Political News

కేంద్రంతో ఢీ.. కేసీఆర్ ఫైర్‌!

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢీ అంటే ఢీ అంటూ.. ఆయ‌న స‌వాళ్లు రువ్వారు.. టార్గెట్లు పెట్టారు. తాము ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తూ.. ఊరుకున్నామ‌ని.. ఇక‌పై.. కొట్లాటే షురూ! అని ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌పై నిప్పులు చెరిగారు. కేంద్రం అన్ని విధాలా ఈ దేశాన్ని నాశ‌నం చేస్తోంద‌న్న కేసీఆర్.. రైతులు.. ప్ర‌జ‌లు.. సామాన్యుల వ‌ర‌కు మోసం చేస్తూ.. ఆ త‌ప్పుల‌ను రాష్ట్రాల‌పైకి నెడుతోంద‌ని నిప్పులు చెరిగారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాము కొట్లాట ఎందుకులే.. అని ఊరుకున్నామ‌ని..కానీ, ఇక నుంచి తాము కూడా రోడ్డెక్కుతామ‌ని.. స్ప‌ష్టం చేశారు. బీజేపీపై స‌మ‌ర‌మే.. అని స్ప‌ష్టం చేశారు.

ఈ క్ర‌మంలో కేసీఆర్‌.. కేంద్రానికి మూడు టార్గెట్లు పెట్టారు. రైతులు వ్య‌తిరేకిస్తున్న నూత‌న సాగు చ‌ట్టాల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని.. కేసీఆర్ కేంద్రానికి స్ప‌ష్టం చేశారు. అదేస‌మ‌యంలో ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో రాష్ట్రాల‌కు పెడుతున్న అడ్డంకులు తొల‌గించాల‌న్నారు. పెట్రోలు డీజిల్‌పై విధించిన సెస్సును పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ‘2014 లో క్రూడాయిల్ ధ‌ర 105 డాల‌ర్లు. ఇప్పుడు 82 డాల‌ర్లే ఉంది. పెట్రోల్ ధ‌ర‌ల‌పై కేంద్రం అబ‌ద్ధ‌మాడింది. అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు పెరిగాయ‌ని బీజేపీ నేత‌లు అబ‌ద్ధాలు చెబుతున్నారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఏ ఒక్క రోజూ.. క్రూడాయిల్ ధ‌ర 105 డాల‌ర్లు లేదు. ధ‌ర‌లు పెంచే మార్గం ఆపి.. సెస్సులు పెంచుతున్నారు. వీటిని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలి’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు.

అంతేకాదు. ఇక‌పై.. కేంద్రం తీసుకువ‌చ్చే అన్ని చ‌ట్టాల్లోనూ ప్ర‌జ‌ల వ్య‌తిరేకత ఉంటే.. తాముకూడా పోరాటాలు చేస్తామ‌న్నారు. కేంద్రంలో పెద్ద‌లు ఒక‌ర‌కంగా ఉంటే.. రాష్ట్రంలో బీజేపీ సిల్లీ నేత‌లు మ‌రో విధంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌తి విష‌యంలోనూ ఇక‌పై ఊరుకునేది లేద‌ని.. తాము ఉద్య‌మాల నుంచే పుట్టామ‌ని.. ఉద్య‌మాలు త‌మ‌కు కొత్త‌కాద‌ని..కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై తాము గ‌ళం వినిపిస్తామ‌ని చెప్పారు. అన్ని విష‌యాల్లోనూ కేంద్రం తెలంగాణ‌కు అన్యాయం చేస్తోంద‌ని నిప్పులు చెరిగారు. దీనిపై వాడ‌వాడ‌లా తాము ప్ర‌జ‌ల‌ను చైతన్య‌ప‌రుస్తామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విభ‌జ‌న హామీల‌ను కూడా అమ‌లు చేయ‌లేద‌న్నారు. 157 కాలేజీలు దేశ‌వ్యాప్తంగా మంజూరు చేస్తే..ఒక్క‌టి కూడా తెలంగాణ కు ఇవ్వ‌క‌పోవ‌డాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను.. చూస్తే.. కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి రెడీ అవుతున్నార‌నే సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 8, 2021 11:04 am

Share

Recent Posts

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 minute ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

50 minutes ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

58 minutes ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

1 hour ago

థియేటర్లలో వావ్… ఇప్పుడు వామ్మో

కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…

2 hours ago

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

4 hours ago