Political News

ఈట‌ల‌కు నోటీసులు.. వెంటాడుతున్న కేసీఆర్‌!

రామేశ్వ‌రం వెళ్లినా.. శ‌నేశ్వ‌రం త‌ప్ప‌లేద‌న్న‌ట్టుగా ఉంది.. మాజీ మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నాయ‌కుడు.. ఈటల రాజేంద‌ర్ ప‌రిస్థితి. గ‌త మే నెల‌లో.. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైందో.. ఇప్పుడు మ‌ళ్లీ అదే రిపీట్ అయింది. తాజాగా.. ఈట‌ల‌కు.. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోని జ‌మున హ్యాచ‌రీస్‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది. నిజానికి గ‌తంలోనే మెద‌క్ క‌లెక్టర్ నోటీసులు ఇచ్చారు. అయితే.. ఇవి చెల్ల‌వంటూ.. తెలంగాణ హైకోర్టు చెప్ప‌డంతో.. అప్ప‌టి నుంచి మౌనంగా ఉన్న కేసీఆర్ ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రోసారి నోటీసులు జారీ చేయించింది. దీంతో కేసీఆర్‌.. ఈట‌ల‌ను వ‌దిలి పెట్ట‌రా? అనే టాక్ వినిపిస్తోంది.

తన కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ కోసం మాజీమంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వ‌చ్చాయి. దీనిపై కొంద‌రు ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశార‌ని.. పేర్కొంటూ.. గ‌తంలోనే ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. అయితే.. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లదని పేర్కొంది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని సూచించింది.

అంతేకాదు.. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ఆదేశించింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇవ్వమనేలా ఉండకూడదని అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్ర‌మంలో అప్ప‌టి నుంచి ఈ కేసు విష‌యంలో.. కేసీఆర్ మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల హుజూరాబాద్ ఉప పోరులో ఈట‌ల గెలుపు త‌ర్వాత‌.. వెంట‌నే ఆయ‌న తుట్టెను క‌దిపిన‌ట్టు భావిస్తున్నారు.

ముసాయిపేట‌లోని అసైన్డ్ భూముల‌పై విచార‌ణ‌కు సీఎం కేసీఆర్ తాజాగా విచార‌ణ‌కు ఆదేశించారు. దీంతో అధికారులు ఈట‌ల రాజేందర్‌కు నోటీసులు అందించారు. అయితే.. ఇది రాజ‌కీయంగా మ‌రోసారి వివాదం అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉండ‌డం. హుజూరాబాద్‌లో ఓడిపోవ‌డం.. బీజేపీ దూకుడు పెర‌గ‌డం.. వంటి కీల‌క ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యం.. రాజ‌కీయంగా మ‌రింత సెగ‌లు పుట్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Satya

Recent Posts

హైద‌రాబాద్‌లో ఐమాక్స్… ఒక‌టి కాదు

దేశంలో అత్య‌ధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. గ‌తంలో…

46 minutes ago

తెలంగాణ మీ అయ్య జాగీరా?.. పవన్ ఫైర్

ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…

1 hour ago

ఒక్కడు పోలికకు సైనికుడే దొరికిందా

దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…

2 hours ago

“పాపం… పవన్ కల్యాణ్ ను బలి చేయొద్దు”

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…

3 hours ago

అస్సలు తగ్గనంటున్న గుణశేఖర్

సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…

3 hours ago

సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గరా లలిత్ మోడీ?

బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్‌మ్యాన్‌లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లు ఉండి ఆర్థిక…

4 hours ago