తనకు హుజురాబాద్ కంచుకోట అని బీజేపీ నేత ఈటల రాజేందర్ నిరూపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23, 865 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు అన్ని రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన ఈటల విజయం మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే ఖరారైంది.
మొత్తం 2,05, 536 ఓట్లు పోల్ కాగా, ఈటలకు 1,06,213, గెల్లు శ్రీనివాస్ కు 82,348, కాంగ్రెస్ కు 2767 ఓట్లు వచ్చాయి.
ఈటల గెలుపుతో తెలంగాణవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 2023 ఎన్నికల్లోనూ తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల విజయం సాధించడం ఇది ఏడో సారి. 2004 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన ఈటల…మూడుసార్లు ఉప ఎన్నికల్లో.. నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలిచి హుజురాబాద్ కా బాద్ షా గా నిలిచారు. హుజురాబాద్ ఉప ఎన్నికపై చాలాకాలంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలోకి దిగారు.
ఇక, ఈటల ఓటమే టార్గెట్ గా కేసీఆర్ అండ్ కో పనిచేసింది. అయితే, హుజురాబాద్ లో పోరు హోరాహోరీగా ఉంటుందని, అతి స్వల్ప మెజారిటీకే చాన్స్ ఉందని, అది కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఈటల గెలుపు ఖాయమని, భారీ మెజారిటీ సాధిస్తారని బీజేపీ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈటల 30వేల మెజారిటీతో గెలుస్తారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా షాకింగ్ ప్రకటననిచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఈటల హుజురాబాద్ తన ఇలాకా అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.
This post was last modified on November 3, 2021 6:34 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…