, కొందరు కీలక నేతల్ని భాజపాలోకి తీసుకెళ్లబోతోందని కేసీఆర్కు తెలుస్తోందని.. హుజూరాబాద్ ఓటమి నేపథ్యంలో తన పనైపోయిందని, ప్రజల్లో తన పట్ల వ్యతిరేకత పెరిగిపోతోందని కేసీఆర్కు అర్థమైందని, ఈ నేపథ్యంలో బండి సంజయో ఇంకొకరో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారని.. అప్పుడు కేసీఆర్ సవాలును స్వీకరిస్తూ అసెంబ్లీని రద్దు చేసినా చేసేస్తాడని రఘునందనరావు అభిప్రాయపడ్డారు.
ఫిబ్రవరి-మార్చిలో యూపీ ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిపించడానికి కేసీఆర్ వెనుకాడడని.. ఆ దిశగా ఇప్పటికే పార్టీ నాయకులకు సంకేతాలు కూడా వెళ్లాయని.. వాళ్లకు కావాల్సినంత డబ్బులిచ్చి ఎన్నికలకు రెడీ చేస్తున్నాడని.. ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా ముందస్తుకు వెళ్లడం ద్వారా ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం కాక అయోమయ స్థితిని ఎదుర్కొంటాయని.. రోజులు గడిచేకొద్దీ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందన్న ఉద్దేశంతో కేసీఆర్ ఇలా చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని రఘనందనరావు విశ్లేషించడం గమనార్హం.
This post was last modified on November 9, 2021 9:32 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…