అమితాసక్తిని రేకెత్తించిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో స్ట్రీమింగ్ మొదలైపోయింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్గా రూపొందుతున్న ఈ షోను ఆహా ప్రొడ్యూస్ చేసింది. దీపావళి కానుకగా ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారమైంది. తొలి అతిథులుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి వచ్చారు. ముందు ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసినపుడే ప్రకంపనలు రేగాయి. బాలయ్య-మోహన్ బాబుల సంభాషణ.. ఒకరికొకరు వేసుకున్న ప్రశ్నలు ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. ఆ ప్రోమోలో అందరినీ ఎంతో ఆకర్షించిన ఓ ప్రశ్న.. నందమూరి తారక రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చావు? అన్నదే. ఈ ప్రశ్నకు బాలయ్య ఏం సమాధానం చెబుతాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. దీనికి బాలయ్య ఇచ్చిన సమాధానం ఏమంటే…?
‘‘మా తెలుగుదేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకంగా. ఆ టైంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అంటూ వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటం కూాడ ేచసింది. నాన్న గారు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. అలాంటిది మనమే పెద్దాయన తర్వాత మేమే పగ్గాలు తీసుకుంటే ఏం బాగుంటుంది? మేం వారసత్వ రాజకీయాలు చేస్తే బాగుండదనే నేను పగ్గాలు తీసుకోలేదు. చంద్రబాబు గారు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. ఆయన కాలేజీ, గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుంచి అన్నీ చూసి వచ్చిన మనషి. ఆయన కాబట్టే ఆ బాధ్యతలు అంత బాగా నిర్వర్తించగలిగాడు. అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగాడు’’ అని బాలయ్య వివరించాడు. ఐతే తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని పగ్గాలందుకోని బాలయ్య.. ఇప్పుడు చంద్రబాబు వారసుడిగా ఆయన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా అడుగులేస్తున్న లోకేష్ను ఎలా సమర్థిస్తున్నారంటూ కౌంటర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో.
This post was last modified on November 5, 2021 8:51 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…