రామేశ్వరం వెళ్లినా.. శనేశ్వరం తప్పలేదన్నట్టుగా ఉంది.. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు.. ఈటల రాజేందర్ పరిస్థితి. గత మే నెలలో.. ఎలాంటి పరిస్థితి ఎదురైందో.. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అయింది. తాజాగా.. ఈటలకు.. ఆయన ఆధ్వర్యంలోని జమున హ్యాచరీస్కు కేసీఆర్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిజానికి గతంలోనే మెదక్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. అయితే.. ఇవి చెల్లవంటూ.. తెలంగాణ హైకోర్టు చెప్పడంతో.. అప్పటి నుంచి మౌనంగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయించింది. దీంతో కేసీఆర్.. ఈటలను వదిలి పెట్టరా? అనే టాక్ వినిపిస్తోంది.
తన కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ కోసం మాజీమంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారని.. పేర్కొంటూ.. గతంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే.. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లదని పేర్కొంది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని సూచించింది.
అంతేకాదు.. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ఆదేశించింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇవ్వమనేలా ఉండకూడదని అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో అప్పటి నుంచి ఈ కేసు విషయంలో.. కేసీఆర్ మౌనంగా ఉన్నప్పటికీ.. ఇటీవల హుజూరాబాద్ ఉప పోరులో ఈటల గెలుపు తర్వాత.. వెంటనే ఆయన తుట్టెను కదిపినట్టు భావిస్తున్నారు.
ముసాయిపేటలోని అసైన్డ్ భూములపై విచారణకు సీఎం కేసీఆర్ తాజాగా విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు ఈటల రాజేందర్కు నోటీసులు అందించారు. అయితే.. ఇది రాజకీయంగా మరోసారి వివాదం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు మౌనంగా ఉండడం. హుజూరాబాద్లో ఓడిపోవడం.. బీజేపీ దూకుడు పెరగడం.. వంటి కీలక పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం.. రాజకీయంగా మరింత సెగలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 8, 2021 2:24 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…